జమ్మూ కాశ్మీరులో బీజేపీ అధికారంలోకి వస్తుందా?

Publish Date:Nov 26, 2014

Advertisement

 

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నిన్న జరిగిన మొదటి దశ ఎన్నికలలో 71.3శాతం పోలింగ్ నమోదు అయింది. అందుకు ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో చేసిన ఎన్నికల ప్రచారమేనని ప్రత్యేకంగా చెప్పుకొనవసరం లేదు. మోడీ కారణంగానే ఓటింగ్ శాతం పెరిగిందని ఎందుకు చెప్పవచ్చునంటే గత ఎన్నికలలో ఆయన ప్రభావం లేనప్పుడు కేవలం 65 శాతమే నమోదు అయింది కనుక. మోడీ కారణంగానే పోలింగ్ శాతం పెరగడం నిజమనుకొంటే, ప్రజలు బీజేపీకే ఓటువేసి ఉండవచ్చును కనుక ఆ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని భావించవచ్చును.

 

అయితే కేవలం మోడీ కారణంగానే పోలింగ్ శాతం పెరిగిందని చెప్పడం కూడా సరికాదు. ఎవరయినా పోలింగ్ కి అంతరాయం కలిగిస్తే వారిని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ఎన్నికల కమీషన్ చాలా భారీ భద్రతా ఏర్పాట్లు చేసిందని కాశ్మీరీ వేర్పాటువాదులే స్వయంగా అంగీకరించడం గమనిస్తే, ఎన్నికల కమీషన్ చేసిన ప్రయత్నాలు కూడా పోలింగ్ పెరిగేందుకు దోహదపడ్డాయని భావించవచ్చును. మొదటి దశ ఎన్నికలలో మారు మూల గ్రామాల నుండి ప్రజలను పోలింగ్ బూతులకు తరలించేందుకు ఏకంగా 43 హెలికాఫ్టర్లను వాడటమే అందుకు మంచి నిదర్శనంగా చెప్పవచ్చును. కాశ్మీరీ వేర్పాటు వాదులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చినప్పటికీ, భారీగా ప్రజలు తరలివచ్చి ఓట్లు వేయడం మరో మంచి ఉదాహరణ. భద్రత దళాలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినందునే ఎక్కడా ఎటువంటి ఆవంచనీయమయిన సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా మొదటి దశ ఎన్నికలు ముగిసాయి.

 

పోలింగ్ శాతం పెరగడానికి ఇంకా మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో నేటివరకు కూడా అశాంతి నెలకొని ఉంది. అందుకు రాష్ట్రాన్ని పాలించిన ఫరూక్ అబ్దుల్లా, అతని కొడుకు ఒమర్ అబ్దుల్లా, వారితో చేతులు కలిపిన కాంగ్రెస్ పార్టీలనే నిందించవలసి ఉంటుంది. వేర్పాటువాదులను ఉక్కుపాదంతో అణచి వేయవలసిన ప్రభుత్వాలు వారితో చర్చలు చేయడంతో వారు క్రమంగా బలపడ్డారు. వారికి పాకిస్తాన్ తీవ్రవాదులు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుండటంతో భూతల స్వర్గమని చెప్పుకోవలసిన జమ్మూ-కాశ్మీరు రాష్ట్రం ఒక భయానక శాశ్విత యుద్దభూమిగా మారిపోయింది. తత్ఫలితంగా ఆ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఆ పరిస్థితికి విసిగి వేసారి పోయిన ప్రజలకు బహుశః మోడీ ఒక ఆశాకిరణంగా కనిపించి ఉండవచ్చును. ఆయన చైనా, పాకిస్తాన్ దేశాలతో కటువుగా వ్యవహరిస్తున్న తీరు చూసిన తరువాతనే కాశ్మీరీ ప్రజలలో ఆయన పట్ల నమ్మకం కలిగి ఉండవచ్చును. అయితే కేవలం ఓటింగ్ శాతం పెరిగినంత మాత్రాన్న ప్రజలు బీజేపీకే ఓటేసి ఉంటారని అనుకోవడానికి కూడా లేదు. కానీ ఆ అవకాశాలున్నాయని భావించవచ్చును.

 

అయితే పెరిగిన ఈ ఓటింగ్ శాతం వలన ప్రస్తుతం అధికారంలో ఉన్న ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం పూర్తిగా తుడిచిపెట్టుకు పోవచ్చును. ఎందుకంటే ఇటీవల సెప్టెంబర్ నెలలో కాశ్మీరులో వరదలు వచ్చినప్పుడు ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో వారిని ఆదుకోవడానికి కేంద్రప్రభుత్వం పెద్ద ఎత్తున చేప్పటిన సహాయ పునరావాస చర్యలను ప్రజలు ప్రశంసిస్తున్నారు. అయినా వారు బీజేపీకి పట్టం కట్టే ఆలోచనలో లేకపోతే అప్పుడు ప్రత్యామ్నాయంగా ఉన్న పిడి.పి.కి పట్టం కట్టే అవకాశాలున్నాయి. కానీ ఒకవేళ జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో బీజేపీ కనుక విజయం సాధించి అధికారంలోకి వస్తే ఇక మోడీకి తిరుగు ఉండదని చెప్పవచ్చును. అదేవిధంగా అక్కడ పరిస్థితులలో చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు పూర్తయ్యి ఫలితాలు వెలువడితే గానీ ఎవరు గెలుస్తారో ఊహించలేము కానీ ఇమార్ అబ్దుల్లా ప్రభుత్వం మాత్రం మటుమాయం అవడం తధ్యమని ఖచ్చితంగా చెప్పవచ్చును.

By
en-us Political News

  
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.