ముఖ్యమంత్రి కేసీఆర్ కి రేవంత్ రెడ్డి సలహా

Publish Date:Nov 12, 2014

Advertisement

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడల గురించి, ఆయన అనుసరిస్తున్న ఘర్షణ వైఖరి గురించి ఇప్పటికే చాలా విమర్శలు మూటగట్టుకొన్నారు. కానీ ఆయన తన వైఖరిని మార్చుకొనే ప్రయత్నం చేసినట్లు కనబడలేదు. అందుకే ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాలలో ప్రతిపక్ష సభ్యులు ఒకరి తరువాత మరొకరు తరచూ ఆయన వైఖరిని తప్పుపడుతున్నారని చెప్పవచ్చును.

 

కేసీఆర్ ఆరోపిస్తున్నట్లు ఆంద్ర ప్రభుత్వం వలననో, లేక కేంద్రప్రభుత్వం వలననో కాక, కేవలం ఆయన అహంభావం వలననే తెలంగాణాకు ఎక్కువ నష్టం కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయనకి తెలంగాణా మీద, ప్రజల మీద అపరిమితమయిన అభిమానం ఉంటే ఉండవచ్చును. కానీ ఆయన  అభిమానం హద్దులు మీరితే అది దురాభిమానంగా మారుతుంటుంది. అప్పుడు అందరూ కూడా శత్రువులు మాదిరిగానే కనబడుతుంటారు.

 

తమిళప్రజలకు తమ తమిళబాష అంటే చాలా అభిమానం. అందుకే అక్కడ తమిళభాష వెలిగిపోతోంది. కానీ వారి ఆ అభిమానం దురాభిమానంగా మారడంతో వారికి ఇతర బాషల పట్ల, ముఖ్యంగా జాతీయ బాష అయిన హిందీ పట్ల తీవ్ర వ్యతిరేఖత కనబరుస్తుంటారు. కానీ దాని వలన హిందీ బాషకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా, వారు హిందీ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు తరచూ అపహాస్యం చేయబడుతుంటారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన రాష్ట్రం పట్ల ఇటువంటి దురభిమానమే పెంచుకొని, ఆంద్ర, కేంద్ర ప్రభుత్వాలతో కయ్యానికి కాలుదువ్వుతున్నట్లున్నారు. దానికి తోడు తెదేపా, తెరాసల మధ్య గల రాజకీయ వైరం, కేసీఆర్ కు ఆంద్ర పాలకుల పట్ల సహజంగా ఉన్న విద్వేషం వంటి అనేక కారణాలతో ఆయన అందరితో ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నారు. కానీ ఆయన వైఖరి వలన తెలంగాణాకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోందని చెప్పవచ్చును. ఇటు పొరుగు రాష్ట్రం నుండి కానీ కేంద్రం నుండి గానీ తెలంగాణాకు ఎటువంటి సహాయ, సహకారాలు పొందే అవకాశం లేకుండా ఆయనే స్వయంగా తలుపులు మూసుకొన్నట్లుంది.

 

ఈరోజు శాసనసభ ప్రాంగణంలో తెదేపా సభ్యుడు రేవంత్ రెడ్డి ఒక ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణా రాష్ట్ర పరిపాలన చేయడంలో ఘోరంగా విఫలమయిన కేసీఆర్, హరీష్ రావుకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తే ఆయన పరిస్థితులను చక్కబెట్టగలడని అభిప్రాయం వ్యక్తం చేసారు. హరీష్ రావు ఎంత తీవ్ర సమస్యలు ఎదురయినప్పటికీ ఎన్నడూ సంయమనం కోల్పోకుండా చిరునవ్వుతోనే పనులు చక్కబెట్టేస్తుంటారు. బహుశః అందుకే రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదన చేసి ఉండవచ్చును. కానీ పదేళ్ళపాటు ఎంతో సమర్ధంగా ఉద్యమాలు చేసి, తెలంగాణా సాధించిన కేసీఆర్, రాష్ట్ర అభివృద్ధికి అదే ఉద్యమస్పూర్తిని కొనసాగించడం తప్పు కాదు. కానీ ఉద్యమాన్ని నడిపినట్లు, ప్రభుత్వాన్ని కూడా అదే ఆవేశంతో నడపాలని ప్రయత్నిస్తున్నందునే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని చెప్పవచ్చును.

 

తమది మావోయిష్టుల ఎజెండాయే అని గొప్పగా చెప్పుకొంటున్న కేసీఆర్ ను అదే మావోయిష్టులు తప్పు పడుతుండటం గమనార్హం. బహుశః అన్ని వైపులా నుండి కురుస్తున్న ఈ విమర్శల కారణంగా తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నందునే ముఖ్యమంత్రి కేసీఆర్ ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నారేమో కూడా. కారణాలు ఏవయినప్పటికీ ఆయన అనుసరిస్తున్న నిరంకుశ, ఘర్షణ వైఖరి వల్ల, ఇతరుల సహకారం ఎలాగు దొరకదు. పైగా ఆయనకు, ప్రభుత్వానికి, రాష్ట్రానికి, పొరుగు రాష్ట్రానికి కూడా ఊహించని కొత్త సమస్యలు పుట్టుకు రావడం తప్ప వేరే ప్రయోజనం ఉండబోదని చెప్పవచ్చును.

By
en-us Political News

  
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కుప్పంకు దగ్గరగానే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా సంప్రదింపులు జరిపింది. ఏపీ సర్కార్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి కుప్పం ఎయిర్ పోర్టుకు అవసరమైన షరతులతో కూడిన  నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను విజయవంతంగా సాధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.