యాదవ్ ఓ సీరియల్ రేపిస్ట్ టాక్సీ డ్రైవర్

Publish Date:Dec 12, 2014

Advertisement

 

ఇటీవల డిల్లీలో ఉబెర్ క్యాబ్ సర్వీస్ (టాక్సీ సర్వీస్) కు చెందిన శివ కుమార్ యాదవ్ అనే టాక్సీ డ్రవర్ ఒక సాఫ్ట్ వేర్ సంస్థ ఉద్యోగిని ఇంటికి తీసుకువెళుతూ మార్గమద్యంలో కారులో ఆమెపై అత్యాచారం చేసిన తరువాత పోలీసులు అతనిని అరెస్ట్ చేసి లోపల వేశారు. ఆ తరువాత అతని భారిన పడిన మరికొంత మంది మహిళలు కూడా ముందుకు వచ్చి పిర్యాదులు చేయడంతో అతనొక పాత నేరస్తుడేననే విషయం బయటపడింది.

 

డిల్లీకి సమీపంలో గల రామ్ నగర్ అనే ఒక మురికివాడలో తన ఇంట్లోనే చిన్న పాన్ షాపు నడుపుకొనే 46 ఏళ్ల మహిళపై కూడా అతను కొన్నేళ్ళ క్రితం అత్యాచారం చేసాడు. ఒకే వీధిలో ఉంటున్నందున చనువుగా ఆమెను పిన్ని అని సంభోదిస్తుండేవాడు. కానీ ఒకరోజు ఆ పిన్నినే ఆమె ఇంట్లోనే చెరిచాడు. అయితే నలుగురికి తెలిస్తే తలవంపులని ఆమె భర్త ఈ విషయాన్నీ ఎవరికీ తెలియనీయలేదు. కానీ ఎలాగో అందరికీ తెలిసిపోయింది. అయితే అత్యాచారం చేసిన శివకుమార్ యాదవ్ ను జనాలు ఏమీ అనలేదు కానీ ఆమెను మాత్రం కాకుల్లా పొడుస్తూ చిత్ర హింసలు పెట్టారని ఆమె కన్నీళ్ళు పెట్టుకొంది. ఆ తరువాత 2003లో అతను అదే వీధిలోగల మరొక యువతిని కూడా చెరిచాడు. అయితే ఆమెకు కూడా వీధిలో జనాల నుండి అటువంటి చేదు అనుభవాలే ఎదురవడంతో ఆమె చేసేదేమీ లేక ఆ వీధిని విడిచి ఎక్కడికో వెళ్లిపోయింది.

 

ఆ తరువాత 2011లో గుర్ గావ్ లో ఒక బార్ డ్యాన్సర్ ని కూడా శివకుమార్ రేప్ చేసాడు. అప్పుడు ఆమె పోలీసు కేసు పెడితే దాదాపు ఏడు నెలలు జైల్లో ఉన్నాడు. ఆ తరువాత ఆమెతో ఏదోవిధంగా కోర్టు బయట సెటిల్ మెంట్ చేసుకొని జైల్లో నుండి బయట పడ్డాడు. ఆ తరువాత అతను ఆగస్ట్ 2013లో రామ్ నగర్ సమీపంలో గల నాగ్లతార్ అనే ప్రాంతంలో నివసిస్తున్న ఒక 15ఏళ్ల బాలికను తుపాకీ చూపి అత్యాచారం చేసాడు. వెంటనే ఆమె తల్లి తండ్రులు పోలీసులకి పిర్యాదు చేయకుండా ఆమెకు పక్క గ్రామానికి చెందిన ఒక వ్యక్తికిచ్చి పెళ్లి చేసేసి పంపించేసారు. ఆ తరువాత ఆమె భర్తకు ఆ సంగతి తెలిసినప్పుడు అతను పోలీస్ స్టేషన్ లో శివకుమార్ యాదవ్ పై భార్య చేత పిర్యాదు చేయించే ప్రయత్నం చేసాడు. కానీ పోలీసులు పిర్యాదు తీసుకొనేందుకు అంగీకరించలేదు.

 

ఇంతవరకు ఇంతమంది మహిళల జీవితాలతో చెలగాటమాడుకొన్నప్పటికీ అతనికి ఎటువంటి శిక్షపడకపోవడమే బహుశః అతనికి ఆ దైర్యం కలిగించి ఉండవచ్చును. ఈసారి కూడా తప్పించుకోవచ్చుననే ధీమాతోనే అతను సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారం చేసి ఉంటాడు. నిర్భయ కేసు జరిగినప్పుడు దేశమంతా ముక్త కంటంతో ఖండించింది. అప్పుడు కేంద్రం చట్టంలో కొన్ని కటినమయిన మార్పులు చేసింది. ఆ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు కూడా నెలకొల్పింది. కానీ ఇంతవరకు ఆ కేసులో నిందితులకు ఎటువంటి శిక్షాపడలేదు. పైగా ప్రభుత్వ ఖర్చులతో జైలులో కులాసాగా గడుపుతున్నారు. వారిలో ఒకరు పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకొంటున్నాడని ఆ మధ్యన వార్తలు వచ్చేయి. బహుశః చట్టం యొక్క ఈ బలహీనతే ఇటువంటి నేరస్తులకు దైర్యం కల్పిస్తోంది.

 

కటినమయిన నిర్భయ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ, ఆనాటి నుండే దేశంలో మహిళలు, బాలికలు చివరికి అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలపై ఇటువంటి మానవ మృగాలు అత్యాచారాలు బాగా పెరిగిపోయాయి. దానికి తోడు సమాజం కూడా భాదితురాలినే దోషిగా చూడటం వలన వారి మనోవేదన ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఆ కారణంగా ఇటువంటి మానవ మృగాలు నేటికీ సమాజంలో విచ్చలవిడిగా తిరుగగలుగుతున్నాయి.

 

ఎక్కడ మహిళలు గౌరవించబడుతారో అక్కడ దేవతలు కొలువయ్యి ఉంటారని పెద్దల మాట. అదే విధంగా కలకంటి కన్నీరు ఒలికిన చోట శాంతి ఉండదని మహాభారతం నిరూపిస్తోంది. అయినప్పటికీ ఇవేవీ పట్టించుకొనే స్థితిలో లేరు ప్రజలు, ప్రభుత్వం, చట్టాలు కూడా. ఈ సమాజం ఎప్పుడు మారుతుందో.. ఈ చట్టాలు ఆ మానవ మృగాలను ఎప్పటికి శిక్షించగలుగుతాయో...ఎవరికీ తెలియదు. కానీ అంతవరకు స్త్రీ జాతికి ఈ మనోవేదన అనుభవించక తప్పదు.

By
en-us Political News

  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.