ఒకే నాలికతో ఎన్ని మాటలో...

Publish Date:Apr 30, 2015

Advertisement

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న హైదరాబాద్ లో జరిగిన తెరాస బహిరంగ సభలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి చాలా చులకనగా మాట్లాడి మళ్ళీ తన నోటి దురుసు ప్రదర్శించుకొన్నారని చాలా మంది అభిప్రాయపడ్డారు.

 

ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీ సభలో కేసీఆర్ మాట్లాడుతూ “ప్రస్తుతం ఆయన (చంద్రబాబు నాయుడు) ఒక రాజధాని, అసెంబ్లీ కనీసం ఒక హైకోర్టు కూడా లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తెలంగాణా రాష్ట్రానికి చెందిన భవనాలలో ఉంటూ తన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు,” అని చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి అన్నారు.

 

అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఆంధ్రా మంత్రులు, ఉద్యోగులు అందరూ మనకి అతిధులవంటి వారు. వారిని మనం ఎంత బాగా చూసుకొంటే వారు అంతకాలం ఇక్కడ ఉంటూ మనకి పన్నులు చెల్లిస్తుంటారు. కనుక వారిని మనం చాలా జాగ్రత్తగా, గౌరవంగా చూసుకోవాలి,” అని హితబోధ చేసారు. అటువంటప్పుడు మళ్ళీ “ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రికి హైదరాబాద్ లో ఏమి పని?” అంటూ ప్రశ్నించడం ఎందుకని ప్రజలు అడుగుతున్నారు.

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి పట్ల కేసీఆర్ కి ఎటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ, ఆయనకి ఇష్టమున్నా లేకపోయినా ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకి హైదరాబాద్ మరో 9 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగానే ఉంటుందనేది ఎవరూ కాదనలేని సత్యం. ఒకవేళ అంతవరకు కూడా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ నుండే రాష్ట్రాన్ని పరిపాలించాలనుకొంటే దానికి ఎవరు కూడా అభ్యంతరం చెప్పడానికి వీలులేదు. ఈ సంగతి అపార రాజకీయ అనుభవమున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలియదనుకోలేము. అయినా కూడా ఆయన ఆవిధంగా మాట్లాడటం వలన ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమాదం ఉంది. సాటి ముఖ్యమంత్రి, ఒకప్పుడు తనకి రాజకీయ గురువు అయిన చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి “ఆయనొక రాజధాని, అసెంబ్లీ, హైకోర్టు లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రి” అని కేసీఆర్ హేళన చేయడం సబబు కాదని రాజకీయ వర్గాలలోనే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

వాస్తవిక దృష్టితో దీనిని చూసినట్లయితే ఇందులో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కానీ, ఉద్యోగులని గానీ నిందిచడానికి ఏమీ లేదని అర్ధమవుతుంది. తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్ చేస్తున్న ఉద్యమాల కారణంగా, తరుముకొస్తున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం హడావుడిగా రాష్ట్ర విభజన చేసింది. రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసి ఉన్నప్పటికీ ఈ వ్యవహారాన్ని పదేళ్ళపాటు నాన్చిన కాంగ్రెస్ అధిష్టానం అదే సమయంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధానిని, హైకోర్టును, అసెంబ్లీ తదితర భవనాలను ఏర్పాటు చేసి ఉండి ఉంటే నేడు ఇటువంటి దుస్థితి ఉండేది కాదు. కనీసం విభజన చేసే ముందయినా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించినా బహుశః ఇటువంటి అవహేళనలు ఎదుర్కోవలసిన అగత్యం ఉండేది కాదు. కానీ యూపీఏ ప్రభుత్వం ఎంత త్వరగా ఈ వ్యవహారం నుండి చేతులు దులుపుకొని తప్పు కొందామా..అని ఆలోచిందే తప్ప దాని పర్యవసానాల గురించి ఆలోచించదానికి కూడ ఇష్టపడలేదు. కనుక యూపీయే ప్రభుత్వం చేసిన తప్పులకి ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను, ఉద్యోగులను గురించి చులకనగా మాట్లాడటం వలన ఇరురాష్ట్రాల మధ్య మరింత దూరం పెరుగుతుందే తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండబోదని చెప్పవచ్చును.

 

అయినా ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పూర్తయ్యేలోగానే విజయవాడకు తరలిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఉద్యమాల సమయంలో తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అటువంటి మాటాలు మాట్లాడవలసి వచ్చింది తప్ప ఆంద్ర ప్రజలు, ఉద్యోగులు అంటే తనకి చాలా గౌరవమని కేసీఆరే స్వయంగా చెప్పుకొన్నారు. ఆ మాటలు నిజమనుకొంటే ఆయన లేదా మంత్రులు గానీ ఈవిధంగా మాట్లాడటం అనవసరం. ఒకవేళ తెదేపాతో ఇబ్బంది ఉన్నట్లయితే దానిని రాజకీయంగా ఎదుర్కోవడమే మంచి పద్ధతని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.