బీజేపీకి ఢిల్లీ తెలుగు ఓటర్ల చావుదెబ్బ

Publish Date:Feb 10, 2015

Advertisement

 

ఢిల్లీలో ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీని చావుదెబ్బ కొట్టారు. ఒక్క బీజేపీని మాత్రమే కాదు.. కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోయింది కదా అనే సందేహం రావొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చచ్చిపోయి, సమాధిలో వున్న పార్టీ. ఆ పార్టీని చావుదెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు. ఓటర్లు ఇప్పుడు చావుదెబ్బ కొట్టింది కేవలం భారతీయ జనతా పార్టీనే. ఢిల్లీలోని ఇతర ఓటర్లతోపాటు తెలుగు ఓటర్లు కూడా భారతీయ జనతా పార్టీ మీద తమకున్న కసిని ఈ ఎన్నికలలో తీర్చుకున్నట్టు తెలుస్తోంది. ‘తెలుగువన్’ ఢిల్లీ బ్యూరో అందించిన సమాచారం ప్రకారం, ఢిల్లీలోని తెలుగువారు ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటు వేశారు. అటూ ఇటూ ఎటూ చూడకుండా చీపురు గుర్తు మీద ఓటేశారు. ఢిల్లీలో బీజేపీని దెబ్బతీయాలన్న ఉద్యమం సోషల్ మీడియాలో వ్యాపించింది. ఢిల్లీలో నివసించే చాలామంది తెలుగువారు తాము ఈసారి బీజేపీని చావుదెబ్బ తీయడానికే నిర్ణయించుకున్నామని సోషల్ మీడియాలో స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో వున్న తెలుగువారు ఢిల్లీలో నివసించే బంధుమిత్రులకు ఫోన్లు చేసి మరీ బీజేపీకి ఓటు వేయొద్దని చెప్పారంటే ఆంధ్రప్రదేశ్‌లో, తెలుగువారిలో బీజేపీ మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడ్డగోలు విభజనకు గురి కావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కూడా విభజనకు తనవంతు ఆజ్యం పోసింది. అయితే పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందిన సమయంలో వెంకయ్య నాయుడు ఒక్కరే ఏదో కాస్తంత కష్టపడ్డారన్న సానుభూతితోపాటు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గౌరవించే తెలుగుదేశం పార్టీతో స్నేహం చేస్తున్నారు కదా అన్న సాఫ్ట్ కార్నర్‌తో ఏపీ ప్రజలు బీజేపీని కొన్ని స్థానాల్లో ఆదరించారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ మీద తమ మనసులో వున్న కసిని, ప్రతీకారాన్ని తీర్చుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న విషయాన్ని తమ తీర్పుతో స్పష్టం చేశారు. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీని ఓడించే విషయంలో కూడా తెలుగువారు అదే తరహా ప్రతీకారాన్ని ప్రదర్శించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

ఢిల్లీలోని తెలుగువారు బీజేపీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి గల కారణాలను పరిశీలిస్తే, అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి చేస్తున్న అన్యాయమే కారణమని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలోగానీ, అవసరమైన నిధులు అందించే విషయంలో గానీ, విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందాల్సిన హక్కుల విషయంలోగానీ, నిధులు, నీళ్ళ విషయంలోగానీ కేంద్ర ప్రభుత్వం పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఈ ఆగ్రహమే ఢిల్లీలో వున్న తెలుగువారికీ సరఫరా అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఇప్పుడిప్పుడే వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. ఆ వ్యతిరేకతే ఇప్పుడు ఢిల్లీలో ప్రతిఫలించింది. ఈ నేపథ్యంలో బీజేపీ తనకు జనంలో పెరుగుతున్న వ్యతిరేకతను అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. తెలుగు ప్రజల గుండెలు మండిపోయేలా చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అలాంటి పరిస్థితే బీజేపీకీ రాకుండా వుండేలా బీజేపీ జాగ్రత్తపడాలి. తెలుగువారికి ఇచ్చిన హామీలను నెరవేర్చే బాటలో నడిచి తన పొరపాటును దిద్దుకునే ప్రయత్నం చేయాలి.

By
en-us Political News

  
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.