ప్రశ్నించడానికి ఇంత టైం తీసుకొంటే ఎలా పవనూ?

Publish Date:Mar 5, 2015

Advertisement

 

నిజమే! పవన్ కళ్యాణ్ నిజాయితీని శంఖించడానికి వీలులేదు. ఆయన ఏది మాట్లాడిన చాలా నిజాయితీగా హృదయంతోనే మాట్లాడుతారు తప్ప సగటు రాజకీయ నాయకుడిలా ఎన్నడూ వ్యవహరించరని అందరికీ తెలుసు. ఆ కారణంగానే ఆయన రాజకీయాలకి అసలు సరిపోరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి నేటి వరకు కూడా సందిగ్ధంలోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. తన సోదరుడు చిరంజీవి ఎదుర్కొన్న చేదు అనుభవాలను చూసిన తరువాత కూడా ఆయన ఎంతో అట్టహాసంగా జనసేన పార్టీని స్థాపించారు. కానీ రెండో సమావేశంతోనే దానిని అటకెక్కించారు. అధికారం కోసం కాదు ప్రశ్నించడానికే రాజకీయాలలోకి వచ్చేనని చెప్పి అభిమానులను నిరాశపరిచారు.

 

తరువాత అహ్మదాబాద్ వెళ్లి మోడీని కలిసి ఆయనకి మద్దతు తెలిపారు. అయితే బీజేపీకి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ దానితో పొత్తులు పెట్టుకొన్న తెదేపా గురించి మాట్లాడకుండా చాలా రోజులు మౌనం వహించారు. కానీ తరువాత తెదేపాకు కూడా మద్దతు ఇచ్చేరు. ఆ రెండు పార్టీల తరపున ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో గట్టిగా ప్రచారం చేసారు. అవసరమయితే వాటినీ ప్రశ్నిస్తానని చెప్పిన వ్యక్తి ఆ తరువాత మళ్ళీ సినిమాలలోకి వెళ్ళిపోయారు.

 

గత తొమ్మిది నెలలుగా ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య అనేక సమస్యలు తలెత్తాయి. ఇరు రాష్ట్రాలు విభిన్న సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమస్యల పరిష్కారం కోసం, నిధుల కోసం, ప్రాజెక్టుల కోసం కేంద్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. రాజకీయాలలో ఉండాలనుకొన్న ఏ వ్యక్తి అయినా ఇటువంటి సందర్భాలలో తప్పనిసరిగా స్పందిస్తాడని ప్రజలు ఆశిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఏనాడు ఏ విషయంపైనా స్పందించలేదు. ఆయన ప్రశ్నించడానికే పార్టీ పెట్టి ఉండవచ్చును. కానీ సమయం కాని సమయంలో ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.

 

తుళ్ళూరులో రాజధాని నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించినపుడు అన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి ఒక్క జనసేన తప్ప. భూసేకరణ విషయంలో కూడా అన్ని పార్టీలు స్పందించాయి. ఒక్క జనసేన తప్ప. పవన్ కళ్యాణ్ తెదేపాకు మద్దతు ఇస్తున్నారు గనుకనే స్పందించడం లేదని జనాలు సరిబెట్టుకొన్నారు. అందుకే ఆయనను ఎవరూ కూడా ప్రశ్నించలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కార్యక్రమం పూర్తయిందని ప్రకటించి, రాజధాని నిర్మాణానికి శంఖు స్థాపన తేదీలను కూడా ఇంచుమించు ఖరారు చేసిన తరువాత ఇప్పుడు అకస్మాత్తుగా ఊడిపడి భూసేకరణను తను వ్యతిరేకిస్తున్నానని, అవసరమయితే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానని తను మద్దతు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపైనే యుద్దం ప్రకటించడంతో ఆయన అభిమానులు, ప్రజలు, రాజకీయ నేతలు కూడా విస్తుపోయారు.

 

ఆయన భూసేకరణను వ్యతిరేకిస్తున్నట్లయితే మరి ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉండిపోయారు. ఆ ప్రక్రియ ముగిసిన తరువాత ఇప్పుడు వచ్చి ఎందుకు హడావుడి చేస్తున్నారు? ఒకవేళ ఆయన ఈ ప్రక్రియ ఆరంభం కాక మునుపే వచ్చి అడ్డుకొనే ప్రయత్నం చేసి ఉండి ఉంటే, బహుశః రాష్ట్ర ప్రజలు చాలా మంది ఆయనకు మద్దతు పలికేవారేమో. కానీ అంతా పూర్తయిన తరువాత ఇప్పుడు వచ్చి హడావుడి చేయడం వలన ఆయన ఏమి సాధించదలచుకొన్నారు?

 

రైతుల భూములు తిరిగి ఇప్పించాలని భావిస్తే, అదిప్పుడు సాధ్యమేనా? సాధ్యమేననుకొంటే రాజధాని నిర్మాణం నిలిపివేయాలా...లేక రాజధానిని వేరే చోటికి తరలించాలా? అనే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

 

ఇక ఇంతకాలం రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రత్యేక హోదా, ప్రాజెక్టుల గురించి కేంద్రప్రభుత్వం రేపు...మాపు...అంటూ  తిప్పిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? మోడీతో తనకున్న పరిచయాన్ని ఉపయోగించుకొని ఎందుకు ఆయనపై ఒత్తిడి చేయకుండా మౌనంగా ఊరుకొన్నారు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయిన తరువాత వచ్చి ఆయనని ప్రశ్నించడం వలన ఏమి ప్రయోజనం? కేంద్రాన్ని ఒప్పించే భాద్యత యంపీలదేనని ఒకపక్క చెపుతూనే మళ్ళీ మధ్యలో తను కలుగజేసుకోవడం ఎందుకు? తను కలుగజేసుకొన్నా ఎటువంటి ప్రయోజనమూ ఉండదని మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు?

 

రాజకీయాలలో ఉండదలచిన వ్యక్తులు ఎవరయినా సరే ఏ అంశంపైనైనా సరయిన సమయంలో స్పందించినపుడే దానికి ఒక విలువ, ప్రజల మన్ననలు ఉంటాయి. కానీ ఆనాడు నేను తెలంగాణా ఉద్యమాలకి ఎందుకు మద్దతు పలకలేదంటే...ఆనాడు నేను ఎన్నికలలో ఎందుకు పాల్గొననలేదంటే...ఆనాడు నేను భూసేకరణ గురించి ఎందుకు పోరాడలేదంటే...ఆనాడు నేను ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రశ్నించలేదంటే....అని సంజాయిషీలు చెప్పుకోవడాన్ని ఎవరూ హర్షించరు. రాజకీయాలలో అది పద్ధతి కాదు కూడా. కనుక ఇప్పుడు ఆందోళనకు, నిరాహార దీక్షలకు దిగడం కంటే, అటు రైతులు నష్టపోకుండా, రాజధాని నిర్మాణానికి ఆటంకం ఏర్పడకుండా ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించవచ్చో ఆలోచించి ప్రభుత్వానికి తగిన సూచనలు ఇస్తే బాగుంటుంది.

By
en-us Political News

  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.