మోడీని రాహుల్ అందుకే టార్గెట్ చేసుకొంటున్నారా?

Publish Date:May 29, 2015

Advertisement

 

మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీతో గంటసేపు సమావేశమవడంపై రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఆయన రాజకీయ అపరిపక్వతకు అద్దం పట్టేవిగా ఉన్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పుతోందని డా. మన్మోహన్ సింగ్ హెచ్చరించగానే కంగారుపడిన ప్రధాని మోడీ తక్షణమే ఆయనను తన నివాసానికి ఆహ్వానించి ఆయన చేత పాఠాలు చెప్పించుకొన్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేసారు.

 

డా.మన్మోహన్ సింగ్ మంచి ఆర్ధికనిపుణుడనే విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానంలేదు. కానీ అంతటి వాడిని కూడా తల్లీకొడుకులు కలిసి ఒక డమ్మీగా చేసి దేశాన్ని ఏవిధంగా భ్రష్టు పట్టించారో, అందుకు వారికి ప్రజలు ఏవిధంగా గుణపాఠం చెప్పారో రాహుల్ గాంధీ కూడా తెలుసు. అంత గొప్ప మేధావి సేవలు ఉపయోగించుకొని దేశాన్ని ప్రగతి పధంలో నడిపించకపోగా, అటువంటి మచ్చలేని నిజాయితీపరుడుకి కూడా బొగ్గు మసి అంటించింది ఎవరు? చివరికి కొన్ని విదేశీ పత్రికలలో సైతం ఆయన ‘అత్యంత అసమర్ధ ప్రధానమంత్రి’ అని హెడ్డింగ్ పెట్టి కవర్ పేజీ కధనాలు ప్రచురించాయంటే దానికి ఎవరిని నిందించాలి?

 

ప్రధాని నరేంద్ర మోడీ డా.మన్మోహన్ సింగ్ అంత గొప్ప చదువులు చదువుకొని ఉండకపోవచ్చును. కానీ కేవలం ఏడాది కాలంలోనే దేశ ఆర్ధిక వ్యవస్థను మళ్ళీ గాడిన పెట్టగలిగారని స్వదేశంలోనే కాదు విదేశీ ఆర్ధిక నిపుణులు సైతం మెచ్చుకొంటున్న సంగతి కూడా రాహుల్ గాంధీకి తెలియకపోతే ఆయన లోకజ్ఞానం ఎంతగొప్పగా ఉందో అర్ధమవుతుంది.

 

కేవలం నెహ్రూ కుటుంబానికి చెందినందునే కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షపదవిలో, కుదిరితే ప్రధాని కుర్చీలో కూడా కూర్చోవాలనుకొన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ రక్తంలోనే ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక తమ పార్టీలో కనిపిస్తున్న క్రమాశిక్షణా రాహిత్యాన్నే ప్రజాస్వామ్యమని చెప్పుకోవడం కూడా ఆయనకే చెల్లు. తమ పార్టీలో ఏవిషయంపైనైనా అందరూ కలిసి కూర్చొని నిర్భీతిగా చర్చించగలరని రాహుల్ గాంధీ చెప్పుకోవడమూ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సాక్షాత్ డా.మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేసిన ప్రజా ప్రతినిధుల చట్టం నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదు...దానిని చెత్త బుట్టలో పడేయాల్సిందేనని రాహుల్ గాంధీ ఆయనను ఏవిధంగా అవమానించారో, ఆ తరువాత ఆ చట్టాన్నినిజంగానే చట్టబుట్టలో పడేయడం గురించి కూడా ప్రజలందరికీ తెలుసు. తమ ప్రభుత్వమే చేసిన చట్టాన్ని ఏ అధికారంతో ఆయన నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదని తీసిపడేసారు? అని ప్రశ్నకు బహుశః ఆయన వద్ద సమాధానం ఉండకపోవచ్చును.

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కూడా ఆ తల్లి కొడుకుల పుణ్యమాని రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ, దానితో బాటు అనేకమంది నేతలు ఏవిధంగా బలయిపోయారో అందరికీ తెలుసు. ఒకపక్క కాంగ్రెస్ పార్టీ మీద కర్రపెత్తనం చేస్తూనే మళ్ళీ మోడీ కర్ర పెత్తనం చేస్తున్నారంటూ విమర్శించడం చాలా హాస్యాస్పదం.

 

కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు నిత్యం మోడీని టార్గెట్ చేసుకొని ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు? అని ఆలోచిస్తే దానికి చాలా ఆశ్చర్యకరమయిన కారణాలు కనబడతాయి. కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్ నేతలు ఆయన నాయకత్వ శక్తిని, లక్షణాలను అనుమానిస్తూ, పార్టీ పగ్గాలు వేరెవరికయినా అప్పగించాలని కోరుతున్న సంగతి అందరికీ తెలిసిందే. బహుశః మోడీని విమర్శిస్తుండటం వలన తాను మోడీకి ఏమాత్రం తీసిపోనని, తనలోని ఆయనకున్న నాయకత్వ లక్షణాలన్నీ ఉన్నాయని కనుక కాంగ్రెస్ పార్టీ అద్యక్షపదవిని చెప్పట్టేందుకు తనే అన్ని విధాల అర్హుడనని నిరూపించుకొనే ప్రయత్నంలోనే ఆయన మోడీని విమర్శిస్తున్నారేమో? అనే అనుమానాలు కలుగుతున్నాయి మోడీని విమర్శించడం ద్వారా ఆయన తన స్థాయి పెరుగుతుందనుకొంటే అది భ్రమ మాత్రమే. పైగా తన స్థాయిని పెంచుకోవడానికి రాహుల్ గాంధీ అటువంటి ప్రయత్నాలు చేస్తే ప్రజలు కూడా నవ్వుకొంటారు.

By
en-us Political News

  
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.