కేటీఆర్‌పై కేసు నమోదు చేయాలి...కమిషనర్‌కు ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..!

Publish Date:Sep 9, 2026

Advertisement

సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవమానకరమైన, అసభ్యకర మైన, ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నాగర్‌కర్నూల్ లోక్‌సభ సభ్యుడు డా. మల్లు రవి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ఈ మేరకు బుధవారం పోలీస్ కమిషనర్‌ ను కలిసి ఒక  లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదు లో మల్లు రవి పలు అంశాలను ప్రస్తావించారు. కేటీఆర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి అత్యంత ఆక్షేపణీయమైన, అవమానకరమైన రీతిలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. సదరు వ్యాఖ్యలను సాధారణ సందర్భో చిత అర్థంలో పరిశీలించినా ముఖ్య మంత్రిని అత్యంత తక్కువ చేసి, అవమానించే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ విమర్శలకు చట్టబద్ధమైన పరిమితులు ఉన్నాయని, అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ విధానం, నిర్ణయం లేదా రాజకీయ చర్యపై చేసిన విమర్శలు కాదని ఆయన అన్నారు. 

ముఖ్యమంత్రి వ్యక్తిగత గౌరవం, ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో చేసిన వ్యక్తిగత దాడిగా ఆ వ్యాఖ్యలను పరిగణించా లని కోరారు. ముఖ్యమంత్రి ఒక ప్రజా, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి అని, ఆయన ప్రతిష్ట ప్రజా హోదాలో బాధ్యతలు నిర్వర్తించే సామర్థ్యంతో ముడిపడి ఉంటుందని మల్లు రవి పేర్కొన్నారు. బహిరంగ వేదికపై ప్రముఖ ప్రజాప్రతినిధి చేసిన ఇలాంటి వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించే విగా, అవమానకరంగా ఉన్నాయని ఆరోపించారు.

టెలివిజన్, వార్తాపత్రికలు, డిజిటల్, సోషల్ మీడియా వేదికల ద్వారా వ్యాఖ్యలు ప్రచారం కావడంతో పరిస్థితి మరింత తీవ్రతర మైందని ఫిర్యాదులో తెలిపారు. సంబంధిత వీడియోలు, ప్రసారాలు, సోషల్ మీడియా పోస్టులు తదితర ఎలక్ట్రానిక్ ఆధారాలను వెంటనే భద్రపరచి, సేకరించాలని పోలీసులను కోరారు. BNS సెక్షన్ 356 కింద పరువు నష్టం, BNS సెక్షన్ 352 కింద ఉద్దేశపూర్వక అవమానానికి సంబంధిం చిన నిబంధనల ప్రకారం తగిన చర్యలు ప్రారంభిం చాలని మల్లు రవి విజ్ఞప్తి చేశారు. 

విచారణలో వెల్లడయ్యే ఇతర చట్టపరమైన నిబంధనల కింద కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పరువు నష్టం కేసుల ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన BNSS సెక్షన్ 222 సహా వర్తించే విధానపరమైన నిబంధన లను పరిగణనలోకి తీసుకోవాలని సూచిం చారు. అవమానకరమైన విషయాలను మాట్లా డటం, ప్రచురించడం, పునరుత్పత్తి చేయడం లేదా ప్రచారం చేయడంలో బాధ్యులైన వ్యక్తుల పాత్ర ఏమైనా ఉన్నట్లయితే, దర్యాప్తు ద్వారా గుర్తించి వారిపై కూడా చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవా లని ఎంపీ కోరారు.

అయితే మొత్తం వ్యవహారంపై నిష్పాక్షికంగా, చట్టబద్ధ మైన పద్ధతిలో దర్యాప్తు జరపాలని స్పష్టం చేశారు.
ఈ ఫిర్యాదును అధికారికం గా రికార్డుల్లోకి తీసుకొని, ఆరోపణలపై తక్షణమే దర్యాప్తు చేపట్టి, వర్తించే చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని మల్లు రవి పోలీస్ కమిషనర్‌ను కోరారు. ముఖ్యమంత్రి పదవి, వ్యక్తిగత ప్రతిష్టను కించపరిచేలా బహిరం గంగా చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాల్సిన అవస రం ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

 

 

(MP Mallu Ravi complains to the Commissioner, CM Revanth rddy, KTR, Mlc Tata Madhu, Naveen Reddy, BRS party, KCR, Police Commissioner, CP Sajjanar, DGP C.V. Anand, Telugu One, Telugu News)

By
en-us Political News

  
మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ నేతలది దారుణమైన ప్రవర్తన..!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ  బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన చేపట్టాయి. కేటీఆర్, హరీష్ రావు సహా  బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లటి దుస్తులు ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు.
కూకట్‌పల్లి పరిధిలో ఉన్న ప్రశాంత్‌నగర్ పారిశ్రామిక వాడలోని ABC ప్రింటింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరణాన్ని కోరుతూ షాద్‌నగర్‌ ఎమ్మెల్యే కె. శంకరయ్య చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు
తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
17 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లకు కొత్త పోస్టింగులు..!
క్షమాపణ చెప్పాల్సిందే!.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అసెంబ్లీ తీర్మానం..!
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
మంచి భర్త.. చక్కని సంసారం.. ఆ ప్రేమకు గుర్తుగా ఓ చిన్నారి.. ఇలా సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో ఓ చిన్న అపార్థం తీవ్ర విషాదాన్ని నింపింది.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యలపై తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
12 మంది అనుమానిత వ్యక్తులపై పోలీసుల ఫోకస్..!
గజ్వేల్‌లో కాంగ్రెస్–బీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఘర్షణ..!
కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు   కేసీఆర్ ఫాంహౌస్‌ను ముట్టడికి పిలుపు నిచ్చారు. ఆ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.