జగన్ బొత్సను పక్కన పెట్టేసినట్లేనా?
Publish Date:Aug 26, 2026
Advertisement
వైసీపీలో నాయకుల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందనేది ఎవరూ చెప్పలేరు. వైసీపీలో ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుతం మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందంటున్నారు. పార్టీ పరాజయం తరువాత జగన్ ఎంతో నమ్మకంగా ఉత్తరాంధ్ర పార్టీ పగ్గాలను బొత్సకు అప్పగించారు. అంతే కాకుండా ఎమ్మెల్యేగా పరాజయం పాలైనప్పటికీ బొత్సకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి.. శాసనమండలిలో వైసీపీ పక్ష నేతగా ప్రతిపక్ష హోదా కల్పించారు. అయితే ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇక బొత్స వైఖరి మారిందన్న అనుమానం జగన్ లో కలగడానికి ప్రధాన కారణం ఇటీవలి కాలంలో బొత్స పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోకపోవడమేనంటున్నారు. బొత్స తన కుమారులను రాజకీయాలలోకి తీసుకురావాలని భావిస్తున్నారనీ, 2024లోనే ఆ దిశగా ప్రయత్నించినా జగన్ అందుకు అంగీకరించలేదన్న చర్చ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఇక ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ తరఫున వారు రాజకీయం అరంగేట్రం చేస్తే భవిష్యత్ ఉండదన్న యోచనతో బొత్స చూపు జనసేన వైపు మళ్లిందని చెబుతున్నారు. దీనికి తోడు ఉత్తరాంధ్ర పై బొత్స పెత్తనాన్ని వైసీపీలోని మిగిలిన సీనియర్ నేతలు అంగీకరించడం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ధర్మాన వంటి సీనియర్ నేతలను బొత్స ఇసుమంతైనా పట్టించుకోవడం లేదని అంటున్నారు. బొత్స తీరుపై ధర్మాన ప్రసాదరావు కుమారుడైతే బాహాటంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ కూడా బొత్స విషయంలో పునరాలోచనలో పడి బొత్సను పక్కన పెట్టే యోచనలో పడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. Jagan keep aside Botsa Satyanarayana, YCP Uttarandhra, YCP Politics TeluguOne
అన్నిటికీ మించి.. బొత్స అడుగులు జనసేన వైపు పడుతున్నాయంటూ ఇటీవలి కాలంలో జోరుగా సాగుతున్న ప్రచారాన్ని బొత్స గట్టిగా ఖండించకపోవడంతో జగన్ లో బొత్స ను ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యత నుంచి తప్పించి కొత్త వారికి అప్పగించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు బొత్సకు ప్రత్యామ్నాయంపై బొత్స దృష్టి పెట్టారని పార్టీ వర్గాలే అంటున్నాయి.
http://www.teluguone.com/news/content/jagan-keep-aside-botsa-satyanarayana-45-229912.html




