కొండా సురేఖ.. కాంగ్రెస్ తో బంధం తెంపుకున్నట్లే.!
Publish Date:Sep 3, 2026
Advertisement
మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో తెలంగాణలో సరికొత్త సమీకరణాలు మొదలు కానున్నాయి. కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత పార్టీలో ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది. కేబినెట్ నుంచి బర్త్ రఫ్ తో కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిల కథ కాంగ్రెస్ లో ముగిసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక కొండా ఫ్యామిలీ కాంగ్రెస్ లో కొనసాగే అవకాశాలు ఇసుమంతైనా లేవని అంటున్నారు. కొండా సురేఖ.. తన వైఖరితో కాంగ్రెస్ తో బంధాన్ని తెగే వరకూ లాగారన్న మాట రాజకీయవర్గాలలో బలంగా వినిపిస్తోంది. తన వైఖరి కారణంగానే కొండా సురేఖకు హైకమాండ్ వద్ద వాదన వినిపించే చాన్స్ కూడా లేకుండా పోయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు విమర్శలను ఖండించకుండా సురేఖ మొండిగా వ్యవహరించారనీ, దీంతో ఆ క్రమశిక్షణ ఉల్లంఘనను కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా తీసుకుందనీ అంటున్నారు. ఆ కారణంగానే హస్తిన వెళ్లిన కొండా సురేఖకు పార్టీ పెద్దల అప్పాయింట్ మెంట్ కూడా దొరకలేదని చెబుతున్నారు. సంక్షోభం తలెత్తిన ప్రారంభ దశలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొండా సురేఖ స్వయంగా రాఖీ కట్టారు. దీంతో వివాదానికి తెరదించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని అంతి భావించారు. కానీ.. రక్షాబంధన్ రోజున కొండా సురేఖ రేవంత్ నివాసానికి వెళ్లి రాఖీ కట్టడం కేవలం మొక్కుబడి తంతేనన్నట్లుగా ఆ తరువాత ఆమె వైఖరి ఉంది. ఏ దశలోనూ పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు కొండా సురేఖ ప్రయత్నించలేదు. తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధపడినట్లుగా ఆమె ఘర్షణాత్మక వైఖరిని అవలంబించారు. దీంతో చివరకు ఆవమానకరంగా కేబినెట్ నుంచి బర్త్ రఫ్ అయ్యే పరిస్థితి కొని తెచ్చుకున్నారు. అసలు కొండా దంపతుల వైఖరిలో ఎక్కడా రాజీపడే తీరు కనిపించదని వారి గతాన్ని పరిశీలిస్తే అవగతమౌతుంది. గతంలో వైసీపీలోనూ, ఆ తర్వాత బీఆర్ఎస్లోనూ కొండా దంపతులు విభేదించి బయటకు వచ్చారు. ఇప్పుడు తాగాగా కాంగ్రెస్ నుంచి కూడా అదే విధంగా బయటకు వచ్చే పరిస్థితిని తమంత తాముగా కొని తెచ్చుకున్నారు. ఇక వరంగల్ జిల్లాలో కొండా దంపతుల పట్టు కోల్పోయేలా సీఎం రేవంత్ రెడ్డి అప్పుడే పావులు కదపడం మొదలు పెట్టారని పరిశీలకులు ఉదాహరణలతో విశ్లేషిస్తున్నారు. ఆలా కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాల్సిందిగా గవర్నర్ కు సిఫారసు పంపిన రేవంత్ రెడ్డి అలా వరంగల్ జిల్లాలో కొండాకు ప్రత్యామ్నాయంగా గుండు సుధారాణి వంటి బీసీనేతలను తెరమీదకు తీసుకువచ్చారు. అంటే విస్పష్టంగా కాంగ్రెస్ లో వారికి ఇక స్థానం లేదని చెప్పకనే చెప్పారు. [Konda surekha chapter closed in Congress, Cabinet Removed, Konda Surekha, Revanth Reddy, Congress Party, Telangana Cabinet, Konda couple]
http://www.teluguone.com/news/content/konda-surekha-chapter-closed-in-congress-45-230612.html




