కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స బీజేపీలో చేరబోతున్నారా?

Publish Date:Nov 26, 2014

Advertisement

 

ఆ మధ్య ఎప్పుడో మాజీ పి.సి.సి. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఆ వార్తలను ఖండించలేదు. కానీ ఆ తరువాత జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు హాజరవడంతో ఆయన పార్టీ మారకపోవచ్చని అందరు భావించారు. కానీ మళ్ళీ మరోమారు ఆయన బీజేపీలో చేరడంపై వార్తలు వస్తుండటం గమనిస్తే నిప్పు లేనిదే పొగ రాదు కదా! అనిపిస్తుంది.

 

ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని తపించిపోయిన బొత్స సత్యనారాయణ మొదటి నుండి రాష్ట్రం విడిపోయేవరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. పైగా రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ అధిష్టానం ఆయనను పి.సి.సి.అధ్యక్ష పదవి నుండి కూడా తొలగించి ఆయన స్థానంలో రఘువీర రెడ్డిని కూర్చోబెట్టడంతో అంతకాలం ఒక వెలుగు వెలిగిన ఆయనకు పార్టీకి కూడా పనికిరానివాడయిపోయారు. ఆ తరువాత జరిగిన ఎన్నికలలో విజయనగరం జిల్లా ప్రజలు ఆయనతో సహా ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా తిరస్కరించడంతో ఆయన రాజకీయ జీవితం ఆఖరు దశకు చేరినట్లయింది. కానీ ఆయన తన సుదీర్గ రాజకీయ ప్రయాణంలో ఇటువంటి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కనుక ఆయన రాజకీయ ఖాతాను అంత తేలికగా మూసివేయలేమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వారి అంచనాలను నిజం చేస్తున్నట్లుగా ఇప్పుడు ఈ వార్తలు వినిపిస్తున్నాయి.

 

వచ్చే ఎన్నికల నాటికి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆరాటపడుతున్న బీజేపీ దృష్టి కాపు సామాజిక వర్గం మీద పడింది. అంతకు ముందు బీజేపీలో చేరిన కావూరి సాంబశివరావు రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ నేతలందరినీ బీజేపీలోకి రప్పించేందుకు తెరవెనుక గట్టిగా కృషిచేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. బహుశః ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించడం వలననేమో కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కన్నా లక్ష్మీనారాయణ చడీ చప్పుడు లేకుండా అకస్మాత్తుగా ఒకరోజు బీజేపీలో చేరిపోయారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను, బీజేపీ అమలుచేస్తున్న ఈ ‘పంచవర్ష ప్రణాళిక’ను పరిగణనలోకి తీసుకొని చూసినట్లయితే, బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది.

 

ఆయన ఆర్ధికంగా, రాజకీయంగా మంచి బలమున్న నాయకుడే కావచ్చును. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావచ్చును. కానీ ముఖ్యమంత్రి కావాలనే పదవీ లాలసతో  కాంగ్రెస్ అధిష్టానాన్ని రాష్ట్ర విభజనకు ఆయనే ప్రోత్సహించారనే భావన ప్రజలలో బలంగా నాటుకొనిపోయుంది. కనుక ఒక్క విజయనగరం జిల్లాలోనే కాక రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలలో కూడా ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారనే సంగతి కూడా బీజేపీ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. అయితే ఈ వ్యతిరేకత ఎల్లకాలం అలాగే ఉండిపోదు గనుక బీజేపీ ఆయనను పార్టీలో చేర్చుకొన్నా ఆశ్చర్యం లేదు.

 

అదే జరిగితే ముందుగా విజయనగరం జిల్లాకే చెందిన కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుకు, తెదేపాకు కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కనుక ఆయన తీవ్రంగా వ్యతిరేకించవచ్చును. కనుక బీజేపీ ఈ విషయంలో చాలా ఆచితూచి నిర్ణయం తీసుకొనవలసి ఉంటుంది. ఇక మరో విషయం ఏమిటంటే ఆయన తీవ్రంగా వ్యతిరేకించే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా బీజేపీలో చేరాలనుకొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏవిధంగా చూసుకొన్న బొత్సతో పోలిస్తే ప్రజలలో కిరణ్ కుమార్ రెడ్డికే మంచి పేరుంది. కనుక ఒకవేళ ఆయన పార్టీలో చేరెందుకు ఆసక్తి చూపిస్తే బొత్సకు బీజేపీలో ప్రవేశం దొరుకుతుందా లేదా? అనే విషయం తెలుసుకొనేందుకు మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. 

By
en-us Political News

  
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.