వైసీపీలో జగన్ పట్టు సడలుతోందా?.. సీనియర్లపై భారం వేసి తప్పుకుంటున్నారా?

Publish Date:Sep 19, 2026

Advertisement

ఆ పార్టీ నుంచి ఇటీవలి కాలంలో పెరుగుతున్న వలసలు, పార్టీలో చోటు చేసుకుంటున్న అంతర్గత కుమ్ములాటలు చూస్తుంటే.. ఆ పార్టీకి స్థానిక ఎన్నికలు అగ్నిపరీక్షగా మారేలా కనిపిస్తున్నా యంటున్నారు పరిశీలకులు. సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. స్థానిక పోరులో ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కాకూడదు, పార్టీ గట్టి పోటీ ఇవ్వాలంటూ ఇటీవల దిశానిర్దేశం చేసిన జగన్.. తీరా కార్యరంగంలోకి దిగాల్సిన సమయంలో విదేశీ పర్యటన అంటూ వెళ్లిపోవడానికి.. పార్టీలో పెరిగిన వలసలు, అంతర్గత కుమ్ములాటలను నియంత్రించి పార్టీని గాడిలో పెట్టలేని నిస్సహాయత కూడా ఒక కారణమా అన్న కోణాల్లోనూ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో కూడా పార్టీలో అసమ్మతి సెగలు భగ్గుమన్న సమయంలోనూ జగన్ వాటిని సద్దుమణిగేలా చేయడంలో విఫలమయ్యారని ప్రస్తుత పరిస్థితితో పోలుస్తూ వైసీపీ శ్రేణుల అంతర్గత సంభాషణల్లో చర్చ జరుగుతోంది. అప్పుడంటే అధికారం చేతిలో ఉంది కనుక.. పార్టీ నేతలు ఒకరి తరువాత ఒకరుగా దారిలోకి వచ్చారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. ఇప్పుడు పార్టీ అధినేతగా జగన్ పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. 

 ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ వేగంగా పట్టుకోల్పోతున్న తరుణంలో.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడమెలా అని జగన్ తలపట్టుకుంటున్న పరిస్థితి ఉందంటున్నారు. ఒకవైపు సీనియర్ నేతల సస్పెన్షన్లు, మరోవైపు కీలక నాయకుల వలసలు.. స్థానిక సమరం మాట తలుచుకోవడానికే పార్టీ నేతలు, శ్రేణులలో  గుబులు పుట్టే పరిస్థితి ఉంది.   

 తాజాగా రేపల్లె నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నాయకుడు  మోపిదేవి శ్రీనివాసరావుపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేయడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది.  బాపట్ల జిల్లాతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ సస్పెన్షన్ వైసీపీపై ప్రతికూలంగా పడింది. మరీ ముఖ్యంగా  మోపిదేవిపై సస్పెన్షన్ వేటుకు ముందు కనీసం ఆయన వివరణ కూడా తీసుకోకపోవడంపై బాపట్ల, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ శ్రేణులలో అసంతప్తి భగ్గుమంటోంది. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన నేతలకు అధిష్ఠానం ఇచ్చే మర్యాద ఇదా అన్న ఆగ్రహం వ్యక్తమౌతోంది.  

అలాగే ఉత్తరాంధ్ర రాజకీయాలు కూడా జగన్ కు  తలనొప్పిగా పరిణమించాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పార్టీకి సేవలు అందించిన కీలక నేత మజ్జి శ్రీను ఇటీవల  పార్టీకి రాజీనామా చేయడం   పెద్ద ఎదురు దెబ్బ అనడంలో సందేహం లేదు. ఇక  కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ పరిశీలకుడు నెక్కంటి సాయిప్రసాద్ కూడా పార్టీని వీడటం చూస్తుంటే.. ఈ వలసలు ఒక ప్రవాహంగా కొనసాగే అవకాశం ఉందన్న భావన పార్టీ వర్గాల్లోనే వ్యక్తమౌతోంది.  ఇందుకు నిదర్శనంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్   భవిష్యత్తులో వైఎస్సార్సీపీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదంటూ తాజాగా చేసిన కామెంట్లను నిదర్శనంగా చూపుతున్నారు పరిశీలకులు.  

ఈ వార్త కూడా చదవండి సిట్టింగ్ స్థానాల్లోనూ పట్టు కోల్పోతున్న వైసీపీ https://teluguone.com/news/prevsingle/ycp-pride-diminishing-daybyday-2013+09-39-218165.html

ఈ నేపథ్యంలోనే తన విదేశీ పర్యటన పెట్టుకున్న జగన్.. నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. బొత్స, తమ్మినేనిలతో భేటీ అయ్యారు. వారిని బుజ్జగించారు. వచ్చే ఎన్నికలలో మీకు పార్టీ టికెట్లు ఖాయమంటూ భరోసా ఇవ్వడమే కాకుండా వారు ఎక్కడ నుంచి పోటీ చేయాలో కూడా చెప్పేశారు. అది చాలదనుకున్నారో ఏమో బొత్స కుమార్తెకు కీలక పదవి కట్టబెట్టారు.

పార్టీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు అంటూ వ్యాఖ్యలు చేసిన తమ్మినేని కుమారుడిపై చర్యలు తీసుకోవడం అటుంచి కనీసం మందలించను కూడా లేదు. వీటన్నిటినీ బట్టి చూస్తుంటే.. పార్టీపై జగన్ కు గతంలో ఉన్న పట్టు సడలిందని అంటున్నారు. అందుకే కీలక సమయంలో విదేశీ పర్యటకు వెడుతూ.. స్థానిక ఎన్నికలలో వైసీపీ వైఫల్యం ప్రభావం తన నాయకత్వంపై పడకుండా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. 

[Jagan, YCP, Loose Grip, YCP Internal, Crisis, Leaders Leave Party, Telugu One] 

By
en-us Political News

  
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.