వచ్చే ఎన్నికల నాటికి వైకాపా జెండా మారుతుందేమో?

Publish Date:Jan 5, 2015

Advertisement

 

ఆంధ్రలో చంద్రప్రభుత్వం రెండేళ్ళు మహా అయితే నాలుగేళ్ళు ఉంటుందని, ఆ తరువాత తానే ముఖ్యమంత్రి అవుతానని జగన్మోహన్ రెడ్డి ఘంటాపదంగా చెపుతున్నారు. అందుకే తుళ్ళూరు రైతులను అధైర్యపడవద్దని, తను ముఖ్యమంత్రి అవగానే ఎవరి భూములు వారికి ఇచ్చేస్తానని హామీ కూడా ఇస్తున్నారు. ఆ భూముల మీద రాజధాని నిలబడిన తరువాత అదెలా సాధ్యపడుతుందో ఆయనే చెప్పి పుణ్యం కట్టుకొంటే బాగుండేది.

 

ఇదివరకు ఒకపక్క రాష్ట్ర విభజన జరిగిపోతుంటే, నాకు ముప్పై మంది యంపీలను, ఓ 115 మంది శాసనసభ్యులను ఇచ్చినట్లయితే డిల్లీలో చక్రం తిప్పి అడ్డేస్తానని ఆయన హామీ ఇచ్చినప్పుడూ జనాలు ఇలానే చాలా కన్ఫ్యూస్ అయిపోయారు. ఆ కన్ఫ్యూస్ లోనే ఆయనకి ఓటేయడం మరిచిపోయినట్లున్నారు. అయినప్పటికీ గతం గతః కనుక మళ్ళీ వచ్చే ఎన్నికల తరువాత ఆంధ్రాలో ఆయనే ముఖ్యమంత్రి అయిపోదామని డిసైడ్ అయిపోయారు. చాలా సంతోషం.

 

ఇక ఆ మధ్యన ఎప్పుడో ఆయన హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణాలో కూడా తమ పార్టీయే అధికారంలోకి రాబోతోందని ప్రకటించేశారు. వైకాపా, కాంగ్రెస్, బీజేపీలు తప్ప అధికార తెరాసతో సహా అన్ని పార్టీలు కూడా తెలంగాణా నుండి ఊడ్చిపెట్టుకుపోతాయని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికలకి ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వాలనే ఆలోచనతో, తనకు బాగా అచ్చి వచ్చిన బాణాన్ని తెలంగాణాపైకి వదిలారు. ఆ బాణం అంటే మన షర్మిలమ్మ తెలంగాణాపైకి రివ్వున అలా దూసుకువెళ్లి నలుగురినీ ఓసారి పరామర్శించేసి తిరిగి వెనక్కి వచ్చేశారు. మళ్ళీ ఇప్పుడప్పుడే వెళ్ళేలాలేరు. ఎందుకంటే పరిస్థితులు అనుకూలించడం లేదు.

 

మొన్నటి వరకు వైకాపా గట్టు మీద కూర్చొని అందరి మీద విరుచుకుపడ్డ రామచంద్ర రావు ఎవరికీ చెప్పాపెట్టకుండా గట్టు దూకేశారు. అంతకు ముందు మరో ఇద్దరు ముగ్గురు జంప్ అయిపోయారు. మళ్ళీ మరో పెద్దాయన శూన్యమాసం అని కూడా చూడకుండా ఈరోజు పార్టీలో నుండి జంప్ చేసేసారు. ఆయన మరెవరో కాదు అశ్వారావుపేట యం.యల్యే. తాటి వెంకటేశ్వర్లు. ఆయన ఉండేది వైకాపాలో అయినా తెదేపా నేత తుమ్మలతో మంచి దోస్తీ ఉండేది. అందుకే ఆయన వెంటే నేనూ సైతం అంటూ తెరాసలోకి వెళ్లిపోయేందుకు బ్యాగ్ సర్దేసుకొని వెళ్ళిపోతున్నారు.

 

గమ్మతయిన విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం పార్టీకి చెందిన వైరా యం.యల్యే. మదన లాల్ తెరాసలోకి దూకేసినప్పుడు, అయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఈయనే ఓ లేఖ వ్రాసి పట్టుకొని వెళ్లి స్పీకర్ మధుసూధనాచారి చేతిలో పెట్టి వచ్చేరు. కానీ ఇప్పుడు ఈయనే ఆ పార్టీలోకి దూకేస్తున్నారు. ఇక వైకాపాకు తెలంగాణాలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఒక్కరే మిగిలారు. కనుక ఇప్పుడు ఆయన వెళ్లి తాటి మీద అనర్హత వేటు వేయమని స్పీకర్ ని కోరుతారేమో. కానీ ఆయన కూడా బ్యాగ్ సర్దేసుకొన్నారని, కాకపోతే కాస్త వారం వర్జ్యం చూసుకొని వెళదామని ఆగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా వెళ్ళిపోతే ఇక వైకాపాకు తెలంగాణా శాసనసభతో పనుండదు. ప్చె! ఏమిటో...వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో అన్ని పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయని జోస్యం చెపితే అన్నిటి కంటే ముందుగా వైకాపాయే తుడిచిపెట్టుకుపోతోంది. కానీ తెలంగాణాలో వైకాపా ఖాళీ అయిపోతున్నా, జగనన్న కానీ ఆ పార్టీ నేతలు గానీ ఏనాడూ కించిత్ బాధపడినట్లు లేదు. బహుశః వైకాపాను తెరాసలో విలీనం చేస్తున్నామని భావిస్తున్నారో ఏమో?

 

ఆంధ్రాలో కూడా సేమ్ టు సేమ్ పరిస్థితే కనబడుతోంది. కొంత మంది బీజేపీ తీర్ధం పుచ్చుకొని తరిస్తుంటే మరికొంతమంది తెదేపా కండువాలు కప్పుకోవాలని తహతహలాడుతున్నారు. బహుశః ఇదంతా చూసే కాబోలు ఎక్కడో మధ్యప్రదేశ్ లో ఉండే అజిత్ జోగీ అనే కాంగ్రెస్ పెద్దాయన జగన్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేస్తే బాగుంటుందని ఒక ఉచిత సలహా ఇచ్చేరు. నిప్పులేనిదే పొగరాదు కనుక తెర వెనుక అటువంటి ప్రయత్నాలు ఏమయినా జరుగుతున్నాయేమోనని అనుమానించక తప్పడం లేదు. ఇలాగయితే వచ్చేఎన్నికల తరువాత జగనన్న ముఖ్యమంత్రి అవడం, రాజన్న రాజ్య స్థాపన చేయడం, స్వర్ణ యుగం తీసుకురావడం ఎలాగో అర్ధం కావడం లేదు.

By
en-us Political News

  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.