నిర్భయ కేసులో బాల నేరస్థుడిపై నిఘా ఉంచమని కోరిన తల్లి తండ్రులు

Publish Date:Nov 25, 2015

Advertisement

 

డిల్లీలో జరిగిన నిర్భయ కేసులో అరెస్ట్ అయిన మైనర్ జువైనల్ హోమ్ లో మూడేళ్ళ నిర్బంధం తరువాత వచ్చే నెల 15వ తేదీన విడుదల కాబోతున్నాడు. అతనిని అరెస్ట్ చేసినప్పుడు అతను మైనర్ కనుక అంత హేయమయిన నేరానికి పాల్పడినప్పటికీ, ఇంత తక్కువ శిక్షతో తప్పించుకోగలుగుతున్నాడు.

 

అతనిని బయటకు విడిచిపెట్టిన తరువాత అతను మళ్ళీ అటువంటి నేరాలకి పాల్పడకుండా అతనిపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని కోరుతూ నిర్భయ తల్లి తండ్రులు జాతీయ మానవ హక్కుల కమీషన్ లో ఒక పిటిషన్ వేశారు. అతను జువైనల్ హోమ్ నుండి విడుదల చేసిన తరువాత అతని వలన దేశ ప్రజలు ఎవరికీ ప్రమాదం జరగకుండా చూడవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వంపైనే ఉందని కనుక అటువంటి ఏర్పాట్లు చేయమని కేంద్రాన్ని ఆదేశించవలసిందిగా వారు తమ పిటిషన్ లో కోరారు. కొన్ని దేశాలలో ప్రభుత్వాలు ఇటువంటి హేయమయిన నేరాలకు పాల్పడినవారి ఫోటోలను, వారి పూర్తి వివరాలను అన్ని రాష్ట్రాల పోలీసులకు పంపించి వారు ఎక్కడ ఉన్నప్పటికీ వారిపై నిరంత నిఘా ఏర్పాటు చేస్తుంటారని, ఈ నిర్బయ కేసులో దోషిగా శిక్ష అనుభవించిన వ్యక్తి కోసం భారత్ లో కూడా అటువంటి ఏర్పాటే చేయాలని వారు తమ పిటిషన్ లో కోరారు. వారు ఆ పిటిషన్ కాపీని, దానితో బాటు ఒక వినతి పత్రాన్ని కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాద్ సింగ్ కి సమర్పించి తగు చర్యలు చేపట్టవలసిందిగా అభ్యర్ధించారు.

 

జాతీయ మానవ హక్కుల కమీషన్ కూడా కేంద్రప్రభుత్వానికి, డిల్లీ ప్రభుత్వానికి ఇదే విషయమై నోటీసులు పంపించింది. మూడేళ్ళ నిర్బంధంలో ఆ బాల నేరస్తుడు మానసిక స్థితిలో ఏమయినా మార్పులు వచ్చేయా లేదా? అతని ప్రవర్తనలో సానుకూలమయిన మార్పు వచ్చిందా? లేక ఇంకా అతనిలో నేర ప్రవృతి పెరిగిందా?అతనిని విడుదల చేస్తే అతని వలన ప్రజలకు మళ్ళీ ఎటువంటి హానీ జరుగకుండా ప్రభుత్వం ఏమయినా జాగ్రత్తలు తీసుకొందా? తెలియజేయవలసిందిగా జాతీయ మానవ హక్కుల కమీషన్ కేంద్రాన్ని కోరింది.

 

జువైనల్ చట్టంలోని సెక్షన్ 17(3) ప్రకారం ఆ నేరస్తుడిని విడుదలకు ముందు, ఆ తరువాత ఏమయినా చర్యలు తీసుకొందా లేదా? తీసుకొంటే ఎటువంటి చర్యలు తీసుకొంది? అనే విషయాలను తమకు తెలియజేయవలసిందిగా జాతీయ మానవ హక్కుల కమీషన్ డిల్లీ ప్రభుత్వాన్ని కోరింది.

 

కొన్ని నెలల క్రితం మీడియాలో ఆ బాల నేరస్థుడి గురించి కొన్ని ఆసక్తి కరమయిన వ్యాఖ్యలు వచ్చేయి. అతను, డిల్లీలో ఉగ్రవాద చర్యలకు సహకరించిన మరొక బాలనేరస్తుడితో స్నేహం చేస్తూ, అతని వద్ద నుండి ఉగ్రవాదం గురించి తెలుసుకొంటున్నట్లు నిఘావర్గాలు కనుగొనడంతో, వారి సలహా మేరకు జువైనల్ హోమ్ అధికారులు అతనిని వేరే సెల్ లోకి మార్చినట్లు వార్తలు వచ్చేయి. అంటే అతను ఒక హేయమయిన నేరం చేసిన తరువాత జువైనల్ హోమ్ లో మూడేళ్ళ నిర్బంధంలో సంస్కరించబడలేదు పైగా ఉగ్రవాదం పట్ల ఆసక్తి పెంచుకొన్నట్లు అర్ధం అవుతోంది. అటువంటి నేర ప్రవృతి ఉన్న వ్యక్తిని స్వేచ్చగా విడిచిపెట్టినట్లయితే ఏమవుతుందో తేలికగానే ఊహించవచ్చును. కనుక నిర్భయ తల్లితండ్రుల అభ్యర్ధనను, వారు సూచిస్తున్న సలహాను పాటించడమే మంచిది.

By
en-us Political News

  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.