తెరాసకు మద్దతు ఇస్తే తప్పేమిటి? జగన్

Publish Date:Jul 3, 2015

Advertisement

 

ధవళేశ్వరం వద్ద ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం నాలుగు రోజుల్లో చెల్లించకపోతే విశాఖ కలెక్టరేట్ ని ముట్టడిస్తామని ప్రభుత్వానికి గడువు విధించారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన వ్యక్తి వారిని పరామర్శిస్తే ఎవరూ కాదనరు. వారికి పరిహారం చెల్లించమని ప్రభుత్వాన్ని కోరినా కూడా ఎవరూ తప్పు పట్టరు. కానీ ఆ పనిని ప్రభుత్వం ఎన్ని రోజులలో పూర్తిచేయాలో గడువు పెట్టడం లేకుంటే కలెక్టరేట్ ని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని బెదిరించడం ఎవరూ హర్షించరు.

 

ఇక బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించడం చూస్తుంటే అసలు అందుకే ఆయన ఈ పరామర్శ యాత్రల కార్యక్రమం పెట్టుకొన్నట్లు అనిపిస్తోంది. ఆయన ఉదేశ్యాలు ఎవయినప్పటికీ ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు ఆయన చాలా ఆసక్తికరమయిన విషయం ఒకటి బయటపెట్టారు. “రెండు రాష్ట్రాలలో తమ పార్టీ కొనసాగుతున్నప్పుడు తాము ఎవరికి మద్దతు ఇచ్చుకొంటే వారికెందుకు?” అని ప్రశ్నించారు.

 

నిజమే! తెరాసకు వైకాపా మద్దతు ఇచ్చినా, ఆ పార్టీతో పొత్తులు పెట్టుకొన్నా ఎవరూ అభ్యంతరం చెప్పడానికి లేదు. అది ఆ పార్టీల రాజకీయ హక్కు కూడా. కానీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నామని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న తెరాసతో ఎందుకు చేతులు కలుపుతున్నారు? తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలని తెరాసలోకి ఆకర్షించినా ప్రశ్నించకుండా మౌనం వహించడమే కాక మళ్ళీ ఆ పార్టీకే తిరిగి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? ప్రజలెన్నుకొన్న తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ పార్టీ నేతలతో ఎందుకు చేతులు కలిపారని తెదేపా నేతలు ప్రశ్నిస్తున్నారు. కనుక ఆయన తమ పార్టీ తెరాసకు మద్దతు ఇవ్వడం గురించి మాట్లాడే బదులు వారి ప్రశ్నలకు సమాధానం చెపితే బాగుండేది.

 

వారి వాదోపవాదాలు, వాటి వెనుక ఉద్దేశ్యాలు, వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఆంధ్రా వ్యతిరేక, తెరాస అనుకూల వైఖరి వలన వైకాపా పట్ల రాష్ట్ర ప్రజలలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాలకు బీజం వేసిన విశాఖనగరంలో నిలబడి రాష్ట్ర విభజనకు కారణమయిన తెరాసకు మద్దతు ఇస్తే ఏమిటి తప్పు? అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం చూసి రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం చెందుతున్నారు.

By
en-us Political News

  
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.