జనం కోసమే జీవిస్తున్న జగనన్ననే అనుమానిస్తే ఎలా?

Publish Date:Mar 4, 2015

Advertisement

 

ఏమిటో...ఈ పాడు లోకం ఎప్పుడూ మంచి వాళ్ళనే అనుమానిస్తుంటుంది. నీతి నిజాయితీ, మడమ తిప్పని గుణం, ఇచ్చిన మాట కోసం ఎన్ని లక్షల మందినయినా ఓదార్చే ఓర్పు, నేర్పు అన్నీ ఉన్నా కూడా పాపం జగన్మోహన్ రెడ్డిని జనాలు ఇంకా అనుమానిస్తూనే ఉంటారు. తెలంగాణా ప్రభుత్వం ఆంధ్రాప్రభుత్వంతో చెడుగుడు ఆడేసుకొంటుంటే మధ్యలో దూరడం భావ్యం కాదు కనుక ఆయన దూరంగా కూర్చొని చూస్తుంటే, దానికి జనాలు తప్పు పడతారు. ఆంద్ర ప్రయోజనాలు కాపడవలసింది పోయి ఆంధ్రాలో తెరాస ఏజంటుగా వ్యవహరిస్తున్నావంటూ దెప్పిపొడుస్తుంటారు. ఆంధ్రా ప్రయోజనాలను కాపాడటం లేదని ఆయనని ఆడిపోసుకొన్న వాళ్ళే, ఆయన రాష్ట్రానికి నిధులు విడుదల చేయమని అడిగేందుకు డిల్లీ వెళ్లి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని కలిస్తే అనుమానంగా చూస్తూ ‘సీబీఐ కేసులు మాఫీ చేయించుకోవడానికే వెళ్ళేరేమో...ఏమో ఎవరికీ తెలుసు? అంటూ మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతూ ప్రజల కోసమే కేటాయించిన ఆయన సున్నితమయిన మనసుని కుళ్ళబొడిచేసి ఆనందిస్తుంటారు.

 

పోనీ డిల్లీ వెళ్ళకుండా పక్కనే ఉన్న తుళ్ళూరు వెళ్ళినా రాజధాని కట్టనీయకుండా సైంధవుడిలా అడ్డుతగులుతున్నాడు” అని ఆక్షేపిస్తారు జనాలు. కేంద్రం రాష్ట్రానికి ఎందుకు నిధులు ఇవ్వలేదు? ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు? రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదు? పోలవరం కోసం, రాజధాని కోసం ఎందుకు నిధులు ఇవ్వడం లేదు? అని రాష్ట్రంలో జనాలు అందరూ గగ్గోలు పెట్టేస్తుంటే ఆంధ్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే రాజకీయాలలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదంటూ జనాలు ఆయనను ప్రశ్నించడం మరీ అన్యాయం. ఎందుకంటే ఆయన ప్రశ్నించడం కోసం రాజకీయాలలోకి రాలేదు. ఏదోలాగ ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకే జగన్ రాజకీయాలలోకి వచ్చిన సంగతి మరిచిపోయి, ఇలా మరొకరు చేయవలసిన పనిని ఆయనని చేయమనడం ఏమి బావుంది? ప్రశించడం కోసం వేరే వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆయనకు అధికారం అక్కరలేదు. అతనిని వదిలిపెట్టి మళ్ళీ రాష్ట్రానికి స్వర్ణ యుగం తీసుకువచ్చేందుకు కంకణం కట్టుకొన్న వ్యక్తిని పట్టుకొని జనాలు ఇలా ప్రశ్నించడం ఏమీ బాలేదు.

 

ఏ రాజకీయ నాయకుడయినా ఏ అంశంపైనైనా స్పందించకుండా సైలెంట్ గా ఉండిపోయాడంటే అది కూడా వ్యూహాత్మకమేనని కొత్త సూత్రం కనుగొన్న తరువాత కూడా ఇలా జనాలు అపార్ధం చేసేసుకోనవసరం లేదు. రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిపోతోందని అందరూ గగ్గోలు పెడుతున్నప్పటికీ జగన్ సైలంట్ గా ఉండిపోతే దానినీ సీబీఐ కేసులకి లింక్ పెట్టేయడమేనా? ఎంత అన్యాయం? అయినా ఇప్పుడు మౌనంగా ఉండిపోయినంత మాత్రాన్న సీబీఐ కేసులు మాఫీ అయిపోతాయా...? అని కూడా ఆలోచించకుండా జనాలు నోటికి వచ్చినట్లు ఏవేవో చెప్పేసుకొంటుంటారు. ఈరోజు కాకపోతే రేపయినా బీజేపీతో జత కట్టేందుకే జగన్ బాబు వ్యూహాత్మకంగా సైలెన్స్ మెయిన్ టెయిన్ చేస్తున్నాడంటూ జనాలు తమ రాజకీయ పరిజ్ఞానం ప్రదర్శించేసుకొంటుంటే పాపం జగన్ మాత్రం ఏమి చేయగలడు?

 

డిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలిస్తే ఒక తప్పు. కేంద్రాన్ని ప్రశ్నించకపోతే మరో తప్పు అంటే ఇంకా ఎలాగా బ్రతాకాలి? మంచి వాళ్ళకే అన్ని కష్టాలు వస్తాయి. నీతి నిజాయితీని నమ్ముకొన్నవాళ్ళకే ఈ నీలాపనిందలు భరించవలసివస్తుంది. మడమ తిప్పలేని వాళ్ళకే ఆ నొప్పి ఏమిటో తెలుస్తుంది...కానీ జనాలకి ఇవేమీ అర్ధం కావు. కనుక ముఖ్యమంత్రి అయ్యే వరకు మౌనంగా భరించక తప్పదు. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యేదెప్పుడు? అనే ప్రశ్నకు ఆయనే జోస్యం చెప్పాలి. ఎందుకంటే అందులో ఆయనకు ఆయనే సాటి.

 

కానీ ఇంతకు ముందు ఎన్నికలలో చెప్పుకొన్న జోస్యాలేవే ఎందుకో ఫలించలేదు. ఎందుకేమిటి...తను నీతి నిజాయితీకి కట్టుబడిపోవడం వలననే ఓడిపోయాడు...లేకపోతేనా...అప్పుడు ఎన్నికల హడావుడిలో ఏవో తప్పు లెక్కలు కట్టుకోవడం వలన జోస్యం ఫలించలేదేమో గానీ ఇప్పుడు మరే పని లేదు కనుక ఈసారి చెపుతున్న జోస్యం ఫలిస్తుందని జగన్ తన చిలక సాక్షిగా చెపుతున్నాడు. కానీ ఇప్పుడు కూడా ప్రజలెన్నుకొన్న ప్రభుత్వం ఎప్పుడు కుప్పకూలిపోతుందో జోస్యం చెప్పగలుగుతున్నాడు గానీ తను ఎప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడో, తన భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందో మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాడు పాపం.

By
en-us Political News

  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.