రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఏసీబి తొందరపడిందా?

Publish Date:Jun 5, 2015

Advertisement

 

తెదేపా యం.యల్యే. రేవంత్ రెడ్డిని ఏదో విధంగా ఉచ్చులో బిగించాలని తొందరలో ఏసీబి అధికారులు, వారికి వెనుక నుండి వత్తాసు పలుకుతున్నవారు కొన్ని విషయాలు విస్మరించడం వలన చివరికి వారు త్రవ్విన గోతిలో వారే పడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ వ్యవహారం అంతా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో జరిగింది. కనుక ప్రజాప్రతినిధి అయిన రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టేముందు ఏసీబి అధికారులు తప్పనిసరిగా ఎన్నికల కమీషన్ కి ముందుగా తెలియజేసి, దాని అనుమతితోనే చేప్పట్టవలసి ఉంటుంది. కానీ ఎన్నికల కోడ్ ని పట్టించుకోకుండా ఏసీబి అధికారులు ప్రజాప్రతినిధి అయిన రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టడం, నిర్బందించడం రెండూ కూడా తప్పేనని, ఆవిధంగా చేసినందుకు ఒకవేళ ఎన్నికల కమీషన్ ఏసీబి అధికారులపై చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

 

ఇక ఏప్రిల్, 2014లో ఆప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ రంజన్ గోగయ్ మరియు జస్టిస్ యన్.వి. రమణలతో కూడిన ధర్మాసనం “స్టింగ్ ఆపరేషన్లపై” ఇచ్చిన ఒక తీర్పులో “ఒక నేరస్తుడిని సాక్ష్యాధారాలతో పట్టుకొనే ప్రయత్నంలో స్టింగ్ ఆపరేషన్స్ నిర్వహించడం నైతిక విలువలను ప్రశ్నార్ధకంగా మార్చుతాయి. ఒకవేళ నిందితుడికి నేరం చేయాలనే ఉద్దేశ్యం, ఆలోచనా లేకపోయినప్పటికీ, తను నేరం చేసినా ఎవరూ కనుగొనలేరనే భావన అతనిలో కల్పించడం, తద్వారా అతనిని నేరానికి ప్రోత్సహించడం ఏవిధంగా సమర్ధనీయం కాదు. అటువంటి పరిస్థితి నెలకొని ఉందని తెలిసుంటే బహుశః నిందితుడికి నేరం చేయాలనే ఆలోచన చేయకపోవచ్చును. అటువంటప్పుడు ఒక అమాయకుడయిన వ్యక్తిని ఈవిధంగా నేరం చేయడానికి ప్రేరేపించి నేరస్తుడిగా నిరూపించే ప్రయత్నం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. అతను నేరం చేయడానికి అనువయిన పరిస్థితులను స్వయంగా కల్పించి, నేరం చేసినా ఎవరూ కనుగొనలేరనే అభిప్రాయం అతనికి కలిగించి, నేరం చేయడానికి పరోక్షంగా ప్రేరేపించి, అతను నేరం చేస్తున్నపుడు ఈ విధంగా స్టింగ్ ఆపరేషన్స్ చేసి ఒక వ్యక్తిని దోషిగా నిరూపించే ప్రయత్నం కూడా నేరమే! కనుక నైతిక విలువలకు విరుద్దమయిన ‘స్టింగ్ ఆపరేషన్స్’ ద్వారా సేకరించిన ఆధారాలను సాక్ష్యాలుగా స్వీకరించలేము,” అని పేర్కొంది సుప్రీం కోర్టు ధర్మాసనం.

 

అదే విధంగా రిసాల్ సింగ్ వెర్సస్ హర్యానా ప్రభుత్వం కేసుతో సహా అటువంటి అనేక ఇతర కేసులలో సుప్రీంకోర్టు ‘స్టింగ్ ఆపరేషన్’ నిర్వహించడాన్ని తప్పు పట్టడమే కాకుండా వాటి ద్వారా సేకరించిన సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరించింది. కనుక రేవంత్ రెడ్డిపై ఏసీబీ అధికారులు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ కూడా కోర్టులు పరిగణనలోకి తీసుకోవని భావించవచ్చును.

 

ఇక ఇటువంటి వ్యవహారాలలో ఏసీబీ అధికారులు స్వయంగా సేకరించిన ఆధారాలకు తప్ప మూడవ వ్యక్తి అందజేసిన ఆధారాలు అంటే నామినేటడ్ యంయల్యే స్టీఫన్ సన్ లేదా మరొకరో తమ ఫోన్ లో రికార్డు చేసిన సంభాషణలు వంటివి కోర్టులు సాక్ష్యాలుగా స్వీకరించవని న్యాయ నిపుణులు తెలుపుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి వ్యవహారంలో జరిగిన మరొక పొరపాటు ఏమిటంటే ఏసీబీ అధికారులు చిత్రీకరించిన ఆడియో వీడియో క్లిప్పింగులను వారికి తెలిసో, తెలియకుండానో ఎవరో బహిర్గతం చేయడం. ఏసీబీ అధికారులు కేవలం నేరస్తుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొనే ఉద్దేశ్యంతోనే రికార్డు చేసిన ఆడియో, వీడియో క్లిప్పింగులను కేవలం నేర విచారణ కోసమే వినియోగించాలి తప్ప మీడియాకు విడుదల చేయకూడదు. కానీ విడుదల చేయబడ్డాయి. అంటే రాజకీయ దురుదేశ్యంతోనే ఎవరో పనిగట్టుకొని ఈ పని చేసినట్లు స్పష్టమవుతోంది.

 

వాటిని తాము మీడియాకు విడుదల చేయలేదని ఏసీబీ డీజీపి యంఏ.ఖాన్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు. అంటే ఏసీబీ అధికారులు కాకుండా వేరేవరయినా కూడా రికార్డు చేసేందుకు ఏసీబీ అధికారులు అనుమతించారా? లేకపోతే వారే స్వయంగా ఎవరికో అందజేసి మీడియాకు విడుదల చేసి తమకుతెలియదని చెపుతున్నారా? అనే ప్రశ్నకు ఏసీబీ అధికారులు కోర్టులో జవాబు చెప్పవలసి రావచ్చును. ఇక వారు రికార్డు చేసిన ఆడియో, వీడియో టేపులను మీడియాకు విడుదల చేయడం ద్వారా ఒక ప్రజాప్రతినిధిని రాజకీయంగా దెబ్బ తీయాలనే ప్రయత్నం జరిగినట్లు స్పష్టం అవుతోంది కనుక సదరు వ్యక్తులని, ఏసీబీ అధికారులను కూడా కోర్టులు బాధ్యులను చేసే అవకాశమున్నట్లు న్యాయ నిపుణులు చెపుతున్నారు.

 

ఇక మరో ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే స్టింగ్ ఆపరేషన్ ద్వారా సేకరించిన ఆడియో, వీడియో సాక్ష్యాలను కోర్టులు పరిగణనలోకి తీసుకోవనే చిన్న విషయం నేరస్తులను కనిపెట్టే ఏసీబీ అధికారులకు గానీ, వారిని వెనుక నుండి ప్రోత్సహిస్తున్న వారికి గానీ తెలియకపోవడం. ఏమయినప్పటికీ రేవంత్ రెడ్డి కేసులో అతనిని నేరస్తుడిగా నిరూపించే ప్రయత్నం కంటే ఆయనను, ఆయన పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలనే ప్రయత్నమే ఎక్కువగా కనబడుతోంది. ఏసీబి అధికారులు నేర నిరూపణ చేయకముందే వారు రికార్డు చేసిన ఆడియో వీడియోలను మీడియాకు తక్షణమే విడుదల చేయడం, ఏసీబి అధికారులు మాట్లాడవలసిన సాక్ష్యాలు ఆధారాలు వంటి విషయాల గురించి రాజకీయ నాయకులు మాట్లాడటం, కోర్టులు తీర్పు చెప్పకముందే తామే తీర్పులు చెపుతుండటం వంటివన్నీ నిశితంగా గమనిస్తే ఇది రాజకీయ దురుదేశ్యంతో జరిగిందనే అనుమానం కలుగక మానదు.

By
en-us Political News

  
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.