పీరియడ్స్ నొప్పికి మహిళలు వాడే ఈ టాబ్లెట్ ఎంత డేంజరో తెలుసా? దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలను అయినా ఒకటి రెండు రోజులు భరించగలరు చాలామంది. కానీ నొప్పులను మాత్రం అస్సలు భరించలేరు. దీనికి కారణం ఏ పని చేయాలన్నా శరీరంలో వివిధ అవయవాలు, భాగాలు నొప్పితో సహకరించకపోవడమే. అందుకే నొప్పులు రాగానే మొదట టాబ్లెట్స్ తెచ్చుకుని వేసుకుంటారు. ఇలాంటి నొప్పి మాత్రలలో మెప్టాల్ కూడా ఒకటి. ఇది సాధారణ నొప్పులకే కాకుండా పీరియడ్స్ సమయంలో మహిళలకు ఎదురయ్యే సమస్యలను కూడా తగ్గిస్తుంది. సాధారణంగా నొప్పుల మాత్రలు 15నిమిషాలలోనే వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే మెప్టాల్ కు సంబంధించి సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మాత్ర ఉపయోగించడం తగ్గించమని చెప్పింది. అసలు ఈ మాత్ర విషయంలో కేంద్ర ప్రభుత్వం, వైద్యులు ఏం చెబుతున్నారు? ఇది వాడటం ప్రమాదం ఎందుకు? పూర్తీగా తెలుసుకుంటే.. అసలు సమస్య ఇదీ.. అసలు సమస్య ఏంటంటే.. ఎలాంటి ఆందోళన లేకుండా ఈ పెయిన్ కిల్లర్ వాడుతున్నారు. ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ అయినప్పటికీ, పీరియడ్స్ లో వచ్చే కడుపునొప్పి, కండరాల తిమ్మిర్లు, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, అధిక జ్వరం నుండి ఉపశమనం పొందడానికి ఫెనామిక్ యాసిడ్ భారతదేశంలో సర్వసాధారణంగా ఉపయోగించబడుతుంది. ఇది Meftal, Mefkind, Mefnorm, Ibuklin P పేర్లతో విక్రయించబడుతోంది. డ్రగ్ సిండ్రోమ్.. మెప్టాల్ టాబ్లెట్ ఉపయోగించడం వల్ల చాలామందిలో డ్రగ్ సిండ్రోమ్ ఎదువుతుంది. డ్రగ్ సిండ్రోమ్ అనేది మందులు తీసుకున్న తరువాత దాదాపు 10శాతం మందిని ప్రభావితం చేస్తుంది. దీంట్లో ఇసినోపిలియా, శారీరక లక్షణాలు కూడా ఉంటాయి. జ్వరం, చర్మం పై దద్దుర్లు, లెంఫాడెనోపతి, హెమటోలాజికల్ వంటి అసాధారణ లక్షణాలు మందులు తీసుకున్న రెండు నుండి ఎనిమిది వారాల తరువాత కనిపించడం ప్రారంభిస్తాయి. దీనికి పరిష్కారం కంటే సమస్య రాకుండా జాగ్రత్త పడటం ఉత్తమం. ఈ మందుల వినియోగానికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఆప్షన్స్.. మెఫెనామిక్ యాసిడ్ మందులపై ఒక హెచ్చరిక కూడా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శోరరస కణువులలో వాపు పెరుగుతుంది. మెఫెనామిక్ యాసిడ్ మందులు ఎవరైనా ఉపయోగిస్తంటే వాటికి ప్రత్యామ్నాయ మందుల గురించి ఆలోచించాలి. మెప్టాల్ మందులు ఎక్కువ కాలం తీసుకుంటే అవి కడుపులో అల్సర్, రక్తప్రసరణ, పొట్టకు సంబంధించిన సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే జీర్ణసంబంధ సమస్యలు ఉన్నవారు ఈ మందులకు ప్రత్యామ్నాయం గురించి వైద్యులను అడిగి తెలుసుకుని వేరే మందులు ఉపయోగించాలి. అసలు సమస్యలివీ.. మెఫ్టాల్ మాత్రలు హృదయనాళ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ మందుల వల్ల హృదయ సంబంధ సమస్యలు పెరుగుతాయి. ఇప్పటికే గుండె సంబంధ జబ్బులు ఉన్నవారు మెప్టాల్ ను వినియోగించకపోవడమే మంచిది. ఇది కిడ్నీ సమస్యలను కూడా పెంచుతుంది. *నిశ్శబ్ద.
చలికాలంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. గర్బిణుల్లో ఆ సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటికి తోడుగా జలుబు, దగ్గు, కీళ్లు పట్టేయడం, పొడి చర్మం వంటిసమస్యలు పెను సవాళ్లుగా మారుతుంటాయి. సాధారణంగానే రోగనిరోధోకశక్తి తక్కువగా ఉంటే గర్భిణులకు చలికాలం గడ్డుకాలమే. అలాని పెద్దగా భయపడాల్సిన అవసరంలేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో గర్భిణీలు ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఎక్కువ నీళ్లు తాగాలి: వాతావరణం చల్లగా ఉంటే అస్సలు దాహం వేయదు. అలాని నీళ్లు తాగకుండా ఉంటే డీహైడ్రేషన్ బారినపడే ప్రమాదం ఉంటుంది. గర్భిణులు ఈ విషయం మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే శరీరంలో నీటిస్థాయి లేనట్లయితే ఉమ్మనీరు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇది బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు ఇది ఇలానే కొనసాగితే నెలలు నిండకుండానే బిడ్డ పుట్టె అవకాశం ఉంటుంది. కాబట్టి కాలమేదైనా వైద్యుల సలహా మేరకు తగిన మోతాదులో నీళ్లు తాగడం మంచిది. కొబ్బరి నీళ్లు తాగినా మంచి ఫలితం ఉంటుంది. కీళ్లనొప్పులు: చలికాలంలో చాలామందిని వేధించే సమస్యల్లో కీళ్ల నొప్పులు కూడా ఒకటి. చల్లగాలులకు శరీరంలోని రక్తనాళాలు కుచించుకుపోయి రక్తప్రసరణ నెమ్మదిగా జరుగుతుంది. దీంతో కండరాలు, కీళ్లు బిగుసుకుపోతాయి. అంతేకాదు గుండెకూ రక్తం సరఫరా కాదు. గర్బిణుల్లో ఇలాంటి సమస్యలు ఉంటే అది కడుపులో ఎదిగే బిడ్డకు కూడా ప్రమాదమే. కాబట్టి ఇలాంటి సమస్యలెదుర్కొనే గర్భిణులు చలికాలంలో అప్రమత్తంగా ఉండాలి. దీనికోసం అరోమా థెరపీ చక్కగా ఉపయోగపడుతుంది. ఈక్రమంలో లావెండర్, టీట్రీ, యూకలిప్టస్ వంటి నూనెలతో శరీరమంతా మసాజ్ చేసుకోవడం రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. దీంతో శారీరక నొప్పులు తగ్గడమే కాదు..ఆరోగ్యమూ కూడా ఇనుమడిస్తుంది. ఈ చిట్కాతో పొడిచర్మం సమస్య కూడా చాలా తగ్గుతుంది. అయితే ఇవి సహజసిద్ధమైన నూనెలే అయినప్పటికీ గర్బిణులు వీటిని వాడే విషయంలో ముందుగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. చర్మ సంరక్షణ: చలికాలమంటే చాలా మంది భయపడుతుంటారు. కారణం చర్మం పొడిబారుతుంది. దీంతో దురద, మంటతో ఇబ్బంది పడుతుంటారు. గర్భిణీల్లో పొట్ట పెరిగిన కొద్దీ చర్మం సాగుతుంది. దీంతో మరింత దురద పుడుతుంది. దీన్ని ఇలాగే నిర్లక్ష్యం చేస్తే స్ట్రెచ్ మార్క్స్ తో తిప్పలు తప్పవు. అందుకే డాక్టర్ సలహా మేరకు క్రీములు, లోషన్లు, నూనెలు కూడా వాడవచ్చు. వాటితో రోజుకు ఒకటి లేదా రెండు సార్లు పొట్ట భాగంలో మర్దన చేసుకుంటే అటు రక్తప్రసరణ మెరుగవుతుంది. ప్రసవానంతరం స్ట్రెచ్ మార్క్స్ రాకుండా కూడా ఈ చిట్కా సహాయపడుతుంది. మిగతా భాగాల్లో చర్మ సంరక్షణ కోసం పొడి జుట్టు నుంచి విముక్తి పొందడం కోసం నిపుణుల సలహా మేరక సంబంధిత సౌందర్య ఉత్పత్తులు వాడటం మంచిది. లేదంటే ఇంట్లోనే తయారు చేసుకున్న సహాజ సిద్ధమైన బ్యూటీ ఉత్పత్తులు కూడా వాడవచ్చు. ఉదయం నుంచి ఉత్సాహంగా ఉండేందుకు: చలికాలంలో ఉదయాన్నే లేవాలంటే బద్ధకంగా ఉంటుంది. దీనికి తోడు గర్భం ధరించిన 3 లేదా 4నెలల పాటు వేవిళ్ల సమస్య వేధిస్తుంది. ఫలితంగా శరీరం మరింత నీరసించిపోయే ప్రమాదం కూడా ఉంది. తద్వారా కడుపులో పెరుగుతన్న బిడ్డపైన కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం నుంచి ఉత్సాహంగా ఉండాలంటే వ్యాయామం, ధ్యానం, యోగా వంటివి రోజువారీ జీవన విధానంలో భాగం చేసుకోవాలి. వీటివల్ల శరీరం ఉత్తేజితమవడంతో పాటు మనసకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అయితే గర్భం ధరించిన సమయంలో ఎలాంటి వ్యాయామాలు చేయాలన్న విషయం గురించి మీరు సొంత నిర్ణయం తీసుకోకుండా మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
గర్భధారణ సమయంలో మహిళలు తప్పకుండా తాగాల్సిన డ్రింక్స్ ఇవే! మహిళలు గర్భం దాల్చడం అనేది ప్రత్యేక వరం. ఆ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆహారం నుండి విహారం వరకు గర్బవతుల చిట్టా ప్రత్యేకం. ముఖ్యంగా చలికాలంలో గర్భవతులు ఆరోగ్యం విషయంలో కేర్ తీసుకోవాలి. వాతావరణ మార్పుల కారణంగా అనారోగ్యాలు ఎదురుకాకుండా, ఒకవేళ ఎదురైనా సరే అవి గర్భవతులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఆహారం కూడా ముఖ్యమే. ఈ కింద చెప్పుకునే డ్రింక్స్ గర్భవతులకు చలికాలంలో చాలా మేలు చేస్తాయి. వేడినీటితో నిమ్మరసం.. వేడినీటిలో కాసింత నిమ్మరసం కలిపి తీసుకోవడం చాలామంది చేస్తుంటారు. అయితే ఇది గర్భవతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇమ్యునిటీ పెంచడంలో సహాయపడుతుంది. సీజనల్ సమస్యలు రాకుండా చేస్తుంది. పుట్టబిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు వేడి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం మంచిది. అల్లం పాలు.. అల్లం గొప్ప ఔషద గుణాలు కలిగి ఉంటుంది. అల్లాన్ని పాలలో వేసి బాగా ఉడికించి దీన్ని గోరువెచ్చగా ఉన్నట్టే తాగాలి. గర్భవతులు అల్లం పాలు తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలలో వాంతుల సమస్య తగ్గుతుంది. అలాగే ఉదర సంబంధిత సమస్యలు అంటే.. అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపులో వికారం వంటి సమస్యలు తగ్గుతాయి. వేడి పాలు.. వేడిపాలు పోషకాన్ని మాత్రమే కాదు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. క్రమం తప్పకుండా వేడిపాలు తాగడం వల్ల పదే పదే అనారోగ్యానికి గురయ్యే సమస్య తగ్గుతుంది. చికెన్-ఆనియన్ సూప్.. గర్భవతులు మాంసాహారులైతే వైద్యుల సలహా మీదట చికెన్-ఆనియన్ సూప్ తీసుకోవాలి. ఇది తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కండరాలు బలపడతాయి. కండరాలు బలంగా ఉంటే మహిళలకు గర్భాన్ని మోయడంలో ఇబ్బంది ఉండదు. *నిశ్శబ్ద. (మనిక: గర్భవతుల ఆహారానికి సంబంధించి పోషకాహార నిపుణులు, వైద్యులు పలు వేదికలల్లో పేర్కొన్న విషయాల ఆధారంగా ఈ సమాచారం అందించబడింది. గర్భవతులు ఆహారం విషయంలో తమ వైద్యుల సలహా మేరకే వీటిని తీసుకోవడం మంచిది)
మహిళలు బలంగా ఉండాలంటే ఈ ఆహారాలు తినాలి!! ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు, వైద్యులు కూడా. మహిళలు చాలావరకు మానసికంగా బలంగానే ఉంటారు. కానీ శారీరకంగా బలంగా ఉండే మహిళలు చాలా తక్కువ. ముఖ్యంగా నేటి కాలంలో మహిళలు అయితే చాలా సున్నితం ఉంటారు. పెళ్లై, ఓ ఇద్దరు పిల్లల్ని కంటే ఇక చాలా బలహీనం అయిపోతారు. కానీ ఈ బలహీనత రాకూడదన్నా,. ఆల్రెడీ వచ్చిన బలహీనతను అధిగమించాలన్నా ఈ కింది ఆహారాలు తప్పక తినాలి. కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు మహిళలకు చాలా అవసరం. మహిళలకు కాలం గడిచేకొద్ది ఎముకలు చాలా తొందరగా బలహీనం అవుతాయి. కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు బాగా తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలు అధిగమించవచ్చు. ఎముక బలం ఉంటే మహిళలు చాలావరకు బలంగా ఉంటారు. పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు, ఫూల్ మఖనా మొదలైన కాల్షియం ఆహారాలు రోజూ తినాలి. మహిళలలో రక్తహీనత సమస్య కూడా ప్రముఖమైనది. దీనివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా నెలసరి అస్తవ్యస్తం అవుతుంది. ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలు బాగా తీసుకుంటే ఈ సమస్యలు అధిగమించవచ్చు. నువ్వులు, బెల్లం, పల్లీలు, చేపలు, బీన్స్ వంటి ఆహారాలలో ఐరన్ బాగా ఉంటుంది. గుండె ఆరోగ్యం, నరాల ఆరోగ్యం, జీవక్రియ, రక్తప్రసరణ మొదలైనవాటికి ఫోలేట్ చాలా అవసరం. ఇది లోపిస్తే గర్భదారణ సమయంలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. పోలిక్ యాసిడ్ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగడంలో సహాయపడుతుంది. తృణధాన్యాలు, చిక్కుళ్లు, కమలాపండ్లు, కరివేపాకు, బ్రోకలి, బెండకాయ, గుడ్లు, ఆవు పాలు మొదలైనవాటిలో ఫోలెట్ సమృద్దిగా ఉంటుంది. మహిళలలో రోగనిరోధక శక్తి బాగుండాలంటే విటమిన్-సి బాగా తీసుకోవాలి. ఇది చర్మ ఆరోగ్యాన్నికూడా కాపాడుతుంది. నిమ్మజాతి పండ్లు, సిట్రస్ ఆధారిత కూరగాయలు, స్ట్రాబెర్రీలు మొదలైనవాటిలో విటమిన్-సి లభిస్తుంది. సరైన బరువు ఉంటే సగం ఆరోగ్యంగా ఉన్నట్టే. బరువు బ్యాలెన్స్ గా ఉంచుకోవడానికి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం తప్పనిసరి. గుండె జబ్బులను, మధుమేహాన్ని కూడా పైబర్ దరిచేరనివ్వదు. ఫైబర కోసం తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు బెస్ట్ ఆప్షన్. శరీరంలో ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం, పాస్పరస్ శరీరానికి అందాలి. ఇవి అందాలంటే విటమిన్-డి ఖచ్చితంగా అవసరం. విటమిన్-డి లోపిస్తే కాల్షియం, పాస్పరస్ ఉన్న ఆహారాలు తిన్నా సరే ఎముకలు బలంగా మారవు. కాబ్టటి విటమిన్-డి తప్పనిసరిగా అందేలా చూడాలి. సూర్యుడి లేతకిరణాలు శరీరం మీద పడుతున్నప్పుడు ఆ ఎండలో గడపాలి. పుట్టగొడుగులు, చేపలు, పాలు, గుడ్లు బాగా తీసుకోవాలి. మహిళల శరీరంలో కండరాలు బలంగా ఉండాలంటే ప్రోటీన్ బాగా అందాలి. ఇది శరీరంలో కండర కణాల రిపేర్ కు సహాయపడుతుంది. కాయధాన్యాలు, గుడ్లు, చేపలు, పాలు వంటి ప్రోటీన్ ఆహారాలు తీసుకోవాలి. రక్తపోటు అదుపులో ఉండాలంటే పొటాషియం తప్పనిసరి. కండరాలు, నరాలు ఆరోగ్యంగా పనిచేయడానికి కూడా ఇది అవసరం. పాలకూర, బీన్స్, అరటిపండ్లు తీసుకుంటూ ఉంటే పొటాషియం బాగా లభిస్తుంది. *నిశ్శబ్ద.
గర్భిణీ స్త్రీలు ఈ ఆహారాలు తింటే అంతే సంగతులు! ఆడపిల్ల జీవితంలో వివాహం, గర్బం దాల్చడం కీలకమైన మలుపులు. వీటి తరువాత నుండి మహిళల జీవితం చాలా మార్పులకు లోనవుతుంది. పండంటి పాపాయి పుట్టాలంటే మంచి ఆహారం తీసుకోవాలని వైద్యుల నుండి పెద్దల వరకు చెబుతారు. అయితే ఇప్పటి కాలం అమ్మాయిలు చాలామంది ఉద్యోగాల కారణంగా పెద్దలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరికి అసలు తాము తీసుకునే ఆహారాల మీద స్పష్టతే ఉండదు. ఈ కింది ఆహారాలు గర్బవతులు అస్సలు తీసుకోకూడదని, అలా తింటే మాత్రం చాలా ప్రమాదమని అంటున్నారు. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ గర్భవతులు మొలకెత్తిన గింజలకు దూరం ఉండాలి. మొలకెత్తిన గింజలలో బ్యాక్టీరియా ఎక్కువగా డవలప్ అవుతుంది. వీటిని తింటే జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి. పాలు కూడా ఆరోగ్యానికి మంచివే అయినా పాశ్చరైజేషన్ చేయని పాలు మాత్రం గర్భవతులకు ప్రమాదం. వీటిలో లిస్టేరియా, ఇకోలి, సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి కడుపులో పెరుగుతున్న బిడ్డకు హాని కలిగిస్తాయి. ఉడికించిన కోడిగుడ్లు అందరికీ మంచివే. అయితే కొందరు పచ్చిగుడ్లు కూడా తింటారు. మరికొందరు హాఫ్ బాయిల్ అంటూ సగం ఉడికీ ఉడకని గుడ్లు తింటారు. అయితే గర్భవతులు ఆరోగ్యం బాగుండాలంటే పచ్చిగుడ్లు తినడం అవాయిడ్ చేయాలి. దీవివల్ల వాంతులు, వికారం వంటి ప్రమాదాలు ఎదురవుతాయి. గర్భవతులు మద్యపానం, ధూమపానంకు దూరం ఉండాలి. ఇవి కడుపులో బిడ్డకు హాని కలిగిస్తాయి. సముద్రంలో లభించే క్యాట్ ఫిష్, షార్క్ వంటి చేపలలో పాదరసం ఎక్కువ శాతం ఉంటుంది. ఈ చేపలను తినడం వల్ల కడుపులో బిడ్డ నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. బొప్పాయికి, గర్భిణులకు మద్య ఉండే విషయాలు అందరికీ తెలిసిందే. అయితే పచ్చి బొప్పాయి తినడం వల్ల గర్భిణులకు గర్భస్రావం అయ్యే కారణం ఉంటుంది. కాఫీ కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇందులో కెఫిన్ ఆరోగ్యం చేకూరుస్తుంది. కానీ కాపీ ఎక్కువ తాగితే కెఫిన్ కంటెంట్ కడుపులో బిడ్డపై చెడు ప్రభావం చూపిస్తుంది. కెఫిన్ తొందరగా జీర్ణం కాకపోవడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు కూడా పెరుగుతాయి. *నిశ్శబ్ద.
ఏం చేసినా హిమోగ్లోబిన్ పెరగట్లేదా? అయితే ఇలా చేయాల్సిందే.. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అవసరం అవుతాయి. శరీరం మొత్తం ఆరోగ్యాన్ని నిర్దేశించగల సామర్థ్యం రక్తానికి ఉంది. శరీరంలో హిమోగ్లోబిన్ సరిపడినంత లేకపోతే అది రక్తహీనతకు దారితీస్తుంది. ఈ రక్తహీనత ముఖ్యంగా మహిళల్లోనే ఎక్కువగా ఎదురవుతుంటుంది. ఐరన్ స్థాయిలు మెరుగుపరుచుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ ను భర్తీ చేసుకోవచ్చు. దీని కోసం మహిళలు తప్పక తినాల్సిన ఆహారాలేంటో తెలుసుకుంటే.. ఆహారంలో మొక్కల ఆధారిత పదార్థాలు అయిన గింజలు, విత్తనాలు, పండ్లు, కూరగాయలు మొదలైనవి పుష్కలంగా తీసుకోవాలి. వీటిని తీసుకుంటే శరీరంలో ఐరన్ బాగా లభిస్తుంది. పైపెచ్చు ఇవి శరీరంలో ఐరన్ సరఫరాను కూడా ప్రోత్సహిస్తాయి. ఆకుకూరలు, పండ్లు, గింజలే కాకుండా ఆహారంలో లీన్ మాంసం, చికెన్, పాలు, గుడ్లు, బీన్స్, కాయధాన్యాలు, జున్ను, బచ్చలికూర, బ్రోకలీ వంటి వాటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. వీటిలో ఏవో కొన్ని అయినా రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా ఐరన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. చాలామంది ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకున్నా హిమోగ్లోబిన్ పెరగడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. అయితే విటమిన్-సి పుష్కలంగా తీసుకునేవారికే ఐరన్ పెరుగుదల ఉంటుంది. ఎందుకంటే ఐరన్ ను శరీరం ఫర్పెక్ట్ గా గ్రహించడానికి విటమిన్-సి సహాయపడుతుంది. శరీరం ఐరన్ గ్రహించడానికి కేవలం విటమిన్-సి మాత్రమే కాదు, విటమిన్ బి12 కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆహారంలో పాలు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు మొదలైనవాటిలో విటమిన్-బి12 ఉంటుంది. వీటిని తీసుకుంటే ఐరన్ ను కూడా సులువుగా పొందగలుగుతారు. *నిశ్శబ్ద.
మహిళలలో మెనోపాజ్.. ముఖ్యవిషయాలు ఇవే.. ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పనిసరిగా కొన్ని దశలు అదిగమించాలి. వీటిలో 12 నుండి 16ఏళ్లలోపు రజస్వల అయితే అది దాదాపు 30నుండి 40 ఏళ్ళపాటు కొనసాగుతుంది. ఆ తరువాత ఈ నెలసరి ఆగిపోతుంది. ఇలా నెలసరి ఆగిపోవడాన్ని వైద్యపరిభాషలో మెనోపాజ్ అని అంటారు. మెనోపాజ్ చెప్పడానికి సులువైన విషయమే అయినా దాన్ని ఎదుర్కొనే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. హార్మోన్లలో మార్పులు, శారీరక మార్పులు, శరీరంలో వేడి ఆవిర్లు, బరువు మొదలైన సమస్యలు ఎన్నో మహిళలను ఇబ్బంది పెడతాయి. చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల మెనోపాజ్ చాలా నరకంగా అనిపిస్తుంది. దీని గురించి మహిళలకే కాకుండా వారి భాగస్వాములకు కూడా మెనోపాజ్ విషయంలో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది అక్టోబర్ 18వ తేదీన వరల్డ్ మెనోపాజ్ డే ని నిర్వహిస్తున్నారు. దీని లక్ష్యాలు, దీని చరిత్ర, దీని థీమ్ మొదలైన విషయాలు తెలుసుకుంటే.. ఈ ఏడాది ప్రపంచ మెనోపాజ్ డే థీమ్ కార్డియోవాస్కులర్ డిసీజ్. మహిళల పునరుత్పత్తి ఆరోగ్యం గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మెనోపాజ్ కు చేరువ అవుతున్న మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. చరిత్ర.. ప్రపంచ మెనోపాజ్ డే ను 1984లో ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఇంటర్నేషనల్ మెనోపాజ్ సొసైటీ కలిసి స్థాపించాయి. నలభై ఏళ్ళ తరువాత మహిళలు ఈ సమస్యలో ఎదుర్కొనే పరిస్థితుల గురించి అవగాహన కల్పించడం ఈ రోజు ప్రధాన ఉద్దేశ్యం. ఒకప్పుడు 45 నుండి 55 సంవత్సరాల మధ్య మహిళలలో పునరుత్పత్తి హార్మోన్లు సహజంగా క్షీణించేవి. ఇది ఇప్పుడు కొందరిలో 40ఏళ్ల తరువాతే మొదలవుతోంది. మెనోపాజ్ ఎదుర్కొంటున్న మహిళలలో సాధారణ లక్షణాలైన వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు, మానసిక మార్పులు నిద్ర భంగం వంటివి ఉంటాయి. ప్రతి మహిళ వీటి గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థ బలహీన పడటం వల్ల గుండె జబ్బులు, బోలు ఎముకల వ్యాధి ప్రమాదం పెరగడం, ఆందోళన, నిరాశకు మొదలైన సమస్యలకు కూడా కారణమవుతుంది. ప్రపంచ మెనోపాజ్ డే చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది స్త్రీలు ఇప్పటికీ మెనోపాజ్ సమస్య గురించి అవహాహన కలిగి లేరు, అలాగే దీని గురించి అవగాహన ఉన్న కొద్ది మంది కూడా దీని గురించి చర్చించలేకపోతున్నారు, అయినప్పటికీ ఇది మహిళల ఆరోగ్యంలో చాలా ముఖ్యమైన దశ. మెనోపాజ్ చాలా కాలం పాటు కొనసాగుతుంది. పెరిమెనోపాజ్ పరిస్థితి మెనోపాజ్కు ఒక సంవత్సరం ముందు ప్రారంభమవుతుంది, ఇది మహిళలకు అసౌకర్యాన్నికలిగిస్తుంది. సుమారు ఒక దశాబ్దం పాటు ఉంటుంది.
బ్రా ధరించే మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా.. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రాణాలను బలిగొంటున్న జబ్బు క్యాన్సర్. చాలామందిలో క్యాన్సర్ చివరి స్టేజ్ కు వచ్చాక తప్ప బయటపడదు. క్యాన్సర్ లో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో మహిళలకు ఎక్కువగా ముప్పు కలిగించేది బ్రెస్ట్ క్యాన్సర్. సాధారణంగా నలభై సంవత్సరాలు దాటిన మహిళలలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మహిళల రొమ్ములో మామూలుగానే కణజాలంతో ఏర్పడిన గడ్డలు ఉంటాయి. బ్రెస్ట్ ను చేత్తో తాకినప్పుడు ఈ గడ్డల స్పర్శ తెలుస్తుంటుంది. ఇవి ఏ మాత్రం ప్రమాదం లేనివి. పైపెచ్చు నొప్పి కూడా ఉండవు. కానీ రొమ్ము క్యాన్సర్ లో మాత్రం ఇవన్నీ పూర్తీగా వేరు వేరుగా ఉంటాయి. కొన్ని లక్షణాల ద్వారా రొమ్ము క్యాన్సర్ ను గుర్తించవచ్చు. అలాగే బ్రా వేసుకునే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వస్తుందా అనే విషయం నిజమా.. అబద్దమా.. పూర్తీగా తెలుసుకుంటే.. మహిళలకు రొమ్ములలో క్యాన్సర్ గడ్డలు పెరగడాన్ని రొమ్ము క్యాన్సర్ అని అంటారు. ఈ క్యాన్సర్ కణాలు పూర్తీగా రొమ్మును మొత్తం ఆక్రమించాక మహిళల ప్రాణాలు కాపాడాలంటే మాత్రం పూర్తీగా రొమ్మును తొలగించాల్సి ఉంటుంది. మహిళల శరీరంలో ముఖ్యభాగం అయిన రొమ్మును తొలగించడం అంటే అది ఎంతో ఆత్మన్యూనతకు దారి తీస్తుంది. రొమ్ములో ఉండే కణాలలో క్యాన్సర్ కారకాలు చేరి అవి క్రమంగా కణజాలాలుగా రూపాంతరం చెంది క్యాన్సర్ గడ్డలుగా మారతాయి. ఈ క్యాన్సర్ గడ్డలు చేత్తో తాకితే నొప్పిగా ఉంటాయి. అంతేకాదు రొమ్ము మీద ఉండే చనుమొనల నుండి రసి కారుతూ ఉంటుంది. చీము, రక్తం, ద్రవం కారుతూ ఉంటుంది. చనుమొన చుట్టూ దురద ఏర్పడి దాని కారణంగా కురుపులు వస్తాయి. క్యాన్సర్ గడ్డలు క్రమంగా పెరగడం వల్ల రొమ్ము పరిమాణం కూడా పెరుగుతుంది. అయితే మహిళలలో నెలసరి సమస్యల సమయంలో రొమ్ములో గడ్డలలో మార్పులు, వాటిని తాకితే నొప్పి కలుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి సమయాన్నికూడా పరిగణలోకి తీసుకుంటూ రొమ్ములను సాధారణ రోజుల్లో పరీక్షించుకోవాలి. ఇకపోతే బ్రా ధరించే మహిళలకు గొమ్ము క్యాన్సర్ వస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే బ్రా ధరించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు అస్సలు లేవని వైద్యులు చెబుతున్నారు. కాకపోతే బ్రాను నిర్ణీత సమయంలో మాత్రమే ధరించాలి. చాలావరకు వదులుగా ఉన్న దుస్తులు ధరించడం అన్నివిధాలా సురక్షితం. బ్రా ధరించే అలవాటు ఉన్న మహిళలు బయటకు వెళ్లినప్పుడు మాత్రమే ధరించడం సురక్షితం. ఇంట్లో ఉన్న సమయంలోనూ, రాత్రి నిద్రించేముందు బ్రా తొలగించాలి. బ్రా లకు ఉండే ఎలాస్టిక్ మహిళల రొమ్ము ప్రాంతం నుండి కింద శరీర అవయవాలకు రక్తప్రసరణ జరగడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది. చాలావరకు సుఖమైన నిద్ర సాధ్యం కాదు. అందుకే ఎల్లవేళలా బ్రా ధరించకూడదని వైద్యులు కూడా చెబుతారు. రొమ్ము క్యాన్సర్ కు బ్రాకు సంబంధం లేదు కానీ బ్రా కారణంగా ఇతర అసౌకర్యాలు అయితే ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్ అవగాహనా నెలగా అక్టోబర్ ను పేర్చొన్నారు. ఈ కారణంగా మహిళలు ప్రమాదకరమైన రొమ్ము క్యాన్సర్ మీద అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. *నిశ్శబ్ద.
పురుషుల కంటే మహిళలలోనే గుండె జబ్బులు అధికమవుతున్నాయి ఎందుకంటే.. గుండె జబ్బులు ప్రాణాంతకం. గుండె జబ్బులు సాధారణంగా పురుషులలో సర్వసాధారణం, కానీ గత కొన్ని సంవత్సరాలుగా మహిళల్లో కూడా గుండె జబ్బుల రేటు వేగంగా పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం హృదయ సంబంధ సమస్యలు (CVD) భారతదేశంలో సుమారు 35 లక్షల మరణాలకు కారణమవుతోంది. అందులో 16.9% మహిళలు ఉన్నారు. గుండె ఆరోగ్యాన్ని చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి, వాటిలో ఒకటి ఒత్తిడి. ఒత్తిడి గుండె జబ్బులతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. పురుషుల కంటే స్త్రీలు ఒత్తిడితో సులభంగా ప్రభావితమవుతారు. ఈ ఒత్తిడి నిద్రలేమితో కలిసి ఉంటుంది. దాదాపు ప్రతి నలుగురిలో ఒకరు నెలసరి తర్వాత క్రమం తప్పిన హృదయ స్పందనను అనుభవిస్తారు. ఒత్తిడి శరీరంలో మంటను పెంచుతుంది, ఇది అధిక రక్తపోటు, తక్కువ 'మంచి' కొలెస్ట్రాల్కు దారితీస్తుంది . ఒక వ్యక్తి ఒత్తిడికి గురైనప్పుడు సరిగా నిద్రపోడు. ఇలాంటి పరిస్థితిలో వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లేదా బరువును నియంత్రించడం వంటివి కూడా తగ్గుతాయి. ఈ జీవనశైలి మార్పులు గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ మరియు డిప్రెషన్ వంటి మానసిక ప్రమాద కారకాలను పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే చిన్నతనంలో ఎదురైన లైంగిక దాడులు గుర్తుకు రావడం వంటి సంఘటనలు గుండెపై ఒత్తిడి పెంచుతాయి. ఇవి మానసిక సమస్యలకు దారితీస్తాయి. ఇలాంటివి మహిళలు పెద్దగా పట్టించుకోరు. మహిళల జివితంలో విడాకులు, కుటుంబ సమస్యలు, ఇష్టమైనవారి మరణం, దీర్ఘకాలిక అనారోగ్యం లేదా ప్రకృతి వైపరీత్యం వంటి జీవిత సంఘటనలు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ముఖ్యంగా నిర్దిష్ట వయస్సు తర్వాత ఈ సమస్యలను ఎదుర్కోవడం మహిళలకు మరింత కష్టతరం చేస్తుంది. భావోద్వేగ ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది , ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. కొరోనరీ ధమనులలో ఫలకం ఏర్పడుతుంది. భావోద్వేగ ఒత్తిడి కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను కూడా పెంచుతుంది. ఈ హార్మోన్లు ప్లేట్లెట్స్, అటానమిక్ టోన్ను ప్రభావితం చేస్తాయి. ఇవి హృదయ స్పందన రేటు, రక్తపోటు వంటి సహజ విధులను నియంత్రించడంలో శరీరానికి సహాయపడతాయి. ఇవన్నీ గుండె జబ్బులను పెంచుతాయి. మహిళల్లో హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, గుండె సమస్యలను పెంచుతాయి . ఋతుస్రావం, గర్భం, నెలసరి సమయంలో ఇలా స్త్రీ జీవితాంతం హార్మోన్ల మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఈ హార్మోన్ల మార్పులు రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు, సాధారణ హృదయనాళ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఒత్తిడి కారణంగా మహిళలకు గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడిని జీవితం నుండి తొలగించలేము, కానీ గుండె ఆరోగ్యంపై దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు, ముఖ్యంగా మహిళలకు వివిద సందర్భంలో వచ్చే ప్రమాదాలను గుర్తించడం, వాటిని సమయానికి పరిష్కరించడం ద్వారా మహిళల హృదయ ఆరోగ్యాన్ని రక్షించవచ్చు. *నిశ్శబ్ద.
పిల్లలకు రాత్రి పూట ఈ 5 ఆహారాలు ఎందుకు ఇవ్వాలో తెలుసా... ఆహారం ఎక్కువగా తిన్న తర్వాత మంచి నిద్రలోకి జారుకుంటాం. కానీ పిల్లల విషయంలో అలా కాదు! వారు ఏమి తినాలి? ఏమి తినకూడదు? అన్న అవగాహన చాలా మంది తల్లిదండ్రులకు ఉండదు. దీని కారణంగా పిల్లలు రాత్రి సమయంలో నిద్ర సమస్యను ఎదుర్కొంటారు. తల్లిదండ్రులు రాత్రిపూట శిశువు బాగా నిద్రపోవడానికి సహాయపడే ఆహారాన్ని ఇవ్వాలి. ఇటువంటి ఆహారాలు వారి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీరానికి విటమిన్లను అందిస్తాయి. కాబట్టి శిశువుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో ఇక్కడ తెలుసుకోండి. పాలు: రాత్రిపూట పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల వారికి మంచి నిద్ర వస్తుంది. పాలలో ట్రిప్టోఫాన్, కాల్షియం, విటమిన్ డి. మెలటోనిన్ ఉంటాయి. అవి నిద్రను ప్రోత్సహిస్తాయి. నిద్రవేళలో పాలు తాగడం వల్ల ఎక్కువసేపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే మీరు ఇచ్చే పాలు కల్తీ లేకుండా ఉండేలా చూసుకోండి. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకోవడం మంచిది. పసుపు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బాదం: బాదంపప్పును సాధారణంగా పిల్లలకు ఉదయం పూట ఇస్తారు. ఇది మెదడుకు చాలా మంచిదని భావిస్తారు. కానీ రాత్రి పూట పిల్లలకు బాదంపప్పు తినిపించవచ్చు లేదా బాదంపప్పు కలిపిన పాలు తాగించవచ్చు. బాదం పాలలో మెలటోనిన్ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది మీ నిద్ర స్థాయిని పెంచుతుంది. అలాగే, వాల్నట్లలో మెలటోనిన్, సెరోటోనిన్, మెగ్నీషియం ఉన్నందున అవి కూడా ఒక ఎంపిక. అరటిపండ్లు: అరటిపండ్లు రోజులో ఏ సమయంలోనైనా 24 గంటలూ తినవచ్చు. వీటిని సూపర్ ఫుడ్స్ అంటారు. అయోడిన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి, అరటిలో మెగ్నీషియం, పొటాషియం, ట్రిప్టోఫాన్, విటమిన్ B6, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. రాత్రి పడుకునే ముందు పిల్లలకు అరటిపండు తినిపించండి . ఇది సంపూర్ణత్వం, మలబద్ధకం చికిత్స చేస్తుంది. చెర్రీస్: మంచి రాత్రి నిద్రకు చెర్రీస్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నిజానికి, చెర్రీస్ మీ పిల్లల డిన్నర్కు మంచి ఆప్షన్ గా ఉంటాయి. బీన్స్: చిక్కుళ్ళు సాధారణంగా రాత్రిపూట కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. ఎందుకంటే ఇందులో అధిక స్థాయిలో ప్రొటీన్లు, ట్రిప్టోఫాన్ ఉంటాయి. ఇది మంచి నిద్రకు ఉత్తమమైన ఆహారం. ఉదాహరణకు, చిక్పీస్లో ఐరన్, పొటాషియం, ఫైబర్, విటమిన్లు K, C మరియు B-6 కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది వాటిని గొప్ప, పోషకమైన విందు ఆహారంగా చేస్తుంది. మీ శిశువు ఆహారంలో చేర్చడానికి బీన్స్ ఉడికించి, గుజ్జు చేయడం మంచిది.
మహిళలలో పిసిఒయస్ సమస్యకు కారణాలు.. పరిష్కార మార్గాలు.. ఒక వయసు వచ్చాక అమ్మాయిలలో ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి. అవి మెల్లగా పెరుగుతూ మహిళలను చాలా రకాలుగా ఇబ్బందికి గురిచేస్తాయి. మహిళలలో సాధారణంగా కనిపించే సమస్యలలో పిసిఒఎస్ ఒకటి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ గా పిలువబడే ఈ సమస్య మహిళలలో చాలా తీవ్రమైన పరిస్థితులకు కారణం అవుతుంది. ఇది ప్రధానంగా హార్మోన్ సమస్యగా పరిగణింపబడుతుంది. పునరుత్పత్తి వయస్సు మహిళలలో వస్తుంది. ఈ సమస్య ఉన్న మహిళలలో నెలసరి రావడం నుండి, ఆ సమయంలో జరిగే ఋతుస్రావం వరకు చాలా విషయాలు ప్రభావితం అవుతాయి. ఇది పూర్తిగా మహిళల మానసిక స్థితిని దెబ్బతీసే సమస్య. పిసిఒఎస్ సమస్య గురించి మహిళలలో సరైన అవగాహన కలిగించడానికి, ఈ సమస్యను అధిగమించే విషయంలో మహిళలను ప్రోత్సహించడానికి సెప్టెంబర్ నెలను పిసిఒయస్ అవగాహనా నెలగా కేటాయించారు. మహిళలలో ఎక్కువగా కనిపించే ఈ సమస్య గురించి వివరంగా తెలుసుకుని, దీనికి పరిష్కార మార్గాలేమిటో విశ్లేషించడం ఎంతో ముఖ్యం. పిసిఒఎస్.. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్యకు ఖచ్చితమైన కారణం అంటూ ఏదీ ఇప్పటి వరకు తెలియదు. ఆరోగ్య నిపుణులు మహిళలలో కనిపించే కొన్ని మార్పుల కారణంగా సమస్యకు మూలాన్ని అంచనా వేసి దానికి తగిన పరిష్కాలు సూచిస్తుంటారు. మహిళలలో నెలసరి సమస్యలు రావడం, దీర్ఘకాలం రక్తస్రావం జరగడం, లేదా నెలసరిలో తగినంత రక్తస్రావం జరగకపోవడం వంటి సమస్యలు పిసిఒఎస్ సమస్యలున్న మహిళలలో కనిపిస్తుంటాయి. ఇది చాలా కాలం కొనసాగడం వల్ల మహిళలలో పిల్లలు పుట్టడంలో అవాంతరాలు ఏర్పడతాయి. ఈ సమస్యకు అధికబరువు, హార్మోన్ అసమతుల్యత ముఖ్యకారణాలు కావచ్చునని వైద్యులు చెబుతున్నారు. నివారణ ఎలాగంటే.. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అధిక బరువు ఉన్న మహిళలలో పిసిఒఎస్ సమస్య వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారు బరువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బరువు తగ్గడానికి ఎంత ప్రయత్నం చేస్తే ఈ సమస్య కూడా అంత తగ్గే అవకాశం ఉంటుంది. బరువు నియంత్రణలోకి వచ్చే కొద్ది శరీరంలో హార్మోన్లు కూడా మెల్లిగా చక్కబడతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, పోషకాల సహాయంతో బరువు తగ్గడం వల్ల పిసిఒఎస్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఆహారం.. పిసిఒయస్ సమస్యను నియంత్రించడానికి సరైన పోషకాహారం ముఖ్యం. కార్భోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం తగ్గించాలి. ఇది ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. పిసిఒయస్ సమస్యను అరికట్టడానికి సింపుల్ గా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని తగ్గించి వాటి స్థానంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవడం వల్ల చాలావరకు సమస్యను అదుపులో ఉంచవచ్చు. చురుగ్గా ఉండాలి.. ఒకేచోట కూర్చుని పనిచేయడం అధికబరువుకు ప్రధాన కారణం అవుతుంది. నేటికాలంలో బిజీ పేరుతో శారీరక వ్యాయామం చేయకపోడం కూడా అధికబరువుకు కారణమే. ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీ జీవితం గడుపుతున్నా రోజులో కొద్దసేపు వ్యాయామం, యోగ, ధ్యానం మొదలైనవాటికి కేటాయించడం చాలా ముఖ్యం. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అధికబరువు ఉన్నా పిసిఒయస్ సమస్య ఉండకూడదు అంటే క్రమం తప్పకుండా వాకింగ్, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. వీటిని పాటిస్తే శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఫలితంగా పిసిఒయస్ సమస్య తగ్గిపోతుంది. *నిశ్శబ్ద.
ఈ ఫుడ్స్ మీలో ఒత్తిడిని పెంచుతాయి..!! ఆందోళన అనేది నేడు సాధారణ సమస్య. ఒక వ్యక్తి ఉదయం నుండి సాయంత్రం వరకు రకరకాల పనులు, బాధ్యతల భారంలో చిక్కుకుపోతాడు, అతనికి తన కోసం సమయం దొరకదు. అటువంటి పరిస్థితిలో, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోలేనప్పుడు, చిరాకు, ఒత్తిడి వంటి సమస్యలు తప్పవు. దీని వల్ల మెదడు కూడా సరిగా పనిచేయదు, కానీ మీకు తెలుసా, కొన్ని ఆహార పదార్థాలు కూడా ఆందోళన కలిగిస్తాయి. ఇవి తింటే మీ ఒత్తిడి పెరుగుతుంది. కెఫిన్: మీరు అవసరానికి మించి టీ లేదా కాఫీ తాగితే , అది మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒత్తిడి వచ్చే ప్రమాదం ఉంది. ఇది చిరాకు భయము భావాలను సృష్టిస్తుంది. కెఫీన్ వల్ల నిద్ర కూడా దెబ్బతింటుంది కాబట్టి దానికి బదులు హెర్బల్ టీ, ఫ్రూట్ జ్యూస్ మొదలైన ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవాలి. మద్యం: ఆల్కహాల్ ఆరోగ్యానికి అత్యంత హానికరం. దీన్ని తాగడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అంతే కాకుండా అధికంగా ఆల్కహాల్ తాగడం వల్ల నిద్రలేమి, విటమిన్ బి లోపం, నిద్రలేమి మొదలైన సమస్యలు వస్తాయి. అధిక కొవ్వు ఆహారాలు: కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు మెదడుకు రక్త ప్రసరణను తగ్గిస్తాయి. పరిశోధన ప్రకారం, అధిక మొత్తంలో తీపి, కొవ్వు పదార్ధాలను తినడం ఒత్తిడి ప్రమాదాన్ని పెంచుతుంది. ఉప్పు: ఉప్పు కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అంతే కాకుండా ఉప్పు ఎక్కువగా తింటే రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని వల్ల మీరు అనేక రకాల వ్యాధులకు గురవుతారు. ఫాస్ట్ ఫుడ్స్: ఫాస్ట్ ఫుడ్స్ చాలామంది ఇష్టంగా తింటారు. కానీ అది మీ మెదడును ప్రభావితం చేస్తుంది. మీరు మీ మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, ఫాస్ట్ ఫుడ్లకు దూరంగా ఉండండి. ఈ అనారోగ్యకరమైన వాటిని తినడం వల్ల మధుమేహం, బీపీ, ఊబకాయం వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. వేయించిన ఆహారాలు: చాలామంది తరచుగా వేయించిన ఆహారాన్ని చిరుతిండిగా తింటారు. ఇది రుచిగా ఉంటుంది, కానీ ఇది ఆందోళన సమస్యలను కలిగిస్తుంది. ఈ ఆహారాలు మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి.
గర్భవతుల్లో పెదవులు, బుగ్గలలోపల బొబ్బలు వస్తే ఎంత డేంజరో తెలుసా.. పెదవుల మీద, నోటిలో, పెదవుల చుట్టూ, గడ్డం వంటి ప్రాంతాలలో సాధారణంగా బొబ్బలు, పొక్కులు వస్తుంటాయి. విటమిన్ లోపాల వల్లా, అధిక వేడి కారణంగా ఇవి వస్తుంటాయని పెద్దలు చెబుతుంటారు. కానీ గర్భవతులలో ఇవి ఏర్పడితే మాత్రం కడుపులో పెరిగే బిడ్డకు పెద్ద హాని ఎదురైనట్టే అంటున్నారు వైద్యులు. నోటిలోపలా, పెదవుల మీద ఇలా బొబ్బలు, పొక్కులు రావడానికి థ్రష్ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ ప్రధాన కారణం. ఈ వైరస్ లాలాజలం లేదా జననేంద్రియాలను తాకడం ద్వారా వ్యాపిస్తుంది. ఒక్కసారి ఈ వైరస్ మనిషిని చేరిందంటే ఇక జీవితాంతం శరీరంలో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణం అనుకునే ఈ బొబ్బలు పొక్కుల వెనుక ఉన్న ఇంత ప్రమాదకర పరిస్థితి గురించి, ఇది కడుపులో ఉన్న బిడ్డకు కలిగించే నష్టం గురించి తెలుసుకుంటే.. HSV, HSV 1 అనే వైరస్ లు సాధారణంగా ముఖం, పెదవులపై, మరికొన్ని సార్లు జననేంద్రియాలపై బొబ్బలు కలిగిస్తాయి. మహిళలలో, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి బొబ్బలు వచ్చినట్టైతే గర్భాధారణం సమయంలో కూడా ఇది ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపులో బిడ్డపై ప్రభావం చూపుతుందా అంటే అసౌకర్యానికి మాత్రం ఖచ్చితంగా గురిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. నార్మల్ డెలివరీ సమయంలో మహిళలకు ఈ ఇన్ఫెక్షన్ ఉంటే అది బిడ్డకు చేరుతుందని అంటున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఈ వైరస్ పిల్లలకు ప్రమాదాన్ని తలపెడుతుంది. వైద్యుడిని ఎప్పుడు కలవాలి.. ఈ హెచ్ఎస్వి వైరస్ ఉంటే అది కూడా గర్బం మోస్తున్న సమయంలో ఈ వైరస్ యాక్టివ్ గా ఉంటే వెంటనే డాక్టర్ ను కలవాలి. లక్షణాల ఆధారంగా డాక్టర్ చికిత్స చేస్తారు. వీటి నివారణకు క్రీమ్స్, యాంటీ వైరల్ క్రీమ్స్, ప్రిస్కిప్షన్ మెడిసిన్స్ ఇస్తారు. వీటిని వాడటం వల్ల వైరస్ ప్రభావాన్ని స్థంభింపజేయవచ్చు. అయితే డెలివరీ తరువాత ఈ యాంటీ వైరల్ మందులను వైద్యుల సలహా లేకుండా వాడకూడదు. ఇవి పిల్లలకు ప్రమాదం కలిగిస్తాయి. తల్లులలో ఉన్న హెచ్ఎస్వి వైరస్ పిల్లలకు కూడా సోకితే వీలైనంత త్వరగా వైద్యుడిని కలవాలి. ముఖ్యంగా పిల్లలలో జ్వరం, నోటి పూతలు, పెదవుల మీద బొబ్బలు, నోట్లో పొక్కులు వంటి సమస్యలు కనిపిస్తే అసలు ఆలస్యం చేయకూడదు. చాలా చిన్నపిల్లలలో సహజంగానే పోషకాహార లోపం ఉంటుంది. తల్లులు దాన్ని సమర్థవంతగా భర్తీ చేస్తుంటేనే వారు అన్ని ఇన్ఫెక్షన్లను జయించి ఆరోగ్యంగా ఎదుగుతారు. *నిశ్శబ్ద.
కొందరికి పొట్ట తగ్గడం పెద్ద సమస్యగా మారుతుంది. బెల్లీ ఫ్యాట్ అనేక కారణాల వల్ల కలుగుతుంది. ఈ సమస్యను ఒక్కసారిగా అదుపు చేయడం కష్టం. ఆహారాలలో కొన్ని మీరు బరువు తగ్గడానికి, బొడ్డు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. మనం తీసుకునే అల్పాహారం కొవ్వును అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు. బ్రేక్ ఫాస్టులో ఎలాంటి ఆహారం తీసుకుంటే పొట్ట తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అల్పాహారంలో ప్రోటీన్ ప్రాముఖ్యత: కేలరీలు, చక్కెర, శుద్ధి చేసిన పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు మీ ఆరోగ్యానికి హానికలిగిస్తాయి. తక్కువ కేలరీలు, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. అదనంగా, మీరు మీ భోజనం తినే విధానం కూడా చాలా ముఖ్యమైనది. మీ ఉదయం అల్పాహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూడాలని పోషకనిపుణులు చెబుతున్నారు. ఇది పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలిని అణచివేస్తుంది: ప్రోటీన్ ఆకలిని అణిచివేస్తుంది. తరచుగా తినాలనే కోరికను తగ్గిస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండే భోజనం జీవక్రియను పెంచుతుంది. మీ కడుపును నిండుగా ఉంచుతుంది. ఇది పొట్టలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. దీనికి విరుద్ధంగా, అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్న భోజనం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇన్సులిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. కొవ్వు నిల్వకు దారితీస్తుంది. కాబట్టి, మన అల్పాహారాన్ని "ప్రోటీన్"గా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రోటీన్ కంటెంట్ను పెంచే సాధారణ బ్రేక్ఫాస్ట్లు: పోహా: పోహాలో 7 నుండి 8 వేరుశెనగ లేదా బఠానీలను జోడించండి. ఉప్పిట్టు: ఈ ఆరోగ్యకరమైన వంటకంలో బీన్స్ , 7 నుండి 8 వేరుశెనగలను వేయండి. పరాఠాలు: పరాఠాలు చేయడానికి గోధుమ పిండి, చిక్పా పిండిని ఉపయోగించండి. సగ్గుబియ్యానికి చిక్పీస్, పనీర్ లేదా బఠానీలను జోడించండి. దోస/ఇడ్లీ: త్వరిత, రుచికరమైన ప్రోటీన్ బూస్ట్ కోసం మీ దోస లేదా ఇడ్లీని వేరుశెనగ చట్నీతో జత చేయండి. వేరుశెనగ, బఠానీలు, పనీర్, చిక్పీస్తో సహా ఈ పదార్ధాలలో ప్రతి ఒక్కటి శాఖాహార ప్రోటీన్ యొక్క మంచి మూలాలు. వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వేరుశెనగలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అరటిపండు: అరటిపండ్లలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి కానీ కేలరీలు తక్కువగా ఉంటాయి. అరటిపండ్లు చక్కెరతో కూడిన అల్పాహార తృణధాన్యాలకు గొప్ప ప్రత్యామ్నాయం. ఇవి ఉదయం మీ తీపి కోరికలను తీర్చగలవు. పండ్లు, కూరగాయల నుండి ఫైబర్ తీసుకోవడం బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. అధికబరువు, బెల్లిఫ్యాట్ తో బాధపడుతున్నవారు ఉదయం అల్పాహారంలో పైన పేర్కొన్న ఆహారాలను చేర్చినట్లయితే..కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవచ్చు.
గర్బధారణ సమయంలో ఎలా కూర్చోవాలి... గర్భధారణ సమయంలో సరిగ్గా కూర్చోవడం, నిలబడటం చాలా ముఖ్యం. అన్నింటికంటే..గర్భిణీలు ఏ భంగిమల్లో కూర్చోవడం ఉత్తమం? పూర్తి సమాచారం తెలుసుకుందాం. గర్భం చాలా సున్నితమైనది. ఈ సమయంలో ఎలా కూర్చోవాలి? వంగడం మంచిదేనా? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి..ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. ఈ సమయంలో వెన్ను, మెడ, భుజాలలో నొప్పి కనిపించే అవకాశం ఉంటుంది. ఇది వారి కూర్చున్న భంగిమపై ఆధారపడి ఉంటుంది. గర్భధారణ సమయంలో శరీర బరువు పెరుగుతుంది. కాబట్టి సరైన భంగిమలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. స్లూచింగ్ మీ బిడ్డను ప్రభావితం చేస్తుంది. సరిగ్గా కూర్చోవడం ముఖ్యం: గర్భధారణ సమయంలో స్త్రీ అనుసరించే మంచి భంగిమ ఆమెను ఆరోగ్యంగా ఉంచుతుంది. తప్పు భంగిమ అసౌకర్యం, నొప్పిని కలిగిస్తుంది. అలాగే, ఇది శిశువుకు హాని కలిగించే ప్రమాదం ఉంటుంది. గర్భం చివరి దశలలో, హార్మోన్లు కీళ్ళలోని స్నాయువులు, మృదువుగా చేయడం ప్రారంభించినప్పుడు ఈ నొప్పి తీవ్రమవుతుంది. సరైన భంగిమ ఏమిటి? గర్భిణీలు వారి వెన్నెముకపై ఒత్తిడిని తగ్గించడానికి, అసౌకర్యాన్ని తగ్గించడానికి గర్భధారణ సమయంలో సరైన భంగిమను అభ్యసిస్తారు. ఉదాహరణకు, కూర్చున్నప్పుడు లేదా వెనుకకు వంగి ఉన్నప్పుడు వీపును నిటారుగా ఉంచండం మంచిది. గర్భిణీలకు నేలపై కూర్చోవడం సరైన భంగిమగా సూచిస్తుంది. ప్రసవానికి ఇది చాలా మంచి భంగిమ అని పెద్దలు అంటుంటారు. మీరు కుర్చీపై కూర్చోవడం అలవాటు చేసుకున్నట్లయితే, మీ వెనుకభాగంలో ఒక మృదువైన దిండు ఉంచుకోవడం మంచిది. ఎక్కువ సేపు కూర్చోవద్దు: గర్భిణీలు ఎక్కువసేపు కూర్చుంటే రక్తప్రసరణ దెబ్బతింటుంది. దీనివల్ల కాళ్లు నొప్పులు వస్తాయి. దీన్ని నివారించడానికి సాధారణ ఫుట్ వ్యాయామం చేయండి. ఆఫీసులో చాలా గంటలు కూర్చుని పని చేయాల్సి వస్తుంది. మీకు సమయం దొరికినప్పుడు కొన్ని నిమిషాలు నిలబడి నడవడం గుర్తుంచుకోండి. అలాంటి భంగిమ ప్రమాదకరం: బ్యాక్ సపోర్టు లేకుండా బీన్ బ్యాగులపై కూర్చోవద్దు. విచక్షణారహితంగా వంగడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. కూర్చోవడం మంచిది కానీ రోజంతా అలా కూర్చోని ఉండటం మంచిది కాదు. ఇది పేలవమైన ప్రసరణకు దారితీస్తుంది, చీలమండలలో వాపు, అనారోగ్య సిరలకు కారణం అవుతుంది. సరైన నిలబడే భంగిమ: కూర్చునే భంగిమ ఎంత ముఖ్యమో నిలబడే భంగిమ కూడా అంతే ముఖ్యం. మీ పాదాలను ఒకే దిశలో ఉంచండి. రెండు పాదాలపై బరువును సమానంగా ఉంచండి. అలాగే, మీరు ధరించే చెప్పులు లేదా బూట్లు సరిపోతాయా? అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.
జలుబు త్వరగా తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా? వర్షాకాలం వ్యాధులకు స్వాగతం పలుకుతుంది. ఈ కాలంలో చాలామందిని రకరకాల జబ్బులు, ఇన్ఫెక్షన్లు పలుకరిస్తుంటాయి. వర్షాకాలంలో బ్యాక్టిరియా, వైరల్ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి ఇది అనుకూలమైన సీజన్. కాబట్టి ఈ బ్యాక్టీరియా, జెర్మ్స్ నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే వర్షాకాలంలో మన ఇమ్యూనిటీని పెంచుకోవడం చాలా ముఖ్యం. సీజనల్ వ్యాధులు రాకుండా పరిశుభ్రత పాటించాలి. జలుబుకు హోం రెమెడీ: చిన్నపాటి జలుబు, ఫ్లూ వచ్చినా చాలా మంది వైద్యుల వద్దకు వెళ్లడానికి ఇష్టపడరు. జలుబు విషయంలో డాక్టర్ దగ్గరకు వెళ్లే ముందు కొన్ని హోం రెమెడీస్ ప్రయత్నించవచ్చు. ఇది జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఆ హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం. తులసి రసం: తులసి రసంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వర్షాకాలంలో జలుబు, ఫ్లూని నయం చేయడంలో సహాయపడతాయి. దీన్ని తినడానికి, 8 నుండి 10 ఆకులను కడిగి, రసం తీయడానికి వాటిని చూర్ణం చేయండి. ఆ తర్వాత 1 చెంచా తేనె మిక్స్ చేసిన తర్వాత ఈ జ్యూస్ తాగండి. అల్లం: అల్లంలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు జలుబు, ఫ్లూ నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. అల్లం పాలలో వేసి మరిగించి తాగవచ్చు, లేకపోతే టీలో కూడా అల్లం వాడవచ్చు. లవంగాలు, తేనె: లవంగాలు, తేనె రెండూ శరీరానికి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, దాని ఉపయోగం శరీరాన్ని వేడి చేస్తుంది. వర్షాకాలంలో జలుబు, ఫ్లూతో బాధపడుతుంటే 1 నుంచి 2 లవంగాలను మెత్తగా నూరి 1 చెంచా తేనెలో కలుపుకుని తినండి. ఇలా 1 నుండి 2 రోజులు చేస్తే జలుబు, ఫ్లూ అలాగే గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఆవిరి: వర్షాకాలంలో కనిపించే జలుబు,జ్వరాన్ని నయం చేయడానికి వేడి నీటి ఆవిరిని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల గొంతు, ఛాతీ ఇన్ఫెక్షన్లు నయమవుతాయి. బ్లాక్ చేయబడిన ముక్కును కూడా తెరుస్తుంది. మీకు కావాలంటే, మీరు ఆవిరి కోసం వేడి నీటిలో రెండు నుండి నాలుగు చుక్కల లవంగం నూనె లేదా టీ ట్రీ ఆయిల్ జోడించవచ్చు. మౌత్ గార్గ్లింగ్ : వర్షాకాలంలో జలుబు, దగ్గుతో పాటు దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్ సమస్య సర్వసాధారణం. ఈ సమస్యను అధిగమించడానికి, గోరువెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ రాతి ఉప్పు కలపండి. ఈ నీటితో పుక్కిలించండి. గార్గ్లింగ్ 5 నిమిషాల పాటు రోజుకు 1 నుండి 2 సార్లు చేయాలి. ఈ నీటిలో యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. జలుబు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి.
30 ఏళ్ల తర్వాత మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి! 30ఏళ్లు దాటిన మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఏయే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి...ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయం గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం ఇలా ఎన్నో కారణాల వల్ల మహిళలు తమ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తుంటారు. ముఖ్యంగా 30ఏళ్లు పైబడిన తర్వాత మహిళల తమ ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఉదయానే లేవడం, వంట పనులు చేయడం, ఆఫీసులకు వెళ్లడం, సాయంత్రం కుటుంబాన్ని చూసుకోవడం..ఈ పనులకే సమయం గడిచిపోతుంది. ఆమెకు తన ఆరోగ్యానికి సమయం కేటాయించడం మర్చిపోతుంది. కానీ 30ఏళ్లు నిండిన తర్వాత ప్రతిస్త్రీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. లేదంటే లేనిపోని అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. శరీర బరువు, కండరాల బలాన్ని పెంచడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి.ఇప్పుడు చూద్దాం. ఎలాంటి ఆహారం తినాలి? 30 నుంచి 35 సంవత్సరాల మధ్య, మీ హార్మోన్ స్థాయిలు పడిపోతాయి. ఇది శరీరంలో చక్కెరను ఉపయోగించుకునే హార్మోన్ల పెరుగుదలకు కారణమవుతుంది. అసమతుల్యమైన ఆహారాలు తినడం వల్ల బరువు పెరుగుతారు.కాబట్టి మీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే బెర్రీలు, ధాన్యాలు, గింజలు ఉండేలా చూసుకోండి. అలాగే అల్పాహారం మానేయకండి. సమయానికి భోజనం చేయండి. వ్యాయామం చేయండి: రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఇది బరువును నియంత్రించడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది. ప్రతిరోజూ చురుకైన, సాధారణ వ్యాయామాలు చేయండి. 30 ఏళ్ల తర్వాత, కండర ద్రవ్యరాశి దశాబ్దానికి 3-8% తగ్గుతుంది. మొత్తంగా వ్యాయామం మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాల్షియం ఆహారాన్ని తినండి: చిన్న వయసులోనే ఎముకల సాంద్రత ఏర్పడుతుంది. అలాగే, 25, 30 సంవత్సరాల మధ్య కొత్త ఎముక నిర్మాణం పూర్తవుతుంది. ఎముకల సాంద్రతను నిర్వహించడానికి, మీరు కాల్షియంతో కూడిన ఆహారాన్ని తినాలి. పాలు, పెరుగు, చీజ్, బ్రోకలీ, బచ్చలికూర, కాలే, బాదం వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. సరిగ్గా నిద్రపోండి: నిద్ర మానసిక ఆరోగ్యం, శరీర బరువును ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోండి. మీరు ప్రతిరోజూ తగినంత నిద్రపోయేలా చూసుకోండి.అలాగే, మీ ఆహారంలో ఫోలేట్ తీసుకోవడం పెంచండి. ఈ ఫోలేట్ ఆహారాల యొక్క ఇతర వనరులు బచ్చలికూర.సిట్రస్ పండ్లు వంటి ఆకుపచ్చ ఆకు కూరలు. అలాగే, 30 తర్వాత మధుమేహం , రక్తపోటు, కొలెస్ట్రాల్, థైరాయిడ్ చెక్ చేసుకోండి.
ప్రసవం తరువాత మహిళల్లో డిప్రెషనా... ఇదిగో మెడిసిన్ వచ్చేస్తోంది! తల్లి కావడం మహిళలకు దక్కిన ఓ గొప్ప వరం. అయితే మహిళలు ప్రసవానంతరం డిప్రెషన్ కు లోనవుతారు. ఈ కారణంగా మహిళల మానసిక ఆరోగ్యం దెబ్బ తినడమే కాకుండా తల్లీబిడ్డల బంధానికి సమస్య ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇలా ప్రసవం తరువాత మహిళల్లో ఎదురయ్యే డిప్రెషన్ ను ఇన్నాళ్లు తల్లిదండ్రులు, భర్త, అత్తమామల సహకారంతో అధిగమించేవారు. అయితే ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారంగా శాస్త్రవేత్తలు మెడిసిన్ కనిపెట్టారు. ప్రసవానంతరం మహిళలు ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల డిప్రెషన్ అధిగమించవచ్చు. Zurzuve.. ప్రసవానంతరం మహిళల్లో డిప్రెషన్ అరికట్టడానికి తయారుచేస్తున్న మెడిసిన్ పేరు Zurzuve. US డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఆమోదం పొందిన తర్వాత 2023 సంవత్సరం చివరి మూడు నెలల్లో Zurzuve డ్రగ్ను ప్రారంభించవచ్చని తెలుస్తోంది. మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ (MDD) ఉన్న పెద్దలకు చికిత్స చేయడానికి Zurzuway మెడిసిన్ అప్లికేషన్ కోసం FDA జారీ చేసిన ఒక ప్రకటనలో, ఔషధం ఎంత ప్రభావవంతంగా ఉందో చూపించడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవు. ప్రస్తుతం దీనికి మరింత అధ్యయనం అవసరం అవుతుందని తెలిపారు. తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలు, ముఖ్యంగా ప్రసవానంతర వ్యాకులతను నోటి ద్వారా తీసుకోగలిగే ఈ మెడిసిన్ ద్వారా ప్రయోజనం పొందవచ్చని ఈ మెడిసిన్ తయారుచేస్తున్న వైద్యులు తెలిపారు. ప్రసవానంతర డిప్రెషన్ చికిత్సకు ఇప్పటి వరకు ఇంట్రావీనస్ ఇంజెక్షన్ మాత్రమే వాడుతున్నామని, మెడిసిన్ ద్వారా ఈ దిశగా ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయని, అయితే ఇందులో జుర్జువే ఎంత ప్రభావవంతంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎఫ్డిఎ నిపుణులు తెలిపారు. ప్రసవానంతర డిప్రెషన్ కోసం ప్రత్యేకంగా ఈ మాత్రను రూపొందించారు. ఇతర యాంటిడిప్రెసెంట్ డ్రగ్స్ దీని కంటే వేగంగా పనిచేస్తాయి. ఇది కేవలం రెండు వారాల తక్కువ వ్యవధిలో తీసుకునేలా రూపొందించబడింది. కాబట్టి ఇది ప్రమాదకరమైనది కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రసానంతర ఔషధం తీసుకోవడం వల్ల డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ మెడిసిన్ వల్ల ఏవైనా దుష్ప్రభావాలు కలుగుతాయా అనే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయి, మెడిసిన్ సక్సెస్ అయితే ఎంతో మంది మహిళలకు డిప్రెషన్ సమస్య తొలగిపోతుంది. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు ప్రసవానంతర డిప్రెషన్ను అనుభవిస్తున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విచారించాల్సిన విషయం ఏమిటంటే, దాదాపు 75 శాతం మంది మహిళలు సమస్యను గుర్తించలేరు లేదా చికిత్స పొందలేరు. ఈ సంఖ్య కూడా ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మాతాశిశు మరణాల సమస్యకు ప్రసవానంతర డిప్రెషన్ కూడా ఒక కారణం అనే విషయం కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రసవానంతర డిప్రెషన్ కు మెడిసిన్ సక్సెస్ అయితే ఈ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం లభించినట్లే. *నిశ్శబ్ద.





















