Publish Date:Apr 30, 2012
పెద్దలసభ (రాజ్యసభ)కు ఎన్నికైన తొలిక్రీడాకారుడు అంటూ క్రికెట్ దిగ్గజం సచిన టెండూల్కర్ గురించి కొన్ని పత్రికలు ప్రత్యేక వార్తా కథనాలు రాయడం పట్ల క్రీడాభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి క్రీడా రంగం నుంచి ప్రధానంగా క్రికెట్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన క్రీడాకారులలో సచిన మూడోవాడు. తొలుత పటౌడి, ఆ తర్వాత సునీల్ గవాస్కర్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. వివిధ రంగాలకు చెందిన 12 మంది ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. నామినేట్ అయ్యే వీరికి కూడా ఇతర పార్లమెంట్ సభ్యుల మాదిరిగానే అన్ని హక్కులు, అధికారాలు వుంటాయి.
అయితే వీరు ఇతర పార్లమెంట్ సభ్యుల మాదిరిగా ప్రజాసమస్యలపై కీలకంగా వ్యవహరించడం లేదని కొంతమంది ఆరోపణలు చేస్తుండగా, వివిధ రంగాలకు చెందిన వారు ప్రముఖులైనప్పటికీ వారు రాజకీయ నాయకులు కారని, వారు రాజకీయాల కోసం ఎంపిక చేయలేదని, ఆయా రంగాలలో వారందించిన సేవలకు గౌరవ సూచకంగా మాత్రమే పార్లమెంటు సభ్యులుగా నియమితులయ్యారనే వారు వున్నారు. నామినేట్ అయిన సభ్యులు రాజకీయాలు మాట్లాడకపోయినా ప్రజలకు మేలు చేసే విధానపరమైన అంశాలు విషయంలో అయినా సలహాలు ఇస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-24-13731.html
హైదరాబాద్ రోడ్డుపై మరమరాలు అమ్ముకుంటున్న బీఆర్ఎస్ మాజీ సర్పంచ్..!
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పోస్టులు చేసిన పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్పై హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు.
మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ నేతలది దారుణమైన ప్రవర్తన..!
సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవమానకరమైన, అసభ్యకర మైన, ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన చేపట్టాయి. కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లటి దుస్తులు ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు.
కూకట్పల్లి పరిధిలో ఉన్న ప్రశాంత్నగర్ పారిశ్రామిక వాడలోని ABC ప్రింటింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని కోరుతూ షాద్నగర్ ఎమ్మెల్యే కె. శంకరయ్య చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు
తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
17 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లకు కొత్త పోస్టింగులు..!
క్షమాపణ చెప్పాల్సిందే!.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అసెంబ్లీ తీర్మానం..!
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
మంచి భర్త.. చక్కని సంసారం.. ఆ ప్రేమకు గుర్తుగా ఓ చిన్నారి.. ఇలా సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో ఓ చిన్న అపార్థం తీవ్ర విషాదాన్ని నింపింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు వ్యాఖ్యలపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.