మతిమరుపు రావద్దంటే..రోజూ ఈ యోగాసనాలు వేయాల్సిందే! యోగాసనాలు శరీరంలోని అన్ని భాగాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహకరిస్తాయి. అదేవిధంగా యోగాసనాలు మెదడు సక్రమంగా పనిచేయడం, కణాల శ్రేయస్సు నుంచి అన్ని రకాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి అల్జీమర్స్ వ్యాధిని నివారించడంతోపాటు మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి ఏ యోగాసనాలు సహాయపడతాయో చూద్దాం. 1. పద్మాసనం: సంస్కృతంలో పద్మాసనం అంటే తామర పువ్వు అని అర్థం. అందుకే ఆసనాన్ని లోటస్ భంగిమ అంటారు. ఈ ఆసనం ఒక ధ్యాన భంగిమ, ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది. విశ్రాంతినివ్వడంతోపాటు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పద్మాసనం ఉదయం పూట చేయడం మంచిది. ఆసనం వేసే విధానం: -మీ వెన్నెముక నిటారుగా, కాళ్ళను ముందుకి చాచి చదునైన ఉపరితలంపై కూర్చోండి. -మీ కుడి పాదాన్ని వంచి, మీ ఎడమ తొడపై ఉంచండి. ఎడమ తొడపై కుడి పాదాన్ని ఉంచడానికి మీ చేతులను ఉపయోగించండి. అరికాలి పైకి ఎదురుగా ఉండాలి. మడమ పొట్టకు దగ్గరగా ఉండాలి. -అదేవిధంగా, మీ ఎడమ పాదాన్ని వంచి, మీ చేతులను ఉపయోగించి కుడి తొడపై ఉంచండి. అరికాలి పైకి ఎదురుగా ఉండాలి. మడమ పొట్టకు దగ్గరగా ఉండాలి. -గట్టిగా ఊపిరి తీసుకో. తల నిటారుగా, వెన్నెముక నిటారుగా కొన్ని నిమిషాలు ఈ స్థితిలో ఉంచండి. 2. అర్ధమత్స్యేంద్రాసన: ఈ ఆసనాన్ని ఉదయం ఖాళీ కడుపుతో చేస్తే ప్రభావవంతంగా ఉంటుంది. మీరు భోజనం తర్వాత 4 నుండి 5 గంటల తర్వాత కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు. మెదడు శక్తి కోసం ఈ యోగాసనాన్ని 30 నుంచి 60 సెకన్ల పాటు చేయవచ్చు. ఆసనం చేసే విధానం: -మీ కాళ్ళను చాచి నిటారుగా కూర్చోండి -పాదాలు వెన్నెముకతో కలిసి ఉండాలి. -ఎడమ కాలును వంచండి. ఎడమ పాదాన్ని కుడి తొడకు దగ్గరగా ఉంచండి. మోకాలిని తీసుకొని కుడి కాలును ఎడమ కాలు మీద ఉంచండి. -మీ భుజాలు, మెడ, తుంటిని కుడి వైపుకు తిప్పండి, కుడి భుజం వైపు చూడండి. -ఎడమ చేతిని కుడి మోకాలిపై,కుడి చేతిని వెనుకకు ఉంచండి. -30 నుండి 60 సెకన్ల వరకు భంగిమను పట్టుకోండి. నెమ్మదిగా, స్థిరంగా శ్వాసను తీసుకోండి. మరొక వైపు అదే ప్రయత్నించండి. 3. వజ్రాసనం: వజ్ర అనేది సంస్కృత పదం. ఈ ఆసనాన్ని డైమండ్ పోజ్ అంటారు. ఈ ఆసనం ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే ఈ ఆసనం సాధన చేయడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ,రిలాక్స్గా ఉంటుంది, మీ శరీరం 'వజ్రం'లా బలంగా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత చేసే ఆసనం ఇదే. ఆసనం చేసే విధానం -ముందుగా మోకరిల్లండి. -మీ పాదాలు మీ కాళ్ళకు అనుగుణంగా ఉండాలి, మోకాలు, చీలమండలను ఒకదానితో ఒకటి తీసుకురావాలి. కాలి బొటనవేళ్లు ఒకదానికొకటి తాకాలి. -మీరు మడమల మీద మీ బట్,తొడల మీద తొడలతో కూర్చున్నప్పుడు ఊపిరి పీల్చుకోండి. -మీరు సుఖంగా ఉండే వరకు మీ చేతులను తొడలు, తుంటిపై ఉంచండి. -మీ వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చున్నప్పుడు నెమ్మదిగా పీల్చుకోండి. ముఖాన్ని నిటారుగా ఉంచండి.
పిల్లలు కలగడం లేదా ఈ ఆసనాలు వేస్తే మంచి ఫలితం ఉంటుంది! పెళ్ళైన ప్రతి జంట తల్లిదండ్రిగా మారాలని అనుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటికాలంలో సంతానలేమి సమస్య చాలా తీవ్రంగా ఉంది. తల్లి కనాలనే అమ్మాయిల కలలు ఆలాగే ఉండిపోతున్నాయి. ప్రస్తుతకాలంలో ఉన్న జీవన శైలి, ఆహారం విషయంలో జరిగే పొరపాట్లు, మరీ ముఖ్యంగా శరీరంలో హార్మోన్ల సమస్యల కారణంగా అమ్మయిలకు గర్భం దాల్చడంలో సమస్యలు వస్తున్నాయి. అయితే కొన్ని యోగాసనాలు ఈ సమస్యను దూరం చేస్తాయి. కింద చెప్పుకునే ఆసనాలు వేయడం వల్ల అమ్మయిలలో సంతాన సామర్థ్యము పెరుగుతుంది. ఇందుకోసం వెయ్యాల్సిన ఆసనాలు ఏవంటే.. సూర్య నమస్కారం యోగాసనాలు రుతుక్రమంలో లోపాలు తగ్గించడంలో, మెనోపాజ్ సమయంలో సంభవించే సమస్యలలో సహాయపడతాయి. బహిష్టు నొప్పిని తగ్గించుకోవడానికి సూర్య నమస్కారం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. స్త్రీ గర్భాశయంపై, పిల్లల పుట్టుకపై నెలసరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నెలసరి విషయంలో సమస్యలు లేకుంటే గర్భం దాల్చడంలో సమస్యలు తక్కువే ఉంటాయి. సూర్య నమస్కారం లైంగిక గ్రంధులను క్షీణించే సమస్య నుండి దూరంగా ఉంచుతుంది. ఇందువల్ల గర్భం దాల్చడంలో సహాయపడుతుంది. బద్ద కోణాసనం బద్ద కోనాసనను సీతాకోకచిలుక భంగిమ అంటారు. ఈ ఆసనం లోపలి తొడలు, తుంటి ప్రాంతం మరియు మోకాళ్ల కండరాలను ప్రభావితం చేస్తుంది. శరీరం దృఢంగా మారడంతో సహాయం చేస్తుంది.. బద్ధ కోనాసనం వేయడం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుంది. ప్రసవ సమయంలో నొప్పిని తగ్గించడంలో కూడా ఈ ఆసనం ప్రభావవంతంగా ఉంటుంది. పశ్చిమోత్తనాసనం పశ్చిమోత్తనాసనం కండరాలను సాగదీస్తుంది.ఈ ఆసనం సాధన చేయడం వల్ల సంతానోత్పత్తి మెరుగుపడుతుంది మరియు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. బాలసనా సంతానోత్పత్తి సమస్య నుండి బయటపడటానికి, బాలసనాను మంచి మార్గం. ఈ యోగాసనం రక్త ప్రసరణను పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది కాకుండా, ఈ ఆసనం ద్వారా వెనుక, మోకాళ్లు, తుంటి మరియు తొడల కండరాలు సాగుతాయి. ఈ ఆసనాలు వేస్తే గర్భం దాల్చే విషయంలో ఇబ్బందులు పడే మహిళలకు తొందరలోనే మంచి ఫలితాలు ఉంటాయి. ◆నిశ్శబ్ద.
అమ్మాయిల ముఖచర్మం మెరిసిపోవాలంటే.. ఈ మూడు ఆసనాలు వేస్తే సరి! అందంకోసం తపించని అమ్మాంటూ ఉండదు. బ్యూటీ టిప్స్ కావచ్చు, బ్యూటీ క్రీములు కావచ్చు, ఏదైనా బ్యూటీ థెరపీ కావ్చచు.. అందంగా మెరిసే చర్మంతో కనిపిస్తామంటే ఏం చెయ్యడానికైనా సిద్దపడతారు. అమ్మాయిల ముఖ చర్మం ఎలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్, ఏ విధమైన క్రీములు రాకుండానే మెరిసిపోవాలంటే ఈ కింది ఆసనాలు వెయ్యాల్సిందే.. వీటిని వేస్తే రక్తం శుద్ది అయ్యి చర్మం కాంతివంతంగా మారుతుంది. సర్వాంగాసనం.. సర్వాంగాసనం వేస్తే భుజాలు, వెనుక భాగాలు బలంగా మారుతాయి. దీన్నెలా వేయాలంటే.. మొదట శవాసనం స్థితిలో పడుకోవాలి. ఇప్పుడు కాళ్లు రెండూ దగ్గరగా ఉంచుకుని మెల్లిగా పైకి లేపాలి. క్రమంగా తొడలు, పిరుదులు పైకి లేపుతూ వెన్నెముకను పైకి లేపి దానికి సపోర్ట్ గా చేతులతో నడుమును పట్టుకోవాలి. మోచేతులను నేలకు ఆనించి నడుముకు మద్దతు ఇవ్వాలి. ఈ ఆసనంలో మెడ మీద ఒత్తిడి పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇది వేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. ముఖచర్మానికి ప్రసరణ బాగుండటం వల్ల చర్మం కాంతివంతం అవుతుంది. హలాసనం.. హలాసనం చేయడం వల్ల శరీరం బాగా రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. దీన్నెలా చేయాలంటే.. మొదట శవాసనం స్థితిలో పడుకోవాలి. ఇప్పుడు అరచేతులను నేలకు ఆనేలా ఉంచాలి. నెమ్మదిగా కాళ్లను లేపి 90డిగ్రీలు అంటే లంబకోణంలోకి తీసుకురావాలి. ఇప్పుడు మీ శరీరం ఎల్ అక్షరం షేపులో ఉంటుంది. లంబకోణంలో ఉన్న కాళ్లను మెల్లిగా వెనక్కు జరుపుతూ కాలి పాదాల వేళ్ళను నేలకు తలిగేలా వంచాలి. ఈ స్థితిలో కాళ్లు రెండూ ఒక్కిటిగా, నిటారుగా ఉంచాలి. నాలుగైదు సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుని తిరిగి సాధారణ స్థితికి రావాలి. ఈ ఆసనం వల్ల రక్తప్రసరణ బాగుంటుంది. ఛాతీ, ముఖానికి రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. త్రికోణాసనం.. త్రికోణాసనం వేస్తే ముఖ చర్మం కాంతివంతమవడమే కాదు ఛాతీ, భుజాలు, కాళ్లు రిలాక్స్ అవుతాయి. చేతులు, కాళ్లు, తొడలు దృఢంగా మారుతాయి. దీన్నెలా వేయాలంటే.. మొదటగా కాళ్లను దూరంగా ఉంచి నిలబడాలి. ఇలా నిలబడిన తరువాత కుడి కాలును 90డిగ్రీలు, ఎడమ కాలును 15డిగ్రీలు తిప్పాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ రిలాక్స్ అవ్వాలి. శరీరాన్ని కుడివైపుకు వంచాలి. ఇలా వంచినప్పుడు నడుమును నిటారుగా ఉంచాలి. ఎడమ చేతిని పైకెత్తి ఆకాశం వైపుకు సూటిగా ఉంచాలి. కుడిచేతిని కిందకు ఉంచి గట్టిగా శ్వాస తీసుకోవాలి. ఇదే విధంగా మరొక వైపు కూడా చేయాలి. ఈ మూడు ఆసనాలు వేస్తే ముఖానికి రక్తం సరఫరా మెరుగుపడి ముఖం చర్మం కాంతివంతమవుతుంది. చర్మ సమస్యలు ఏమైనా ఉన్నా తగ్గుతాయి. *నిశ్శబ్ద.
Benefits Of Shavasana ఆసనాల్లో మకుటాయమానం - శవాసనం * యోగ సాధనలో శవాసనం (savasana)ఎంతో ముఖ్యమైంది. శవాసనాన్ని "మృతాసన" అని కూడా పిలుస్తారు. సంస్కృతంలో శవం అంటే మృతదేహం అని అర్థం. మృతి చెందినప్పుడు ఎలా పడుకోబెడతామో శవాసనం లోనూ అలా పడుకుంటారు. ఇతర యోగాసనాలన్నింటి కంటే ఇది చాలా తేలికైన ఆసనం. అయితే దీనిపైన పూర్తి పట్టు సాధించడం కష్టమే. యోగాసనాలకు మధ్యలోగాని, అన్ని ఆసనాలు పూర్తయ్యాక శరీరం, మనస్సు విశ్రాంతిని, ప్రశాంతతను పొందడానికి ఈ ఆసనం అద్భుతమైంది. * ఉదయం యోగాసనాలతో పాటు మాత్రమే కాదు, రాత్రిపూట పడుకోబోయే ముందు కూడా శవాసనం వేయవచ్చు, అలా చేయడం వలన మనస్సు, శరీరం పూర్తి విశ్రాంతి పొందుతాయి. మనస్సు .శాంతంగా వుంటుంది. ఈ ఆసన సమయంలో శరీరం అంతటా ప్రాణశక్తి తిరుగుతూ వున్నట్టుగా అనిపించడం ఈ ఆసనం యొక్క ప్రత్యేకత. శవాసనం వలన పూర్తి విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి. ఇది చాలా సహజ సిద్ధమైంది కనుక మనస్సును, శరీరాన్ని విశ్రాంతి స్థితిలోకి తీసుకు వెళుతుంది. శరీరానికీ మనస్సుకూ విశ్రాంతి అవసరమైన సమయంలో శవాసనం ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. మంద్ర స్థాయిలో శ్లోకాలు లేదా మనస్సుకు హాయిని గొలిపే పాటలు లేదా మాటలు వింటూ ఈ ఆసనం ఆచరిస్తే ధ్యానస్థితిని చేరుకుంటాము. శవాసనం చేసే పద్ధతిః * నేలపై తివాచీ లేదా పరిచి, వెల్లకిలా పడుకోవాలి. కాళ్ళు రెండూ ఒకటి లేదా రెండు అడుగులు వెడల్పు చేయాలి. బొటనవేళ్ళు (toes) రెండు బైటకు చూస్తున్నట్లు వుండాలి. మడమలు రెండు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా వుండాలి. మనకు విశ్రాంతిగా హాయిగా వుంటుందనుకున్నంతవరకు కాళ్ళను పెట్టవలసిన వెడల్పును నిర్ణయించుకోవచ్చు. * రెండు చేతులూ (hands) శరీరానికి కొంచెం దూరంగా అరచేతులు పైకి కనిపించేలా వుంచాలి. * ఏవైపుకు వుంచితే హాయిగా వుంటుందో ఆ వైపుకి మెడను (neck) తిప్పి వుంచాలి. * కళ్ళు మూసుకుని, దృష్టిని శరీరంపై కేంద్రీకరించి మామూలుగా శ్వాస (breathe) తీసుకోవాలి. * విశ్రాంతి స్థితి వైపే మనస్సు కేంద్రీకరించి, శ్వాస మామూలుగా తీసుకోవాలి.శరీరాన్ని విశ్రాంతిగా వుంచాలి. * మహిళలకు ప్రత్యేక ప్రయోజనాలుః మహిళలకు రుతుస్రావం సమయంలో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో మహిళలు ఉద్రేకంగా, వేదనగా, కోపంగా చికాకుగా, దిగులుగా ఆందోళనగా అలిపిపోయినట్లుగా లేదా మానసిక ఒత్తిడికి లోనైనట్టుగా వున్నపుడు శవాసనం ఎంతో ఉపయోగకారిగా వుంటుంది. శరీర కండరాలకు గాఢంగా విశ్రాంతి, మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. * కండరాలు పూర్తి విశ్రాంతిని పొంది, ఆందోళనలు, చికాకుల నుంచి పూర్తి ఉపశమనం కల్పిస్తుంది. దృష్టిని మనస్సు పైన కూడ కేంద్రీకరించడం వలన మెదడు బాగా విశ్రమిస్తుంది. వీపు వెనుక దిగువ భాగాన లేదా పొత్తికదుపు నొప్పి వున్నా శవాసనం ఉపశమనం కల్పిస్తుంది. * అలసటకు, ఒత్తిడికి గురైన భాగాలపై మనస్సు కేంద్రీకరించడం, ఆయా భాగాలకు విశ్రాంతిని కలిగించవచ్చు. నొప్పుల నుంచి ఉపశమనం వుంటుంది. ప్రెగ్నెంట్ గా వున్న సమయంలో పగటి పూట ఎప్పుడైనా అలసట అనిపించినప్పుడు లేదా ఆందోళనగా వున్నప్పుడు శవాసనం వేయవచ్చు. సాధారణ ప్రయోజనాలు * తలనొప్పి, తలతిరగడం, మానసిక నీరసం, చికాకు, తుంటి నరం నొప్పిలాంటి వాటి నుంచి ఉపశమనం. * శరీరం మనస్సు పూర్తి విశ్రాంతి పొందుతాయి. శరీర భాగాలన్నింటికీ ఈ అనుభూతి తెలుస్తుంది. * మనస్సు కేంద్రీకరణ స్థాయి పెరుగుతుంది. * బాగా వ్యాయామం చేసి అలిసి పోయాక కండరాలకు విశ్రాంతి అవసరం. ఈ ఆసనం వేస్తే కండరాలకు పూర్తి విశ్రాంతి లభించి, ప్రశాంతత ఏర్పడుతుంది. * శరీరంలోని అన్ని అవయవాలు నిర్వహించే పనులకు ఆక్సిజన్ అవసరం. ఇది రక్తం ద్వారా లభిస్తుంది. ఎక్కువ ఆక్సిజన్ అవసరమైతే రక్త ప్రసరణ కూడా అధికం అవుతుంది. ఈ ఆసనం వల్ల రక్తనాళాలు పూర్తిగా విశ్రాంతి పొందుతాయి. అప్పుడు శ్వాస తీసుకోవడం పెరుగుతుంది. శవాసనం వేసినట్లయితే ఈ మొత్తం ప్రక్రియ నెమ్మదిస్తుంది. అన్ని శరీర భాగాల కార్య కలాపాలు నెమ్మదిగా జరుగుతాయి. * ఈ ఆసనాన్ని ఆచరించినట్లయితే అంతరంగిక కార్య కలాపాలన్నీ తగ్గిపోయి, శ్వాస తీవ్రత తగ్గుతుంది. అప్పుడు మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. అప్పుడు తిరిగి ఈ ప్రక్రియ అంతా నెమ్మదిగా కొత్తగా ప్రారంభమవుతుంది. * దీర్ఘకాలంగా, తీవ్రంగా జబ్బున పడిన వ్యక్తుల శరీరం మనస్సు తిరుగి కోలుకుంటుంది. * శవాసనం మనిషిని బాగా ఉత్సాహపరుస్తుంది. మళ్ళీ తాజాగా శరీరం తయారై పని చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది. * నిద్రలేమి, అధిక లేదా తక్కువ రక్తపోటు, అజీర్తి లాంటి సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుంది.రక్త ప్రసరణ తిరిగి మామూలు స్థితికి వస్తుంది. * హృదయ సంబంధనైన వ్యాధులు, మానసిక వత్తిళ్ళు, అలసట, స్వల్ప దిగులు వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. * క్రమం తప్పకుండా ఈ ఆసనం వేసినట్లయితే కోపం అదుపులో వుంటుంది. * చికాకు పరిచే ఆలోచనలు ఉద్రిక్తతల నుంచి ఉపశమనం కలిగి, మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
Globalization and Yoga Today yoga caters to a cadre of practitioners spanning continents and investigation tens of zillions of adherents. In this two-part playoff, we present address the globalization of hatha yoga with fact connection to Collection and implications of yoga training for musculoskeletal upbeat in antithetic cultures/ethnicities. Bodoni postural yoga started as a fusion of Indweller athletics and elite hatha yoga principles in the old twentieth century, posits Symbol Singleton. Around this minute, yoga was exported to the US from Bharat by Vivekananda and others, experiencing various waves of popularity before incoming at its live omnipresence. As yoga has exponentially grown in the region, it's been re-exported to India igniting a nationalistic fervor, despite umpteen fashionable forms existence inextricably infused with feature cultural norms. "Yoga went to Crockery via America," according to one of B.K.S. Ingra’s superior disciples, Faeq Biria, who routinely trains students in Peking. "They see it from an Denizen repair of scope. At prime, they're attracted by the byproducts: to be pretty, to shorten asymptomatic, quietus symptomless, person a fastidious embody, be agile, short. It's marmoreal human, "yoga is a symbolization of the extracurricular mankind. Suchlike ribbon women on the beach." As in the US, yoga fits fit there with the desire for success. Yet Religion tai chi is entitled, soothing, and rhythmic to alleviate a deeper union to chi; most modernistic yoga conjures images of pretzels, headstands, and additional sport, reminiscent of the competitive environs in which it's marinated. Thus, in a mansion of the times, "hip Hong Kongers would rather ware $35 on a hemorrhage family than course with their grannies." Arguably, modernistic postural yoga, as were its initial iterations, is an evolution reflecting statesman of the modern social discourse than anything ancient and imperishable. Yet piece the version and thought of yoga may possess denaturized, umpteen of the gymnastics, Asian poet discipline, and exercise?
సింపుల్ గా బరువు తగ్గడానికి భలే ఆసనం ఇది..! బరువు తగ్గడానికి చాలామంది అష్టకష్టాలు పడుతుంటారు. వెయిల్ లాస్ అవుతున్నవారిని చూసి బాబోయ్.. వీళ్లు ఇంతలా బరువు ఎలా తగ్గుతున్నారు అని ఆశ్చర్యపోతుంటారు. అయితే బరువు తగ్గడం అనేది కేవలం రోజులు, వారాలలో జరిగేది కాదు. దీనికి ఆహారం నుండి శారీరక శ్రమ వరకు ప్రతీది ముఖ్యమే. ఇకపోతే జిమ్ లో కసరత్తులు చేయడం కన్నా.. మన భారతీయ ఆయుర్వేద ఋషులు ప్రసాదించిన యోగా బరువు తగ్గడానికి ఎంతో మిన్న. యోగాలో ఉన్న ఎన్నో ఆసనాలు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. క్రమం తప్పకుండా ఈ ఆసనాలు వేయడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. అలాంటి ఆసనాలలో తాడాసనం కూడా ఒకటి. తాడాసనం ప్రతిరోజూ వేస్తే సింపుల్ గా బరువు తగ్గేయచ్చట. ఈ ఆసనం ఎలా వెయ్యాలో తెలుసుకుంటే.. తాడాసనం అనేది ముఖ్యంగా సంస్కృత పదం. సంస్కృతంలో తడ అంటే పర్వతం. ఆసనం అంటే భంగిమ లోదా పోజ్. దృఢమైన పర్వతంలా ఈ ఆసనం భంగిమ ఉండటంతో దీన్ని తాడాసనం అని అంటున్నారు. తాడాసనం ఎలా వేయాలంటే.. తాడాసనం వేయడం చాలా సింపుల్. మొదట రెండు పాదాలను దగ్గరగా ఉంచి నిటారుగా నిలబడాలి. ఇప్పడు రెండుచేతులను తలకంటే పైకి తీసుకెళ్లాలి. తరువాత రెండు చేతివైళ్లను ఒకదాని మధ్యన ఒకటి ఉంచి చేతులను కలిపి ఉంచాలి. ఇలా కలిపిన రెండు చేతులను ముందుకు తిప్పి చేతులను పైకి ఆకాశం వైపు చూపించాలి. ఇలా చేసినప్పుడు చేతులను వీలైనంత పైకి సాగదీయాలి. ఈ సమయంలో దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇదే సమయంలో నిలబడుకున్నవారు కాస్తా పాదాల మునివేళ్ల మీద నిలబడాలి. ఈ భంగిమలో 20 నుండి 30 సెకెన్లు లేదా వీలైనంత సమయం ఈ భంగిమలో ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా శ్వాస వదులుతూ సాధారణ స్థితికి రావాలి. తాడాసనాన్ని కనీసం 10సార్లు అయినా వెయ్యాలి. ఇలా వేయడం వల్ల శరీరాకృతి మంచిగా తయారవుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇంతేకాదు.. తాడాసనం వేయడం వల్ల ఇంకా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. శరీరాకృతి.. తాడాసనం వేయడం వల్ల శరీరాకృతి మెరుగవుతుంది. చాలామందికి కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు భుజాలు కిందికి వాలిపోయినట్టు అవుతుంటాయి. దీన్ని పెద్దలు గూని అని అంటూంటారు. ఈ గూని సమస్యను తాడాసనం వేయడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. అదే విధంగా వెన్ను నొప్పి సమస్య కూడా తగ్గుతుంది. పిల్లలు ఎత్తు పెరుగుతారు.. చిన్న పిల్లలతో తాడాసనం వేయించడం వల్ల ఎత్తు బాగా పెరుగుతారు. శరీరం సాగదీయడం వల్ల ఎత్తు పెరగడానికి సహాయపడే గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి బాగుంటుంది. ఎదిగే వయసులో పిల్లలు ఈ ఆసనం వేసేలా చూడాలి. మానసిక ఆరోగ్యం.. మహిళలలో మానసిక సమస్యలు సాధారణంగానే ఎక్కువ. దీనికి కారణం హార్మోన్ అసమతుల్యత, నెలసరి సమస్యలు, గర్భధారణం, ప్రసవం, మెనోపాజ్ వంటివి. వీటి వల్ల ఎదురయ్యే మానసిక సమస్యలు తాడాసనం వేయడం వల్ల కంట్రోల్ లో ఉంటాయి. దీన్ని రోజూ ఆచరిస్తుంటే నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. శ్వాసక్రియ.. తాడాసనం వేయడం వల్ల శ్వాస క్రియ బాగుంటుంది. శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఊపిరితిత్తులు బలంగా అవుతాయి. దీర్ఘంగా ఊపిరితీసుకోవడానికి ఈ ఆసనం సహాయపడుతుంది. బరువు.. అన్నింటికంటే ముఖ్యంగా బరువు తగ్గడంలో తాడాసనం బాగా సహాయపడుతుంది. రోజూ తాడాసనాన్ని కనీసం 10సార్లు అయినా ప్రాక్టీస్ చేస్తుంటే శరీరంలో కేలరీలు సులువుగా బర్న్ అవుతాయి. ఇది శరీరం మొత్తాన్ని దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. *నిశ్శబ్ద.
మలాసనంతో మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు సొంతం! భారతీయ మహర్షులు ముందుతరాలకు అందించిన గొప్ప సంపద యోగ అని చెప్పవచ్చు. ఈ యోగాలో బోలెడు ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలలో ఒక్కోదానికి ఒక్కో విధమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇప్పుడంటే ఎక్కడ చూసినా వెస్ట్రన్ టాయ్లెట్ లు వచ్చాయి. కానీ అంతకుముందు ప్రతి ఇంట్లో మలవిసర్జన మోకాళ్ల మీద కూర్చున్న భంగిమలోనే ఉండేది. ఇలా మోకాళ్లు మడిచి మలవిసర్జనకు వెళ్లడం వల్ల కడుపు కండరాల మీద ఒత్తిడి పడి మల విసర్జన సాఫీగా జరుగుతుందని ఆయుర్వేదం కూడా చెబుతుంది. అయితే ఈ ఇలా మల విసర్జనకు వెళ్లే భంగిమలో కూర్చోవడాన్ని మలాసనం అని పేర్కొంటున్నారు. మలాసనం వేయడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా మలాసనాన్ని గర్భవతులు కూడా వేయడం వల్ల గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. గర్భిణులు, జీర్ణ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు, కడుపునొప్పితో ఇబ్బంది పడేవారు కూడా మలాసనం వేయడం వల్ల ఆశించిన ఫలితాలు పొందుతారు. మలాసనం వేస్తే జీర్ణసంబంధ సమస్యలు తొలగిపోతాయి. జీర్ణవ్యవస్థ పూర్తీగా ఆరోగ్యంగా మారుతుంది. ఈ ఆసనంలో కూర్చున్నప్పుడు పేగుల మీద ఒత్తిడి కలిగి పేగుల కదలిక ఆరోగ్యంగా మారుతుంది. పేగు కదలికలు బాగుంటే ఆహారం కూడా సులభంగా జీర్ణం అవుతుంది. మలాసనం వేయడం వల్ల నడుము దృఢంగా మారుతుంది. దీన్ని క్రమం తప్పకుండా సాధన చెయ్యాలి. నడుము కండరాలు బాగా గట్టిపడతాయి. నడుము నొప్పి ఉంటే క్రమంగా తగ్గుతుంది. ఇప్పట్లో చాలామంది మహిళలు పీసీఓయస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే మలాసనం వేయడం వల్ల ఈ పీసీఓయస్ సమస్య తగ్గుతుంది. పీసీఓయస్ కారణంగా మహిళలలో సంతానోత్పత్తి కూడా తగ్గుతుంది. కాబట్టి మహిళలు మలాసనం వేస్తుంటే ఈ సమస్యలు ఉండవు. మహిళలలో నడుము, నడుము కింద భాగాలు బలహీనంగా ఉంటాయి. ఇవి నెలసరి వల్ల కావచ్చు, ప్రసవాలు, ఆపరేషన్లు, అబార్షన్లు ఇలా చాలా కారణాలు కావచ్చు. కానీ వీటన్నింటికి మలాసనం చెక్ పెడుతుంది. నడుమును, నడుము కింది భాగాలను బలంగా మారుస్తుంది. మహిళలలో యోని ప్రాంతం ఆరోగ్యంగా ఉండటానికి మలాసనం సహాయపడుతుంది. యోని కండరాలు దృఢంగా మారతాయి. నెలసరిలో ఇబ్బందులు, లైంగిక సమస్యలు తగ్గుతాయి. మానసిక సమస్యలున్నవారికి కూడా మలాసనం గొప్ప ఊరట. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. *నిశ్శబ్ద.
పీరియడ్స్ నొప్పి తగ్గాలంటే ఈ ఆసనాలు వేయండి! ఆడవారికి నెలసరి అనేది సాధారణం. ఒక వయసులో ఋతుచక్రం మొదలయ్యాక ప్రతి నెలా ఈ సమస్యను ఎదుర్కోవాల్సింది. ఇది ఒక నెలతోనో, ఒక ఏడాదితోనో ముగిసేది కాదు. కొందరికి నెలసరి సమయంలో ఎలాంటి నొప్పి ఉండదు. మరికొందరిలో మాత్రం తీవ్రమైన రక్తస్రావం, కడుపు నొప్పి, కండరాల తిమ్మిర్లు ఉంటాయి. ఇలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి యోగాలో కొన్ని ఆసనాలు సహాయపడతాయి. ఆ ఆసనాలేంటో తెలుసుకుంటే.. బలాసనం.. బలాసనం వేయడం చాలా సులువు. మోకాళ్లమీద పాదాలకు పిరుదులు తగిలేలా కూర్చోవాలి. దీన్ని వజ్రాసనం అని అంటారు. ఇప్పుడు ముందుకు వంగి తలను నేలకు ఆనించాలి. చేతులు రెండూ పొడవుగా చాపాలి. ఈ స్థితిలో 10నిమిషాల సేపు ఉండవచ్చు. ఇది పీరియడ్స్ నొప్పిని తగ్గించడమే కాకుండా జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. మానసిక సమస్యలు, జీర్ణసమస్యలుంటే తగ్గుతాయి. నాడీవ్యవస్థ చురుగ్గా మారుతుంది. పశ్చిమోత్తానాసనం.. వెన్నెముకను వంచి చేసే ఆసనం కాబట్టి దీన్ని పశ్చిమోత్తనాసనం అని అంటారు. పద్మాసనంలో కూర్చుని పాదాలను ముందుకు చాపాలి. ఇప్పుడు తలను కిందకు వంచి మోకాళ్లకు తల తగిలేలా వంగాలి. ఈ ప్రయత్నంలో రెండు చేతులను ముందుకు చాపి పాదాలను అందుకోవాలి. మొదట్లో ఇది ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటైపోతుంది. ఈ ఆసనం వెన్నెముకను బలపరుస్తుంది. నెలసరి సమయంలో కలిగే కడుపునొప్పి, కండరాల తిమ్మిర్లు తగ్గిస్తుంది. మనసుకు ప్రశాంతత ఇస్తుంది. అలసటను తగ్గిస్తుంది. సీతాకోక చిలుక భంగిమ.. సీతాకోక చిలుక ఎగురుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉండటం వల్ల దీన్ని సీతాకోక చిలుక భంగిమ అని అంటారు. పద్మాసనంలో కూర్చోవాలి. రెండు కాళ్లను ఎడంగా చేసి రెండు పాదాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంచాలి. ఇప్పుడు చేత్తో రెండు పాదాలను పట్టుకుని మోకాళ్లను సీతాకోక రెక్కల్లా ఆడించాలి. దీని వల్ల యోని కండరాలు బలపడతాయి. యోని సమస్యలు పరిష్కారం అవుతాయి. నెలసరి సమయంలో కడుపునొప్పి నుండి ఉపశనం లభిస్తుంది. శవాసనం.. శవాసనం సాధారణంగా యోగా లేదా వ్యాయామాలు చేసిన తరువాత శరీరం విశ్రాంతి తీసుకోవడానికి వేస్తారు. అయితే మహిళలు తమ నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడుతుంటే శరీరాన్ని రాలాక్స్ గా వదులుగా ఉంచి శవాసనం భంగిమలో ఉండాలి. కాళ్లు, చేతులు, శరీరంలో కండరాలు వదులుగా ఉండటం వల్ల శరీరం తేలికగా అనిపిస్తుంది. ఇది కడుపునొప్పిని తగ్గిస్తుంది. *నిశ్ళబ్గ.
సీతాకోకచిలుక ఆసనం.. మహిళల చింతలన్నీ మాయం! యోగాలో ఆసనాలు బోలెడు. ఈ ఆసనాలు కూడా మహిళలకంటూ కొన్ని ప్రత్యేకంగా పేర్కొనబడ్డాయి. వీటిని వేయడం వల్ల మహిళ అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. మహిళలకు పెళ్లి, ప్రసవం, ఆ తరువాత మెనోపాజ్ వంటి కారణాల వల్ల శరీరంలో చాలా అసౌకర్యాలు ఏర్పడతాయి. వాటిలో కొన్నింటికి సీతాకోక చిలుక ఆసనం ఎంతగానో సహాయపడుతుంది. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుంటే.. వెన్నునొప్పి.. చాలామంది మహిళలు వెన్ను నొప్పి సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు. అయితే దీనికి సీతాకోకచిలుక ఆసనం చక్కని పరిష్కారం. ప్రతిరోజూ సీతాకోకచిలుక ఆసనం ఫాలో కావడం వల్ల వెన్ను నొప్పి ఈజీగా తగ్గుతుంది. మానసిక ఒత్తిడి, తలనొప్పి.. మానసిక ఒత్తిడి, తలనొప్పి మహిళల జీవితంలో ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం వారు అనారోగ్య సమస్యలు లెక్క చేయకుండా ఇంటి పనులలోనూ, భర్త పిల్లలను చూసుకోవడంలోనూ మునిగిపోతారు. శారీరక సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవి కాస్తా మానసిక సమస్యలుగా రూపాంతరం చెందుతాయి. పదే పదే తలనొప్పి కూడా వస్తుంది. అదే సీతాకోకచిలుక ఆసనం వేస్తే ఇవి తగ్గిపోతాయి. నడుమునొప్పి.. ప్రసవం తరువాత, నెలసరి సమస్యలున్న మహిళలు చాలావరకు నడుము నొప్పితో ఇబ్బందులు పడుతుంటారు. సీతాకోకచిలుక ఆసనం ఈ నడుమునొప్పికి చక్కని పరిష్కారంగా నిలుస్తుంది. దీన్ని రెగ్యులర్ గా చేస్తే నడుమునొప్పి సమస్య తగ్గిపోతుంది. బలం.. చాలామందికి హిప్స్ బలహీనంగా ఉంటాయి. మరికొందరికి హిప్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. హిప్ ప్యాట్ ఎక్కువగా ఉంటే శరీరం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. సీతాకోకచిలుక ఆసనం వేస్తే హిప్స్ కు బలం చేకూరడంతో పాటు హిప్స్ ఫ్యాట్ తగ్గి మంచి ఆకృతిలోకి వస్తాయి. సీతాకోకచిలుక ఆసనం.. యోగా మ్యాట్ లేదా దుప్పటి పరుచుకుని దాని మీద పద్మాసనంలో కూర్చోవాలి. కాళ్లు రెండూ పొడవుగా చాపి కాళ్లు దగ్గరగా చేసి కూర్చోవాలి. ఇప్పుడు మోకాళ్లను మడుస్తూ కాలి పాదాలు రెండూ ముందుకి తీసుకురావాలి. రెండు కాళ్ల పాదాలు ఎదురెదురుగా కలుసుకుని ఉండాలి. ఈ పొజిషన్ లో అలాగే ఉండి రెండు పాదాలను చేతులతో పట్టుకుని తొడల నుండి మోకాళ్లను పైకి కిందకు లేపుతూ సీతాకోకచిలుక రెక్కలు ఆడించినట్టు ఆడించాలి. ఈ ఆసనాన్ని రోజూ చేస్తుంటే పైన చెప్పుకున్న ప్రయోజనాలన్నీ ఉంటాయి. *నిశ్శబ్ద.
హలాసనంతో భలే లాభాలు.! యోగాతో శరీరం చాలా ఫిట్ గా మారుతుంది. చాలామంది జిమ్ లో కసరత్తులు చేస్తారు, బరువులు ఎత్తుతారు, డైట్ ఫాలో అవుతారు. చాలా కష్టపడతారు. కానీ ఇవన్నీ ఇచ్చే ఫలితాలు యోగా చేస్తే లభిస్తాయి. యోగాలో ఆసనాలు, ధ్యానం, శ్వాసవ్యాయామాలు ఇలా అన్ని ఉంటాయి. ఒక్కో ఆసనం వల్ల ఒక్కో ఫలితం ఉంటుంది. యోగాలో ఉన్న ఆసనాలలో హలాసనం కూడా ఒకటి. హలము అంటే నాగలి. పొలాన్ని దున్నే నాగలి భంగిమలో ఉండటం వల్ల దీన్ని హలాసనం అని అంటారు. మహిళలు హలాసనం వేస్తే బోలెడు లాభాలుంటాయి. ఈ ఆసనాన్ని ఎలా వెయ్యాలో.. దీని వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుంటే.. హలాసనం వేసే విధానం.. హలాసనాన్ని ఖాళీ కడుపుతో మాత్రమే వెయ్యాలి. మొదట ప్రశాంతమైన ప్రదేశంలో దుప్పటి లేదా యోగా మ్యాట్ వేసుకోవాలి. యోగా మ్యాట్ మీద వెల్లికిలా పడుకోవాలి. ఇలా పడుకున్నప్పుడు కాళ్లు రెండూ పక్కపక్కనే ఆనుకుని ఉండాలి. చేతులు నడుముకు రెండు వైపులా అరచేతులు నేలకు తాకుతూ చాపుకుని ఉండాలి. శరీరాన్ని బిగించినట్టు కాకుండా వదులుగా రిలాక్స్ గా పడుకోవాలి. రిలాక్స్ గా పడుకున్నప్పుడు కాళ్లను నిటారుగా పైకి లేపి లంబకోణంలోకి తీసుకునిరావాలి. ఇప్పుడు కాళ్ల పాదాలు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉంటాయి. కాళ్లు ఇలా లంబకోణంలోకి తెచ్చినప్పుడు ఊపిరి పీల్చుకోవాలి. ఇప్పుడు పాదాలను క్రమంగా వెనక్కు వంచుతూ పాదాలను తల వెనుకకు తీసుకెళ్ళాలి. అయితే ఈ ఆసనం వేసేటప్పుడు మోకాళ్లు వంచకూడదు. హలాసనం వల్ల కలిగే లాభాల.. హలాసనం శరీరాన్ని, మనస్సునూ ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ ఆసనం వేస్తే వెన్నెముక, భుజాలు బాగా బెండ్ అవుతాయి. ఈ కారణంగా వెన్ను నొప్పి, భుజాలనొప్పి వంటి సమస్యలున్న వారికి ఇది మంచి ఉపశమనం ఇస్తుంది. చాలామంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. థైరాయిడ్ పనితీరు దెబ్బతింటే శరీరంలో చాలా సమస్యలు ఏర్పడతాయి. అయితే హలాసనం వేయడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా మారుతుంది. ఒత్తిడి, అలసట వంటి సమస్యలు ఉంటే కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పోలేరు. కానీ హలాసనం వేస్తే ఒత్తిడి, అలసట దూరమై మంచి నిద్ర సొంతమవుతుంది. హలాసనం వేసే క్రమంలో పొత్తి కడుపు కండరాలు బాగా పనిచేస్తాయి. ఈ కారణంగా పొత్తికడుపు కండరాలు బలంగా మారుతాయి. గ్యాస్, ఎసిడిటీ సమస్యలుంటే అవి తగ్గుతాయి. శరీరంలో కండరాలన్నీ ఈ ఆసనం వేసేటప్పుడు పనిచేస్తాయి. ఈ కారణంగా శరీర కండరాల సామర్థ్యం పెరుగుతుంది. బరువును కూడా తగ్గిస్తుంది. చెడు కొలెన్ట్రాల్ తగ్గుతుంది. హలాసనం వేయడం వల్ల మానసిక ఒత్తిడి, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె సంబంధ సమస్యలు దరిచేరవు. *నిశ్శబ్ద.
యోగాతో హెర్నియేటెడ్ డిస్క్ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చంటే.. మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్య వెన్నునొప్పి. వెన్ను నొప్పితో బాధపడే చాలామంది మూవ్ లేదా పెయిన్ కిల్లర్ వేసుకుని ఉపశమనం పొందుతుంటారు. అయితే ఈ వెన్ను నొప్పి సాధారణమైనది కాకపోవచ్చు. హెర్నియేటెడ్ డిస్క్ సమస్య కావచ్చు. వెన్నుపూస మధ్య ఉన్న డిస్క్లు విడిపోయినప్పుడు, డిస్క్ లోపలి భాగం పొడుచుకు వచ్చినప్పుడు ఇది సంభవిస్తుంది. ఇది పక్కనే ఉన్న నరాలను ఒత్తిడికి గురి చేస్తుంది. సరళంగా చెప్పాలంటే, ఇంటర్వర్టెబ్రల్ డిస్క్లు కుదించబడి, బయటికి ఉబ్బడం ప్రారంభించినప్పుడు లేదా కొన్ని సందర్భాల్లో చీలిక ఏర్పడినప్పుడు హెర్నియేటెడ్ డిస్క్ సమస్య వస్తుంది. ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు, కాళ్ళు, వీపు రెండూ ప్రభావితమవుతాయి. ఈ నొప్పి కదలికల ద్వారా తీవ్రమవుతుంది. హెర్నియేటెడ్ డిస్క్ ప్రధాన కారణాలు : వయస్సు, ధరించే దుస్తులు , కుంగిపోవడం కూడా వెన్నెముక క్షీణించడానికి కారణమవుతుంది. ప్రమాదాలు జగినప్పుడు వెన్నుభాగంలో గాయాలు కావడం ఈ సమస్యకు కారణం అవుతుంది. క్రీడలకు సంబంధించిన గాయాలు ప్రభావం చూపిస్తాయి. నిశ్చల జీవనశైలి కలిగిన మహిళలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. యోగాలో మూడు రకాల భంగిమలు వెన్నెముక అమరికపై దృష్టి సారిస్తాయి. ప్రభావిత ప్రాంతంపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి, ఇది నొప్పిని, అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఉష్ట్రాసనం.. ఒంటెను సంస్కృతంలో ఉష్ట్రము అని అంటారు. అందుకే దీన్ని ఒంటె భంగిమ లేదా కామెల్ పోజ్ అని కూడా అంటారు. ఈ భంగిమ ద్వారా వెన్నెముక దృఢంగా మారుతుంది. దీన్ని ఎలా చేయాలంటే.. ఒంటె భంగిమలోకి రావడానికి, నేలపై మోకరిల్లి, ఆపై రెండు చేతులను తుంటిపై ఉంచాలి. పాదాల పై భాగం చాప మీద ఉండాలి. ఇప్పుడు వెన్నెముకను పొడిగించాలి. మడమల మీద రెండు చేతులను ఉంచుతూ నెమ్మదిగా వెనుకకు వంచాలి. మెడను చాచి తలను వెనుకకు వంచాలి. తరువాత, రెండు చేతులను అరికాళ్ళకు తాకుతూ ధనస్సులా వెనక్కు వంగాలి. కొన్ని సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండండి. శలభాసనము.. ఈ భంగిమ మిడతను పోలి ఉంటుంది. ఈ ఆసనం వేయడానికి మొదట బోర్లా పడుకోవాలి. ఇందుకోసం యోగా మ్యాట్ లేదా మెత్తగా ఉన్న దుప్పటి వంటిది ఉపయోగించాలి. బోర్లా పడుకుని చేతులు కిందకు చాపాలి. నేలపై నుదిటిని ముఖాన్నిఆనించి కాస్త విశ్రాంతి తీసుకోవాలి. ఊపిరి పీల్చుకున్నప్పుడు, ఛాతీ, తల, కాళ్ళు చేతులను నేల నుండి పైకి ఎత్తాలి. ఈ సమయంలో కాళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. చేతులు ఇరువైపులా ఫ్లాట్గా ఉండేలా చూసుకోవాలి. తరువాత, కాళ్ళను,వేళ్లను వీలైనంతగా సాగదీయాలి. ఇది చేస్తున్నంతసేపు శ్వాస పీల్చడంపై దృష్టి పెట్టాలి. కొన్ని సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండండి. తరువాత తిరిగి సాధారణ స్థితికి రావాలి. భుజంగాసనం.. సంస్కృతంలో పామును భుజంగం అంటారు. ఈ ఆసనం నాగుపాము నిలబడినట్టు ఉంటుంది. నేలపై పడుకుని రెండు అరచేతులు చదునుగా భుజాల క్రింద ఉంచుకోవాలి. పాదాల పైభాగం నేలపై ఫ్లాట్గా ఉండాలి. ఆపై బొడ్డు బటన్ను లోపలికి తీసుకుంటూ పెల్విస్ విభాగాన్ని బిగుతుగా చేయడం ద్వారా పొట్ట కండరాలను బిగించాలి. ఇప్పుడు అరచేతులను నొక్కుతూ వేళ్లను సాగదీయాలి. భుజం అంచులు ముందుకు వంచుతూ భుజాలను వెనక్కి లాగాలి. శరీర పైభాగంలో మొండెం ఉపరితలం నుండి చేతులను నిఠారుగా ఉంచాలి. ఇప్పుడు పాదాలు, కాళ్ళను నేలపై గట్టిగా ప్రెస్ చేయాలి. గడ్డం పైకి వంచి, ఛాతీని పైకి ఎత్తాలి. ఇదే భుజాంగాసనం. కొన్ని సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండాలి. తరువాత సాధారణ స్థితికి రావాలి. ఈ మూడు ఆసనాలు ప్రతిరోజూ వేస్తుంటే డిస్క్ సమస్యలు తగ్గుతాయి. *నిశ్శబ్ద
గుండె సమస్యలు ఉంటే ఈ 4 యోగాసనాలు వేయకూడదు..!! శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగాసనాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. రోజూ యోగా చేయడం దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. నిపుణులు కూడా ఇవే సలహా ఇస్తున్నారు. యోగా అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుంది. ముఖ్యంగా యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ సమతూకంగా ఉంటాయి .కానీ నిపుణుల సలహా తీసుకోకుండా కొన్ని యోగా వ్యాయామాలు చేస్తే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు.. యోగా నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే యోగా వ్యాయామాలు చేయడం మంచిది. మీకు తోచినట్లు ఏదొక ఆసనం వేసినట్లయితే.. మరో అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని యోగాసనాలు గుండె ఆరోగ్యానికి మంచివి కావు. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో యోగా పాత్ర మరువరాదు. యోగాసనాల ద్వారా అనేక రకాల గుండె సమస్యలు పరిష్కారమవుతాయనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే రోజూ కొన్ని యోగాభ్యాసాలు పాటిస్తే గుండెకు హాని కలుగుతుందని మీకు తెలుసా? మరి అలాంటి యోగాసనాలు ఏంటో చూద్దాం... చక్రాసనం: సాధారణంగా, యోగా నిపుణులు వెన్నునొప్పి లేదా వెన్నుపాముకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నవారు చక్రాసనానికి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు. అదేవిధంగా అధిక రక్తపోటు, గుండె సమస్యలు, మధుమేహంతో బాధపడేవారు ఈ చక్రాసన యోగాభ్యాసం చేయకూడదని యోగా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శరీరాన్ని తేట్ చక్రం పద్ధతిలో ఉంచుతుంది కాబట్టి దీనిని చక్రాసనం అంటారు. ఈ ఆసనాన్ని అభ్యసిస్తున్నప్పుడు, శరీరం, గుండె రెండింటిపై అధిక ఒత్తిడి పడి, శ్వాస రేటు కూడా పెరుగుతుంది. ఇవి గుండెకు హాని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు.. ఈ యోగాభ్యాసం చేయకపోవడమే మంచిది. శీర్షాసన: శీర్షాసనం చేయడం అంత ఈజీ కాదు. ఈ యోగాభ్యాసం చేసే వ్యక్తి తన తలను నేలపై ఉంచి రెండు కాళ్లను పైకి ఎత్తాలి. అంటే మీరు తలక్రిందులుగా నిలబడాలి, మీ తల క్రిందికి, మీ కాళ్ళను పైకి ఉంచాలి. మీ శరీరాన్ని పూర్తిగా బ్యాలెన్స్ చేయాలి. ఈ యోగాభ్యాసం సమయంలో రక్తప్రసరణలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే గుండెపై విపరీతమైన ఒత్తిడి వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. హలాసనం: హలాసాన్ని నీల భంగి అని కూడా అంటారు. ఈ యోగాను అభ్యసించే వ్యక్తి ఉదర కండరాలపై పీల్చేటప్పుడు, నొక్కినప్పుడు నేల నుండి పాదాలను పైకి ఎత్తాలి. అటువంటి సందర్భంలో, వ్యక్తి గుండె శరీరం దిగువ భాగంలో రక్త ప్రసరణను కలిగిస్తుంది కాబట్టి, ఇక్కడ రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. ఇది కాకుండా, గుండె ప్రాంతానికి రక్త ప్రసరణ పెరిగే అవకాశం ఉంది, తద్వారా గుండెపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లయితే, ఈ యోగాసనాలు వేయకూడదు. కరణిఆసనం: నేలపై పడుకుని రెండు పాదాలను గోడలపై ఉంచి చేసే యోగాభ్యాసం ఇది. కానీ ఇలా చేయడం వల్ల గుండెపై అదనపు భారం పడుతుందని, రక్త ప్రసరణ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.-అందుకే ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కరణి యోగాను అతిగా చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సూర్య నస్కారాలు వాటి ఉపయోగాలు! ఇప్పుడున్న ఊరుకులపరుగుల జీవితం లో ఆరోగ్యం మీద శ్రద్ద లేకుండా పోతుంది. దీనివల్ల బరువు పెరగడం, ఒత్తిడికి గురవడం, నిద్ర పట్టకపోవడం ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి రోజు ఒక అరగంట వ్యాయామానికి సమయం కేటాయించడం వలన అందం, ఆరోగ్యం రెండింటిని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఆ వ్యాయామాలు ఏంటో? వాటివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం . సూర్య నమస్కారం ఎనిమిది ఆసనాలతో 12 దశల్లో సాగుతుంది. * జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.. ప్రతి రోజూ సూర్య నమస్కారం చేయడంవల్ల .. జీర్ణవ్యవస్థ పనితీరుకు మేలు చేస్తుంది. ఇది పేగులోలోని రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. శరీరాన్ని ముందుగు వంచడం, సాగదీయం వల్ల.. పొత్తికడుపుపై ఒత్తిడి పడుతుంది. ఇది కడుపులో చిక్కుకున్న గ్యాస్ తేలికగా బయటకు వెళ్లేలా సహాయపడుతుంది. రోజూ సూర్య నమస్కారం చేస్తే అజీర్తి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. * బరువు తగ్గుతారు.. ఒక సెట్ సూర్య నమస్కారం చేస్తే.. శరీరం నుంచి అదనపు కేలరీలు, కొవ్వును బర్న్ చేస్తుంది. సూర్యనమస్కారాలు వేగంగా చేయడం వల్ల.. వేగంగా బరువు తగ్గవచ్చు. ఇవి జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడతాయి. * పీసీఓఎస్ తగ్గిస్తుంది.. సూర్యనమస్కారాలు 12 వారాల పాటు 10 - 15 నిమిషాలు చేస్తే.. సాధారణ వ్యాయామాల కంటే.. చాలా ప్రభావవంతంగా ఉంటుంది. క్రమం తప్పిన పీరియడ్స్ను.. సమయానికి వచ్చేలా చేస్తాయి. సూర్య నమస్కారం ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పీసీఓఎస్కు ఒత్తిడి హార్మన్ పెరగడం కూడా ఓ కారణం. పీసీఓఎస్తో బాధపడే మహిళలు.. క్రమతప్పకుండా సూర్యనమస్కారాలు ప్రాక్టిస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మన శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. సూర్య నమస్కారం శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది, అదనపు కార్బన్ డయాక్సైడ్ను బయటకు విడుదల చేస్తుంది. స్ట్రెస్ తగ్గిస్తుంది.. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుముఖం పడతాయి. సూర్యనమస్కారాలలోని లోతైన శ్వాస ప్రక్రియలు.. నాడీ కణాలను రిలాక్స్ చేస్థాయి. ఇవి భావోద్వేగ స్థిరత్వాన్ని పెంచుతాయి. రోజూ సూర్య సమస్కారాలు చేయడం వల్ల.. సృజనాత్మకత కూడా పెరుగుతుంది. * మెరిసే చర్మం మీ సొంతం.. సూర్య నమస్కారాలు.. సౌందర్య సంరక్షణలోనూ సహాయపడతాయి. ఈ ఆసనాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ముఖానికి ప్రకాశవంతమైన కాంతిని అందిస్తాయి. ముడతలు, గీతలు వంటి వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. సూర్యనమస్కారాలు నిద్రను ప్రేరేపిస్తాయి, విశాంతిని అందిస్తాయి, జీర్ణక్రయను మెరుగుపరుస్తుంది. సూర్యనమస్కారాలు.. వేగంగా చేస్తే చెమట ఎక్కువగా పడుతుంది. చమట ద్వారా చర్మంలో పేరుకున్న వ్యర్థ పదార్థాలు బయటకు వస్తాయి. మీ చర్మం తాజాగా మారుతుంది * వీళ్లు వేయకూడదు.. గర్భిణులు మూడోనెల తర్వాత సూర్య నమస్కారాలను వేయకూడదు. హైపర్టెన్షన్, గుండెజబ్బు, హెర్నియా, పేగుల్లో క్షయ వంటి సమస్యలు ఉన్నావారు, గతంలో స్ట్రోక్కు గురైనవారు సూర్యనమస్కారాలు వేయకూడదు. వెన్నునొప్పి, మెడనొప్పి ఉన్నవారు ఈ ఆసనాలు వేసే ముందు డాక్టర్ను సంప్రదించడం మేలు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, నొప్పి ఉన్నవారు సూర్యనమస్కారాలు చేయవద్దు.
యోగా లో జాగ్రత్తలు యోగ చేయడమన్నది ఇప్పుడు సర్వ సాధారణమై పోయింది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ యోగ వైపు మొగ్గు చూపుతున్నారు . యోగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయినా, అది చేసే ముందు కొన్ని విషయాలను తప్పక పాటించాల్సి ఉంటుంది. సాధారణంగా యోగాసనాలు చేయడానికి నేలమీద టవల్ పరచి చేస్తుంటారు. అయితే టవల్ కన్నా సూపర్ మార్కెట్ లో దొరికే యోగా మేట్ వాడటం మంచిది అంటున్నారు యోగ నిపుణులు. యోగ చేసే గది లేదా ఆ ప్రదేశంలో ఎలాంటి ఫర్నీచర్ లేకుండా చూసుకోవడం అవసరం. యోగ చేసే గది వాతావరణం మరీ వేడిగా లేదా చల్లగా ఉండకూడదు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉండేలా చూసుకోవాలి. అంతేకాక ఆ గదిలోని ప్రశాంతతకు భంగం కలగకుండా కూడా చూసుకోవాలి. వారంలో రెండూ లేదా మూడు సార్లు అని కాకుండా ప్రతిరోజూ యోగా చేసే విధంగా మీ దినచర్యని మార్చుకోండి. అలా చేయడానికి వీలున్నప్పుడే యోగా మొదలుపెడితే ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు. యోగ చేయడం ఎవరికోసమో అన్నట్లు కాకుండా మీ కోసమే మీరు చేస్తున్నారు అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి. ఆహారం తీసుకున్న రెండు గంటల తరవాత యోగ చేయడం మంచిది. యోగ చేసే ముందు చాక్లెట్ లు, కాఫీ, ఆల్కహాల్, ఉల్లిపాయ , పుల్లటి పండ్లు, స్పైసీ లేదా మసాల నిండిన ఆహారం , ఇంకా మాంసాహారం తీసుకోకూడదు.. యోగ చేస్తున్నంత కాలం తాజా పండ్లు, కూరగాయలు మాత్రమే ఆహారంగా తీసుకోవడం మంచిది. అందువల్ల అనుకున్న రీతిగా బరువుతగ్గడం, సౌందర్య పోషణ వంటి ఫలితాల్ని త్వరగా పొందగలుగుతారు . కొన్ని సందర్భాలలో మీ శరీరం యోగ చేయడానికి సహకరించకపోవచ్చు. అలాంటి సందర్భాలలో మొండిగా యోగ చేయడానికి ప్రయత్నించక, విశ్రాంతి తీసుకోండి. యోగ చేసే ముందు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో చేస్తేనే మంచిదని నిపుణులు చెపుతున్నారు.
Importance of Yoga In Daily Life Yoga in Daily Life is a system of practice consisting of eight levels of development in the areas of physical, mental, social and spiritual health. Yoga can do in our daily life. Yoga keeps us physically and mentally fit. Helps in curing lethal diseases like Diabetes, H.B.P., Angina, Blockages in Arteries, Obesity, Asthma, Bronchitis, Leucoderma, Depression, Parkinson, Insomnia, - Migraine, Thyroid, Arthritis, Cervical Spondalities, Hepatitis, Chronic Renal Failure, Cancer, Cirrhosis of Liver, Gas, Constipation, Acidity etc. which are still a challenge in modern medical science. Yoga gives us new freshness and energy in daily life by giving body, breath and mind to stretch, relax and energize and responsible for the Body cleansing and purification of the blood. This helps us in maintaining a natural glow on our face. Yoga keeps immune system of the body very strong, which gives us the strength to fight against diseases or helps in improving our concentration.
ప్రాణాయామం - ఆస్తమా నుంచి ఉపశమనం అస్తమా శ్వాస నాళాలకు సంబంధించిన వ్యాధి . మనం పీల్చే గాలి లోపలికి వెళ్ళేటప్పుడు గాని, లేదా ఒత్తిడి వల్ల గాని బ్రాంకియోల్స్ లోపలి పొర వాచి, మ్యూకస్ మెంబ్రేన్ ముడుచుకుపోతుంది. దాని వల్లఅస్తమా రోగులు గాలి పీల్చడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ వ్యాధి తీవ్రత వర్షాకాలంలో,లేదా శీతల ప్రాంతాల్లో ఉండేవారిలో అధికంగా ఉంటుంది. పెరుగుతున్న పారిశ్రామీకరణ, ఆహారపుటలవాట్లు, వాయుకాలుష్యం వల్ల ఆస్తమాతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అస్తమాకు చికిత్స లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ క్రమం తప్పకుండా సాధన చేస్తే అస్తమాను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ప్రాణాయామం ద్వారా అస్తమా నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రాణాయామం ఎపుడు చేయాలి..? ప్రాణాయామం శ్వాసకు సంబంధించిన వ్యామామం. దీనిని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఉదయం 4 నుండి 6 గంటల లోపు వాతావరణం కాలుష్య రహితంగా ఉంటుంది. కాబట్టి స్వచ్చమైన గాలిలో, ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా యోగా మ్యాట్ పై కూచుని ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయడానికి ముందే ముక్కు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఈ ఆసనం చేసేటప్పుడు ముక్కు రంధ్రాలు మూస్తూ తెరుస్తూ ఉండాలి కాబట్టి ముక్కులో ఎటువంటి మలినం లేకుండా శుభ్రపరచడం వల్ల శ్వాస పీల్చే సమయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రాణాయామానికి కనీసం మూడు గంటలు ముందుగా ఏమీ తినకూడదు. ప్రాణాయామం చేసే పధ్ధతి: మొదట యోగ మ్యాట్ పై కానీ, కుర్చీలో కానీ కంఫర్ట్ గా కూర్చోవాలి. వజ్రాసనం వేస్తే మరీ మంచిది. ముందుగా వీలైనంతగా గాలిని లోపలికి పీల్చాలి. వెంటనే గాలిని వదలకుండా, మీకు వీలైనంత సేపు ఊపిరి బిగపట్టి మెల్లిగా గాలిని వదలాలి. ఇలా రెండు, మూడు సార్లు చేయాలి. ఆ తరవాత చూపుడు వేలుతో బాటు మధ్య వేలును మడచి నాభిని ఉబ్బిస్తూ గాలిని వదలాలి. అదేవిధంగా మెల్లిగా గాలిని పీలుస్తూ నాభిని కూడా లోపలికి లాగాలి, ఇలా రెండు మూడు సార్లు చేయాలి. ఆ తర్వాత కుడి చేతి బొటన వేలితో ముక్కు కుడి రంద్రాన్ని మూసి ఉంచి ఎడమ రంద్రం ద్వారా గాలిని లోపలికి పీల్చి సాధ్యమైనంత వరకు ఊపిరి బిగపట్టి మెల్లిగా గాలిని వదలాలి. తరవాత కుడి ముక్కు రంద్రాన్ని మూసి మీకు సాధ్యమైనంత వరకు ఊపిరి బిగపట్టి ఆ తరవాత కుడి ముక్కు రంద్రం ద్వారా గాలిని వదలాలి. ఇలా రెండు మూడు సార్లు చేయాలి. ఎడమ రంద్రాన్ని మూసి ఉంచి కుడి రంద్రం ద్వారా గాలిని పీల్చి వీలైనంత సేపు ఊపిరి బిగపట్టి ఆ తరవాత కుడి రంద్రాన్ని మూసి ఎడమ రంద్రం ద్వారా గాలిని వదలాలి. అదే విధంగా కుడి రంద్రాన్ని మూసి ఉంచి ఎడమ రంద్రం ద్వారా గాలి పేల్చి వీలైనంత వరకు ఊపిరి బిగపట్టి ఎడమ రంద్రాన్ని మూసి కుడి రంద్రం ద్వారా గాలిని వదలాలి. ఇలా రెండు మూడు సార్లు చేయాలి.
ఆహరం : మనిషి జీవించి వుండాలంటే ఆహారం చాలా అవసరం. ఆహారం నిమిత్తం ప్రకృతి ఎన్నో పదార్థాలు ప్రసాదించింది. ఆ పదార్థాలన్నీ వేళకు మితంగా భుజిస్తే మనిషి హాయిగా, రోగాలు లేకుండా, ఆరోగ్యంగా బ్రతకవచ్చు. ఆకు కూరలు, కాయకూరలు, దుంపకూరలు, పప్పులు, తిండి గింజలు, ధనియాలు, అల్లం, పెద్ద ఉల్లి, చిన్న ఉల్లి(వెల్లుల్లి), నిమ్మ, కొబ్బరి మొదలుగా గా ఆహారపదార్థాలు మితంగా వాడాలి. ఋతువుల ప్రకారం లభించే పండ్లు అపారం. మామిడి, నేరేడు, యాపిల్, దానిమ్మ, ఖర్బుజా, పుచ్చకాయ, జామ, అరటి, బత్తాయి, నారింజ, కమలా, పనస, రేగి, ద్రాక్ష, సీతాఫలం మొదలుగా గల పండ్లు తినవచ్చు. ఆయా పండ్ల రసాలు తాగవచ్చు. బాదంపప్పు, జీడిపప్పు, కిస్ మిస్, ఎండు ద్రాక్ష, ఆఖరోట్, వేరుసెనగ, పిస్తా, అంజీర మొదలుగా గల తిండి పదార్థాలు కూడా లభిస్తున్నాయి. గోధుమ, వరి, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, అలచందలు, శనగలు, మొదలుగా గల తిండి గింజలు అధిక పరిమాణంలో లభిస్తున్నాయి. పాలు, వెన్న, మీగడ, నెయ్యి, లస్సీ, మజ్జిగ, పెరుగు, పాలతో తయారయ్యే పాలు రుచికరమైన పదార్థాలు నువ్వులు, వేరుశనగ, కొబ్బరి మొదలగు వాటి నుంచి వెలువడు నూనెలు, తేనే, బెల్లం, పంచదార, తాటిబెల్లం, చెరకు మొదలుగా గల తీపి పదార్థాలు ప్రకృతి మనకు ప్రసాదించినవే. వీటిని అవసరమైనంత వరకు మాత్రమే, వేళకు తీసుకుంటూ వుంటే రోగాలు దరిదాపుకు రావు. గుడ్లు, చేపలు, మాంసం తామస పదార్థాలు వీటిని తిన్నందువల్ల తామసరాజస గుణాలు అధికం అవుతాయి. అందువల్ల వాటిని తినక పోవడం మంచిది. మద్యం, గంజాయి, బంగు, నల్లమందు, పొగాకు మొదలగునవి మత్తు లేక నిషా ఎక్కించే పదార్థాలు. వీటిని వాడకూడదు. ఖాద్య పదార్థాలు, స్వీట్లు, ఎప్పుడు బడితే అప్పుడు లభించాయి కదా అని తెగ తినకూడదు. అలా తిన్నందువల్ల అవి జీర్ణం కాక రోగాలు పట్టుకుంటాయి. భోజనం రెండు పూటలు మాత్రమె చేయడం మంచిది. టిఫినుకు భోజనానికి మధ్య కనీసం నాలుగు గంటల వ్యవధి అవసరం. ఉదయం పూట 9 గంటల నుంచి 11 గంటల లోపున భోజనం చేసే వాళ్ళు ఉదయం తీసుకోకూడదు. మధ్యాహ్నం రెండు మూడు గంటల మధ్య పండ్లు తినవచ్చు. పండ్ల రసంగాని, అలవాటు అయిన వాళ్ళు ఒక కప్పు, కాఫీ గాని, టీ గాని తాగవచ్చు. కాయ కష్టం చేసే వాళ్ళు తగిన పరిమాణంలో ఆహరం తీసుకోవాలి. మానసిక శ్రమ చేసే వాళ్ళు తక్కువ ఆహరం తీసుకోవాలి. ఆహారపదార్థాల్ని తాగాలి, నీళ్ళను తినాలి, ఈట్ లిక్విడ్స్, డ్రింక్ సాలిడ్స్ అనునది అందరికీ తెలిసిన నానుడియే. మనం తినే ఆహరం లాలాజలంతో కలిసి జీర్ణ కోశంలోకి వెళ్లి జీర్ణం అవుతుంది అంటే ఆహారాన్ని నీరువలె మార్చి తినాలన్నమాట. నీళ్ళు మరియు పేయ పదార్థాలు నోట్లో పోసుకొని మెల్లమెల్లగా తింటూ వున్నట్లు తాగాలి. ఆహారం బాగా నమలడం వల్ల దంతాలు, చిగుళ్ళు గట్టి పడతాయి. సూచనలు : 1) ప్రొద్దున మేల్కొనగానే చెంబెడు లేక గ్లాసెడు మంచి నీళ్ళు తప్పని సరిగ్గా తాగాలి. 2) మలమూత్ర విసర్జన చేయకుండా ఏమి తినకూడదు. ప్రొద్దున్నే మల విసర్జనం అలవాటు లేని వాళ్ళు అట్టి అలవాటు చేసుకోవాలి. అందుకు రెండు గ్లాసులు గోరు వెచ్చని నిరు తరగాలి. 3) భోజనం చేయునప్పుడు సాధ్యమైనంత వరకు మధ్యన నీళ్ళు తాగకూడదు. 4) యోగాభ్యాసం, వ్యాయామం చేసిన కొద్ది సేపటి దాకా ఏమి తినకూడదు. వాహ్యాళికి వెళ్లి వచ్చిన తరువాత కూడా కొద్దిసేపు ఏమి తినకూడదు. 5) నిద్రపోయే ముందు ఏమి తినకూడదు. భోజనానికి నిద్రకు మధ్య సాధ్యమైనంత వ్యవది వుండటం అవసరం. 6) ఉపవాస సమయంలో టిఫిన్ల పెరట అమితంగా తినకూడదు. జబ్బు పడినప్పుడు పత్యంగా ఆహరం తీసుకోవాలి. 7) పాసిపోయిన, మురిగిపోయిన ఆహార పదార్థాలు తినకూడదు. 8) సగం పాడైన పండ్లు, పాడైనంత వరకు తొలగించి, బాగా వున్నది కదా అని మిగతా భాగం తినకూడదు. 9) భోజనం చేయుటకు ముందు నీళ్ళతో పాదాలు, ముఖం, చేతులు తప్పక కడుక్కోవాలి. అందువల్ల టెన్షను తగ్గుతుంది. భోజనం తేలికగా జీర్ణం అవుతుంది. 10) భోజనం చేయు సమయంలో ప్రశాంతంగా వుండాలి. మధ్య మధ్య మంతనాలు చేయడం, అదే పనిగా మాట్లాడుతూ వుండటం, మధ్య మధ్యన ఫోన్లు చేస్తూ వుండటం, ఫోన్లు వచ్చినప్పుడు భోజనం చేస్తూ మాట్లాడుతూ వుండటం సరికాదు. 11) భోజనానికి ముందు దైవ ప్రార్థన తప్పక చేయాలి. 12) భోజనం చేశాక 10 నిమిషాలపాటు పచార్లు చేసి, కనీసం 5 నుంచి 10 నిమిషాల సేపు వజ్రాసనం వేయాలి.
సూర్య నమస్కారాలు ఆసనాలు: 1. ప్రణామాసనం నిటారుగా ప్రార్థనా భంగిమలో నిలుచుని ఉండాలి. రెండు పాదాలు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి. చేతులు నమస్కార ముద్రను చూపుతుండాలి. కొద్ది నిమిషాలు ఉచ్చ్వాస నిచ్చ్వాసలను ( inhale – exhale) చేయాలి. ' ఓం మిత్రాయ నమః ' అందరికీ మిత్రుడనైన నీకు అంజలి ఘటిస్తున్నాము అనే అర్థం వచ్చే ఈ మంత్రాన్ని పఠించాలి . ప్రయోజనాలు : ఈ ఆసనం చేస్తూ మనస్సును నిశ్చలంగా ఉంచడం వల్ల, మనస్సును హృదయం పై కేంద్రీకరించి ఉండటం వల్ల మనస్సు సూర్యాభివందనం చేయడానికి అనువుగా మారుతుంది. 2.హస్త ఉత్థానాసనం శ్వాస లోనికి పీలుస్తూ రెండు చేతులను పైకెత్తి వీపు వైపుకు వెనుకకు వంచాలి. ప్రారంభదశలో ఉన్న సాధకులైతే కొద్దిగాను, చాలాకాలంగా అభ్యసిస్తున్న వారైతే గాఢంగాను ఊపిరి పీల్చుకోవాలి. ' ఓం రవయే నమః' ప్రకాశవంతుడైన ప్రకాశదాతవైన నీకివే వందనాలు దేవా! అనే అర్థాన్నిచ్చే ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. ప్రయోజనాలు : వెన్నెముకకు శక్తి ఇవ్వడం , దాని రుగ్మతలను నిరోధించేది గాను ఈ ఆసనం పని చేస్తుంది. వెన్నెముకలోని నరాలను ప్రభావితం చేయడం వల్ల మనస్సును ఆహ్లాదంగా ఉంచుతుంది. ఛాతీని విరిచినట్లుగా వెడల్పుగా చేయడం వల్ల శ్వాసక్రియ మెరుగుపడి ఊపిరితిత్తుల శక్తి మెరుగుపడుతుంది. అంతేకాక థైమస్, థైరాయిడ్ వంటి గ్రంథులపై బాగా పని చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెంపు, మెటబాలిక్ హార్మోన్ ఉత్పత్తి, కాల్షియం, మెగ్నీషియం, మెటబాలిజం మెరుగుపరిచి, సారా థైరాయిడ్ చురుకుగా పనిచేస్తుంది. 3. పాదహస్తాసనం శ్వాసను వదులుతూ ముందుకు వంగి రెండు చేతులను నేలపై ఆన్చాలి. రెండు చేతులను నేలపై ఆన్చలేని పక్షంలో మోకాళ్ళను వంచి చేతులను పాదాలకు ఇరుపక్కలా ఉంచాలి. తల తొడలను చూస్తున్నట్లు ఉండాలి. ' ఓం సూర్యాయ నమః ' సకల ప్రాణుల పుట్టుకకు కారణమైన పరమాత్మ అనే భావాన్నిచ్చే ఈ మంత్రాన్ని జపించాలి. జాగ్రత్తలు: మెడ కింద వైపు వేలాడేలాగా ఉంచాలి. పైకి చూడకూడదు . అలా కానిచో మెడ పట్టేసే ప్రమాదముంది . ప్రయోజనాలు: ఈ ఆసనం వల్ల ఉదరం పై ఒత్తిడి పడిన కారణంగా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం తొలగిపోతుంది. చర్మం బిగువుగా యవ్వన కాంతితో ప్రకాశిస్తుంది . మెదడు చల్లబడి కోపాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. తొడల వెనుక భాగానికి బలాన్నిస్తుంది , కొవ్వుని తొలగించి శరీరం నాజూకుగా మారడానికి ఈ ఆసనం సహకరిస్తుంది. 4.అశ్వ సంచలనాసనం లోనికి శ్వాసిస్తూ కుడిపాదం వెనుక వైపునకు కదిలించాలి. అదే సమయంలో శరీరాన్ని కిందకు వంచుతూ చేతులను నేలమీదకు వంచాలి. కుడి మోకాలుని కూడా అదే సమయంలో వెనుకకు వంచాలి. తల ఎత్తి ఇంటి కప్పులపైకి చూడాలి. నేలపై రెండు చేతులను ఉంచాలి. ఈ భంగిమలో శరీరం అర్థ చంద్రాకృతిని కలిగి ఉంటుంది. ' ఓం భానవే నమః ' అజ్ఞానాన్ని తొలగించే గురువుకు వందనం ' అనే అర్థాన్నిచ్చే మంత్రం పఠించాలి. జాగ్రత్తలు : ప్రారంభ దశలో ఎక్కువమంది సాధకులు మోకాలిని వెనుకకు వంచడాన్ని మరిచిపోతారు. శరీరమంతా సక్రమమైన భంగిమలో ఉన్నదా లేదా అన అంశాన్ని గమనించాలి. చాలామంది పైకి చూడటం మరిచిపోతారు . తప్పనిసరిగా తలను పైకెత్తి చూడాలి. థైరాయిడ్ గ్రంథి చర్య క్రమబద్ధం చేసేందుకు ఈ భంగిమ కీలకమైన పాత్రను కలిగి ఉంది. ప్రయోజనాలు: శరీరానికి మంచి ఆకృతిని ఇవ్వడంతో పాటు నాజూకుగా మలచడంలో ఈ ఆసనం ఉపయోగకారి. ఈ భంగిమలో థైరాయిడ్, ఎడ్రినల్, మరియు యురోజెనిటల్ గ్రంథులు వంటివి ఉత్తేజితమవుతాయి . శ్వాస సంబంధమైన ' సైనస్' సమస్యను అధిగమించడం, సంతాన సాఫల్యం , శ్వాసక్రియ మెరుగుపడటం - ఈ ప్రక్రియ వల్ల కలిగే ప్రయోజనాలు. . సూర్య నమస్కారాల్లోని మిగిలిన ఆసనాలు మూడవభాగంలో ..