జగన్మోహనుడి చెంతచేరనున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు?

Publish Date:May 3, 2012

Advertisement

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, అత్యంత సౌమ్యునిగా పేరుపొందిన కేంద్ర మాజీమంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాపు వర్గానికి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గతంలో తెలుగుదేశం లోని ముఖ్యమైన నాయకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ విధివిధానాల రూపకల్పనలో కూడా ఆయన కీలకపాత్ర వహించారు. ఆయన ఎప్పుడూ పార్టీకి వీరవిధేయతతో ఉండేవారు. అటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఒక్కసారిగా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు.

 

 

పార్టీ ప్రస్తుతం గడ్డుపరిస్థితుల్లో ఉందని, దానికి చంద్రబాబునాయుడు అనుసరించే ఒంటెద్దు పోకడలే అంటున్నారు. కాపులను, బిసిలను తెలుగుదేశం పార్టీ విస్మరించింది, గతంలో ఎన్నికల్లో ఈ వర్గాలకు సుమారు 25 టిక్కెట్లు ఇస్తే వారిలో ఐదు నుంచి ఆరుగురు లోక్ సభకు ఎన్నికయ్యేవారని, కాని ఇప్పుడు లోక్ సభలో ఒక్కరు కూడా ఆ వర్గానికి చెందినవారు లేరని ఉమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇటీవల రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించారు. అది దక్కకపోవడంతో ఉమ్మారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీనికి తోడు చంద్రబాబు వైఖరిలో ఇటీవల వచ్చిన మార్పులు కూడా ఆయనకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. గుంటూరు జిల్లా పార్టీ నాయకులు ఆయనకు పార్టీ సభ్యత్వం కూడా పునరుద్దరించకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఆయన త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పి వై.ఎస్. జగన్మోహన రెడ్డి పంచన చేరే అవకాశముంది తెలుస్తోంది.

By
en-us Political News

  
 తాను స్పీకర్ ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడానంటూ వచ్చిన ఆరోపణలను తాతా మధు ఖండించారు.  తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను అధికార కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని  ఆరోపించారు.
ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో, సీఎం కార్యాలయం తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది. 
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం   భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు   దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ  విధానాలపై  పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు.  ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు,  రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. 
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న  వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని   పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో  బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది.   ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని   బలహీనపరిచింది. 
గత పుష్కర కాలంగా  ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో  మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో  అధికారుల కమిటీ  సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.