Publish Date:Apr 28, 2012
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టిడిపి టిక్కెట్టును సిమ్మా స్వామిబాబుకు ఇవ్వటంతో ఆ పార్టీలో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంది. టిక్కెట్టును ఆశిస్తున్న మిగిలిన నాయకులు బాహాటంగానే పార్టీపై తిరుగుబాటును ప్రకటించారు. ఈ ప్రాంతంలోని ముఖ్యనాయకులైన బగ్గు లక్ష్మణరావు, బగ్గు రామకృష్ణ తదితరులు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. వీరితో పాటు అనేకమంది మండల, గ్రామస్థాయి నాయకులు కూడా తెలుగుదేశంపార్టీకి దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన ఈ చిచ్చు ఒకరకంగా కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చింది. ఇదే అదునుగా భావించిన మంత్రి ధర్మానప్రసాదరావు ఈ నాయకులతో మాట్లాడి కాంగ్రెస్ లో చేరవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికితే వచ్చే రెండేళ్ళలో వారి పరిథిలోని గ్రామాల అభివృద్ధికి పెద్దఎత్తున నిథులు కేటాయిస్తామని ధర్మాన వాగ్థానం చేస్తున్నారు. దీంతో మండలస్థాయిలోని అనేకమంది టిడిపి నాయకులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికేందుకు సిద్ధపడుతున్నారు. ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కాంగ్రెస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తుండగా టిడిపి మాత్రం విభేదాలతో వెనుకబడి వుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/narasannapet-constituency-of-srikakulam-24-13694.html
మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్తో పాటు మరో ముగ్గురికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
కూకట్పల్లి ప్రాంతంలోని రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, మెస్సులు, పీజీ హాస్టళ్లలో తెలంగాణ ఆహార నిత్యావసర ఔషధాల ప్రమాణాల ప్రాధికార సంస్థ (టీజీ సేఫ్) ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది.
తెలంగాణ సమాజం బెయిల్ ఇవ్వదు.. కేసీఆర్పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు..!
సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత సంఘాలు..!
హైదరాబాద్ రోడ్డుపై మరమరాలు అమ్ముకుంటున్న బీఆర్ఎస్ మాజీ సర్పంచ్..!
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పోస్టులు చేసిన పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్పై హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు.
మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ నేతలది దారుణమైన ప్రవర్తన..!
సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవమానకరమైన, అసభ్యకర మైన, ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన చేపట్టాయి. కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లటి దుస్తులు ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు.
కూకట్పల్లి పరిధిలో ఉన్న ప్రశాంత్నగర్ పారిశ్రామిక వాడలోని ABC ప్రింటింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని కోరుతూ షాద్నగర్ ఎమ్మెల్యే కె. శంకరయ్య చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు
తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
17 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లకు కొత్త పోస్టింగులు..!