హైదరాబాద్ లో మరింత పటిష్టమయిన నిఘా వ్యవస్థ అవసరం

Publish Date:Nov 19, 2014

Advertisement

 

అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానంద రెడ్డిపై ఈరోజు ఉదయం హత్యా ప్రయత్నం జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఆయన త్రుటిలో తప్పించుకోగలిగారు. ఆయనపై కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు? ఆయనను ఎందుకు హత్య చేయాలనుకొన్నాడు? హత్య చేయదలిస్తే చేతిలో ఏ.కె.47వంటి అత్యధునికమయిన ఆయుధం ఉంచుకొని, దూరం నుండి కాల్చే బదులు కారులో ప్రవేశించి కాల్చాలని ఎందుకు ప్రయత్నించాడు. అంటే అతను నిజంగా ప్రొఫెషనల్ కిల్లర్ కాడా? కానప్పుడు అతను ఏ.కె.47వంటి అత్యధునికమయిన ఆయుధం ఏవిధంగా సంపాదించాడు? అతను నిజంగానే నిత్యానంద రెడ్డిని హత్య చేయాలను కొన్నాడా లేకపోతే కేవలం ఆయనను భయపెట్టేందుకే ఆ విధంగా చేసాడా? పారిపోతున్నపుడు తనను పోలీసులకి పట్టివ్వగల సాక్ష్యాలుగా పనికి వచ్చే ఏ.కె.47, బ్యాగుని కారులో ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? బ్యాగులో ఏమున్నాయి? అనే అనేక ప్రశ్నలు ఎవరికయినా కలుగక మానవు. వాటన్నిటికీ పోలీసులే సమాధానాలు కనుగొనాల్సి ఉంటుంది.

 

ఇక ఈ సంఘటన హైదరాబాద్ లో ప్రజల ప్రాణాలకు ఎంత భద్రత ఉందో అద్దం పట్టేదిగా ఉంది. ఒక వ్యక్తి పట్టపగలు జనసందోహం బాగా ఉన్నప్రాంతంలో అందరి కళ్ళ ఎదుటే ఏ.కె.47వంటి అత్యధునికమయిన ఆయుధంతో హత్యాప్రయత్నం చేయడం, తప్పించుకొని పారిపోగలగడం వంటివి నిఘా వ్యవస్థ మరింత పటిష్టం కావలసిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది. ఈరోజు నిత్యానంద రెడ్డిపై జరిగిన హత్యా ప్రయత్నాన్ని ఒక మామూలు హత్య కేసుగా పరిగణించలేము. ఎందుకంటే ఆ వ్యక్తి చేతిలో ఉన్నది సైనికులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు మాత్రమే ఉపయోగించ గలిగే ఏ.కె.47వంటి అత్యధునికమయిన ఆయుధం. అదే అయుధాన్ని ఆ వ్యక్తి పార్క్ కు వచ్చిన ప్రజలపై గురిపెట్టి ఉండి ఉంటే ఎంత అనర్ధం జరిగి ఉండేదో ఎవరయినా తేలికగానే ఊహించగలరు. గన్ సంస్క్రతికి బాగా అలవాటుపడిన అమెరికా దేశంలో ఇటువంటి సంఘటనలు అప్పుడప్పుడు జరగడం చూస్తూనే ఉన్నాము.

 

అందువల్ల ఈ సంఘటనను అంత తేలికగా తీసిపారేయలేము. హైదరాబాద్ నగరాన్ని ఉగ్రవాదులు, అసాంఘీక శక్తులు కన్నెత్తి చూడలేని విధంగా అత్యాధునికమయిన పోలీసింగ్ వ్యవస్థను, నగరమంతా సిసి. కెమెరాలతో కట్టుదిట్టం చేస్తానని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకు చాలా సార్లు ప్రకటించారు. ఆ ప్రయత్నంలోనే నగర పోలీసులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాలతో కూడిన ఇన్నోవా కార్లను కూడా కొని ఇచ్చారు. అయినా అసాంఘిక శక్తులు తరచూ నగరంలో ఎక్కడో అక్కడ తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నాయి. అయితే నగరంలో జరిగే ఇటువంటి ప్రతీ సంఘటనను నియత్రించడం ఎంతవారికయినా అసాధ్యం కనుక పోలీసులను నిందించడానికి ఏమీ లేదు.

 

కానీ ఈరోజు జరిగిన సంఘటన నగరంలో నిఘా వ్యవస్థ మరింత కట్టు దిట్టం కావలసిన అవసరం చాలా ఉందనే సంగతిని నొక్కి చెపుతోంది. అంతే కాదు ఇటువంటి సంఘటనలు కేవలం హైదరాబాద్ లో మాత్రమే జరుగుతుంటాయని మిగిలిన జిల్లాలు, రాష్ట్రాలు నిర్లిప్తత వహించకుండా ముందే ఇటువంటి వాటికి అవసరమయిన నివారణ చర్యలు చెప్పట్టడం మంచిది. ముఖ్యంగా కొత్తగా నిర్మించబోతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంలో, ఐటీ హబ్ గా తీర్చిదిద్దబోతున్న విశాఖలో ఇటువంటి సంఘటనలు జరగకుండా అత్యాదునికమయిన పరికరాలను పోలీసింగ్ వ్యవస్థను ముందు నుండే ఏర్పాటు చేసుకోవడం మంచిది.

By
en-us Political News

  
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కుప్పంకు దగ్గరగానే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా సంప్రదింపులు జరిపింది. ఏపీ సర్కార్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి కుప్పం ఎయిర్ పోర్టుకు అవసరమైన షరతులతో కూడిన  నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను విజయవంతంగా సాధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.