నేరస్థుడి జీవితానికి భద్రత కల్పిస్తున్నారు సరే...కానీ,

Publish Date:Dec 21, 2015

Advertisement

 

బాల నేరస్థుడి విడుదలని నిలిపివేయాలని దాఖలయిన పిటిషన్ని కొట్టివేస్తూ ఈ విషయంలో సుప్రీం కోర్టు తన అసహాయత వ్యక్తం చేసింది. “బాలనేరస్థుల చట్టప్రకారం అతనికి గరిష్టంగా మూడేళ్ళ శిక్ష విధించబడింది. మేము కూడా ప్రజాభిప్రాయంతో ఏకీభవిస్తున్నప్పటికీ అతని శిక్షను పొడిగించడానికి చట్టం అనుమతించదు. చట్టం మా చేతులని కట్టివేసింది,” అని సుప్రీం కోర్టు ధర్మాసనం చెప్పింది.

 

ఇందులో సుప్రీం కోర్టును తప్పు పట్టడానికి లేదు. బాల నేరస్థుల చట్టానికి మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన చట్ట సవరణల బిల్లును ఆమోదించడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు రాజ్యసభలో సహకరించి ఉండి ఉంటే బహుశః నేడు బాల నేరస్థుడి విషయంలో సుప్రీం కోర్టు ఈవిధంగా నిసహాయత వ్యక్తం చేయవలసిన అవసరం ఏర్పడేది కాదేమో?

 

ఈ హేయమయిన నేరానికి పాల్పడిన బాల నేరస్తుడిని ప్రజలు గుర్తుపట్టకుండా అతని మొహానికి ముసుగువేసి కోర్టుకి తీసుకువచ్చేవారు. అందుకు ఎవరూ తప్పు పట్టడం లేదు. అధికారులు అతనిని నిన్న విడుదలచేసిన తరువాత డిల్లీలో ఒక ఎన్జీఓ సంస్థకు అప్పగించారు. అప్పుడు కూడా అతనిని ప్రజలు గుర్తు పట్టకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకొన్నారు. అధికారులిచ్చిన ఒక సమాచారం ప్రకారం ఆ ఎన్జీఓ సంస్థ అతని పేరుతో సహా అతని వ్యక్తిగత వివరాలన్నీ మార్పు చేసేందుకు అనుమతించినట్లు తెలుస్తోంది. ఒకవేళ అతను రేపు బయట ప్రపంచంలోకి వెళ్ళినా ఎవరూ అతనిని గుర్తుపట్టి హాని తలపెట్టకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు తెలిపారు.

 

అతను మళ్ళీ సాధారణ జీవితం సాగించేందుకు వీలుగా బాలనేరస్థుల చట్ట ప్రకారం అతనికి రూ.10, 000 నగదు, అవసరమయిన సహాయ సహకారాలు అందించబోతున్నారు. బయట పరిస్థితుల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం అతనిని ఎన్జీఓ సంస్థలో భద్రంగా చూసుకొంటూ, అతనిని సమాజసేవా కార్యకలాపాలలో పాల్గొనేలా చేస్తూ అతనిలో మానసిక పరివర్తనకు ప్రయత్నిస్తారు. ఏదయినా వృత్తి శిక్షణలో అతను ఆసక్తి చూపినట్లయితే దానిలో అతనికి శిక్షణ ఇస్తారు. ఒకవేళ అతను తనకు అక్కడ ఉండటం ఇష్టం లేకపోయినట్లయితే తనకు నచ్చిన చోటికి వెళ్లిపోవచ్చును.

 

అత్యంత హేయమయిన నేరానికి పాల్పడిన వ్యక్తిలో మానసిక పరివర్తన తెచ్చేందుకు ప్రభుత్వం ఇన్ని జాగ్రత్తలు తీసుకొంటునప్పుడు, ఈ కేసులో భాదితురాలికి న్యాయం ఎందుకు చేయడం లేదు? ఇంకా ఎన్నేళ్ళ తరువాత న్యాయం చేస్తారు? అసలు న్యాయం జరుగుతుందా? లేక మిగిలినవారిని కూడా ఏదో ఒక రోజున వారి సత్ప్రవర్తన కారణంగా క్షమాభిక్ష పెట్టి ఇలాగే బయటకు పంపించివేస్తారా? అని ఆమె తల్లి తండ్రులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలకు మన ప్రభుత్వం, కోర్టులు, చట్టాలే జవాబు చెప్పవలసి ఉంటుంది. అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారానికి, హత్యకి గురయిన నిర్భయకు ఇంత వరకు న్యాయం చేయలేకపోయినా, ఆ నేరం చేసిన వ్యక్తి తిరిగి జన జీవన స్రవంతిలో కలిసిపోయేందుకు మన ప్రభుత్వం, చట్టాలు, న్యాయ వ్యవస్థ అన్ని జాగ్రత్తలు తీసుకోవడాన్ని ఆమె తల్లితండ్రులు, ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

 

ఈ సమాజం ఆ బాలనేరస్థుడి విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, అలాగే అతను బాల నేరస్తుల గృహంలో ఉన్నపుడు డిల్లీ హైకోర్టు బాంబు ప్రేలుళ్ళ కేసులో మరొక బాలనేరస్తుడితో స్నేహం చేసి మరింత రాటు తేలాడని తెలిసి కూడా అతనిని బయటకు విడిచిపెట్టారు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ అతని వలన సమాజానికి లేదా సమాజం వలన అతనికి ఎటువంటి ప్రమాదం జరగదని చెప్పలేము. నేడు కాకపోతే రేపయినా అతని ఉనికి బయటపడకుండా ఉండదు. అప్పుడు సమాజం అతనిపట్ల ఏవిధంగా స్పందిస్తుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అప్పుడు అతను సమాజం పట్ల ఏవిధంగా రియాక్ట్ అవుతాడో ఎవరూ ఇప్పుడు ఊహించలేరు.

 

చట్టాలకి, ప్రభుత్వాలకి, న్యాయ వ్యవస్థలకి అంత లోతుగా ఆలోచించే తీరిక లేకపోవచ్చును లేదా సాధ్యం కాకపోవచ్చును. కానీ అటువంటి విపరీత పరిణామాలు జరిగినట్లయితే దానికి ఎవరు బాధ్యులు వహిస్తారు? అతని వలన మరొక మహిళ ఇలాగే ప్రాణాలు కోల్పోయినా లేదా సమాజంలో వ్యక్తులే అతనిపై దాడి చేసినా అప్పుడు తాపీగా ఈ నిర్ణయం తప్పని అందరూ చింతించవలసి ఉంటుంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం కంటే, ముందుగానే జాగ్రత్త పడితే మంచిది కదా?

By
en-us Political News

  
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.