కొండా సురేఖ మాజీ ఓఎస్డీతో పాటు మరో ముగ్గురికి కోర్టులో ఊరట..!

Publish Date:Sep 9, 2026

Advertisement

మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌తో పాటు మరో ముగ్గురికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీరిపై నమోదైన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయ స్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.కోర్టు ఆదేశాల ప్రకారం నలుగురూ ఒక్కొక్కరు రూ.25 వేల పూచీకత్తు బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం పోలీసుల ఎదుట సరెండర్ కావాలని న్యాయస్థానం సూచించింది. ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి ఘటనకు సంబం ధించి సుమంత్‌పై పోలీ సులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇనుప రాడ్లతో దాడి చేశారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. 

సుమంత్ డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన విషయం విదితమే...అయితే ఈ కేసులో పరారీలో ఉన్న సుమంత్‌ తో పాటు ఇతర నిందితుల కోసం చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ నిందితులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేయ డంతో వారికి తాత్కాలిక ఊరట లభించింది. మరోవైపు, సుమంత్‌కు ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలపై తెలంగాణ హైకోర్టులోనూ విచారణ జరిగినట్లు గతంలో వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ 1న హైకోర్టు ఆయనకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించేందుకు నిరాకరిం చింది తాజా కోర్టు ఆదేశాల తో కేసు దర్యాప్తు తదుపరి దశకు చేరుకోనుంది. నిందితులు పోలీసుల ఎదుట సరెండర్ కావడం, అనంతరం దర్యాప్తు అధికారులు చేపట్టే చర్యలు కీలకంగా మారనున్నాయి.

 

 

(Konda Surekha, Former OSD Sumanth, Telangana High Court, CM Revanth reddy, Telugu One, Telugu News)

By
en-us Political News

  
కూకట్‌పల్లి ప్రాంతంలోని రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్‌ షాపులు, మెస్సులు, పీజీ హాస్టళ్లలో తెలంగాణ ఆహార నిత్యావసర ఔషధాల ప్రమాణాల ప్రాధికార సంస్థ (టీజీ సేఫ్) ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది.
తెలంగాణ సమాజం బెయిల్ ఇవ్వదు.. కేసీఆర్‌పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు..!
సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత సంఘాలు..!
హైదరాబాద్ రోడ్డుపై మరమరాలు అమ్ముకుంటున్న బీఆర్ఎస్ మాజీ సర్పంచ్..!
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పోస్టులు చేసిన పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్‌పై హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు.
మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ నేతలది దారుణమైన ప్రవర్తన..!
సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవమానకరమైన, అసభ్యకర మైన, ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ  బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన చేపట్టాయి. కేటీఆర్, హరీష్ రావు సహా  బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లటి దుస్తులు ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు.
కూకట్‌పల్లి పరిధిలో ఉన్న ప్రశాంత్‌నగర్ పారిశ్రామిక వాడలోని ABC ప్రింటింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరణాన్ని కోరుతూ షాద్‌నగర్‌ ఎమ్మెల్యే కె. శంకరయ్య చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు
తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
17 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లకు కొత్త పోస్టింగులు..!
క్షమాపణ చెప్పాల్సిందే!.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అసెంబ్లీ తీర్మానం..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.