ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి ఈ 5 అంశాలు మీకు తెలిసి వుండకపోవచ్చు!

Publish Date:Jun 29, 2017

Advertisement

రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు. కాని, ఆ ప్రథమ పౌరుడ్ని ఎన్నుకునే హక్కు, బాధ్యతా రెండూ దేశ పౌరులకి వుండవు. మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే మన తరుఫున రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అయితే, అనేక ఆసక్తికర అంశాల రాష్ట్రపతి ఎన్నికలో కీలకమైన అయిదు ప్రధాన అంశాల్ని ఇప్పుడు తెలుసుకుందాం…

 

1. దేశంలోని దాదాపు అన్ని ఎలక్షన్స్ ఇప్పుడు ఈవీఎంల ద్వారా జరుగుతున్నాయి. కాని, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు పేపర్ బ్యాలెట్ ద్వారానే ఓటు వేయాల్సి వుంటుంది. ఎంపీలకు ఆకుపచ్చ రంగు స్లిప్ ఇస్తారు. ఎమ్మెల్యేలకు పింక్ స్లిప్ ఇస్తారు. అయితే, ప్రజా ప్రతినిధులు బాలెట్ లో తప్పకుండా స్పష్టంగా పేర్కొనాల్సింది… తమ తొలి ప్రాధాన్యత ఎవరికి అని! ఫస్ట్ ప్రిఫరెన్స్ చెప్పని , తప్పుగా చెప్పిన బాలెట్లని తిరస్కరించటం జరుగుతుంది…

 

2. రాష్ట్రపతిగా పోటీ చేయటానికి ఎవరైనా అర్హులే. అయితే, తప్పనిసరిగా వార్ని 50మంది ప్రజాప్రతినిధులు సపోర్ట్ చేయాలి. ఆ 50మంది తప్పనిసరిగా రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు కలిగిన వారై కూడా వుండాలి. ఇలా జరగని పక్షంలో ఆ నామినేషన్ తిరస్కరించటం జరుగుతుంది. 1977లో 7వ రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మొత్తం 36నామినేషన్లు తిరస్కరించారు. మిగిలిన ఒకే ఒక్క స్వీకరింపబడ్డ నామినేషన్ వేసిన నీలం సంజీవ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు…

 

3. ఇతర ఏ ఎన్నికలో అయినా ఓటర్ తనకు కేటాయించిన బూత్ కి మాత్రేమే వెళ్లి ఓటు వేయాలి. కాని, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనే రాష్ట్రపతి ఎన్నిక కోసం వారు అడిగిన బూత్ కేటాయిస్తారు. సాధారణంగా దిల్లీలోని పార్లమెంట్ హౌజ్ లో ఎంపీలకు బూత్ వుంటుంది. ఎమ్మెల్యేల కోసం వారి వారి రాష్ట్రల రాజధానుల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య పట్టణాల్లో బూత్ లు వుంటాయి. వాటిల్లో కాకుండా  వేరే చోట ఎవరైనా ఎంపీ, ఎమ్మెల్యే ఓటు వేయాలనుకుంటే ఈసీకి పది రోజుల ముందు సమాచారం ఇవ్వాలి…

 

4. రాష్ట్రపతి పదవికి పోటీ పడుతోన్న అభ్యర్థులు ప్రస్తుతం కడుతోన్న డిపాజిట్ అమౌంట్ 15వేలు. 1997కి ముందు ఇది 2500 వుండేది. 97లో పెంచారు. అయితే, తన 15వేల డిపాజిట్ ఒక అభ్యర్థి తిరిగి రాబట్టుకోవాలంటే… రాష్ట్రపతిగా గెలిచేందుకు అవసరమయ్యే ఓట్ల సంఖ్యలో అరవ వంతు ఓట్లు అతడికి పోలవ్వాలి. అంతకంటే తక్కువగా ఓట్లు వచ్చిన వారికి డిపాజిట్ దక్కదు!

 

5. రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కేవలం దిల్లీలోని పార్లమెంట్ హౌజ్ లోనే జరుగుతుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలైన ఓట్లని కూడా ప్రత్యేక సీల్డ్ కవర్లలో దిల్లీకి తరలిస్తారు. ఓట్లని బాలెట్ బాక్సుల్లోంచి కవర్లలోకి మార్చేది ప్రత్యేక అధికారులు. వీళ్లు రాష్ట్రపతి పదవికి పోటీపడుతోన్న అభ్యర్థుల ప్రతినిధుల సమక్షంలో ఓట్లను కవర్లలో భద్రపరుస్తారు. 

By
en-us Political News

  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.