కృష్ణా, పశ్చినగోదావరి జిల్లాల మధ్యన సుమారు 70వేల ఎకలార విస్తీర్ణంలో సహజసిద్ధంగా ఏర్పడిన కొల్లేటి సరస్సును కాసులకోసం కక్కుర్తిపడి కొందరు బడా నాయకులు, వ్యాపార వేత్తలు కొల్లగొట్టేశారు. ప్రస్తుతం కొల్లేరు తన స్వరూపాన్ని పూర్తి గా పోగొట్టుకుంది. స్వచ్చమైన నీరు వుండాల్సిన కొల్లేరులో ఇప్పుడు ఎక్కడ చూసినా మురికినీరే దర్శనమిస్తోంది. సుమారు 55వేల ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు పూర్తిగా ఎండిపోయి ఎడారిని తలపిస్తోంది. ఈ ప్రాంత వాసులకు మంచినీళ్ళు కూడా కరువయ్యాయి.
వీరు ప్రైవేట్ సంస్థలు విక్రయించే నీతిపైనా లేదా స్వచ్చంద సంస్థలు, చారిటబుల్ ట్రస్ట్ లు సరఫరా చేసే నీటిపైనే పూర్తిగా ఆధారపడ్డారు. గత 30 సంవత్సరాలుగా కృష్ణజిల్లా, పశ్చ్నిమగోదావారి జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇక్కడ విచ్చలవిడిగా చేపల చెరువులు తవ్వి కోట్లాది రూపాయలు ఆర్జించారు. కొల్లేరును మాత్రం గుల్ల చేశారు. కొల్లేరులో చేపల చెరువులు వేసి కోట్లాది రూపాయలు ఆర్హించిన వ్యక్తులందరూ టం పెట్టుబడులను మాత్రం బయట ప్రాంతాల్లో పెట్టారు. కొల్లేరుప్రాంత అభివృద్ధికి వారు చేసిందేమీ లేదు.
ఒకానొక దశలో కొల్లేరుకు సమీపాన ఒక ఎయిర్ స్ట్రిప్ ను నిర్మించి ఇక్కడ లభ్యమయ్యే చేపలను నేరుగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేయాలని స్థానిక వ్యాపారులు ఆశించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఐటిశాఖ అధికారులు ఈ వ్యాపారులపై దాడులు జరపడంతో వారు ఎయిర్ స్ట్రిప్ ప్రతిపాదనను అటకెక్కించారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో ఈ చేపల చెరువుల్లో కొన్నింటిని ధ్వంసం చేసినప్పటికీ కొల్లేరు మాత్రం తన పూర్వ వైభవాన్ని సంతరించుకాలేకపోయింది. కొల్లేరు సరస్సు ఎగువ భాగం నుంచి వర్షాకాలంలో పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరేది. ఎర్రకాలువ, రామిలేరు. తమ్మిలేరు వంటి వాగులతో పాటు మిగతా చోటినుంచి కూడా నేరుగా నీరు కొల్లేరుకు చేరడంతో సరస్సు కళకళలాడేది. అయితే స్వార్థపరులు ఈ సరస్సు ప్రాంతంలో చేపల చెరువులు తవ్వి సహజసిద్ధంగా ఏర్పడిన కొల్లేరు సరస్సును నామరూపాలు లేకుండా చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kolleru-lake-between-krishna-and-westgodavari-districts-24-13782.html
కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు కేసీఆర్ ఫాంహౌస్ను ముట్టడికి పిలుపు నిచ్చారు. ఆ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య దాదాపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నినాదాలతో సభ మార్మోగింది. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ పావుగంట సేపు వాయిదా వేశారు.
తాను స్పీకర్ ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడానంటూ వచ్చిన ఆరోపణలను తాతా మధు ఖండించారు. తాను స్పీకర్ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను అధికార కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని ఆరోపించారు.
ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో, సీఎం కార్యాలయం తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది.
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.