వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కొండా సురేఖ పరకాల ఉపఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా లేక వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తారా అన్న విషయం ఇంకా తేలలేదు. పరకాలలో తెలంగాణావాదం బలంగా ఉన్న నేపథ్యంలో ఆమె గెలుపు కష్టమని అందుకే పార్టే తరపున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఆలోచన కూడా ఆమె చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అనుకొని విధంగా ఇప్పుడు ఆమెకు పరిస్థితులు మెరుగుపడ్డాయి.
తెలంగాణావాద రాజకీయ పార్టీల మధ్య చీలిక రావటంతో కొండా సురేఖ సంతోషంగా ఉన్నారు. ఈ చీలికలను ఆసరాగా చేసుకుని పార్టీ తరపునే ఆమె పోటీ చేయాలను కుంటున్నట్లు తెలుస్తోంది. పరకాల ఎన్నికలలో తెలంగాణా టిడిపి ఇప్పటికే తమ అభ్యర్థి పేరును ప్రకటించింది. బిజెపి, టి.ఆర్.ఎస్. కూడా త్వరలోనే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించబోతున్నాయి. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణావాద పార్టీలన్నీ విభేదాలు విస్మరించి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని ఆందోళన చేస్తున్నాయి. ఒకవేళ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టకపొతే తెలంగాణా పొలిటికల్ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండ రామ్ ఆశీస్సులతో ఎవరో ఒక విద్యార్థి నాయకుడు పరకాలాలో పోటీ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇదే జరిగితే తెలంగాణా సెంటిమెంటు ఉన్న పరకాల ఓటర్లలో చీలికరావడం ఖాయం. తెలంగాణావాడ ఓట్లలో చీలిక వస్తే తన విజయం తేలిక అవుతుందని కొండా సురేఖ అంచనా వేస్తున్నారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ysr-congress-party-leader-konda-surekha-24-13783.html
కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు కేసీఆర్ ఫాంహౌస్ను ముట్టడికి పిలుపు నిచ్చారు. ఆ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య దాదాపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నినాదాలతో సభ మార్మోగింది. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ పావుగంట సేపు వాయిదా వేశారు.
తాను స్పీకర్ ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడానంటూ వచ్చిన ఆరోపణలను తాతా మధు ఖండించారు. తాను స్పీకర్ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను అధికార కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని ఆరోపించారు.
ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో, సీఎం కార్యాలయం తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది.
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.