శవ రాజకీయం.. బూమరాంగ్ అవుతున్న వైసీపీ ట్రేడ్ మార్క్ వ్యూహాలు?

Publish Date:Jul 17, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా శవరాజకీయం అంశం చర్చనీయాంశంగా మారింది.   రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా,  ఎవరైనా అనుమానాస్పద స్థితిలో మరణించినా వెంటనే  రాజకీయ కోణంలో చిత్రీకరించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందన్న భావన జనబాహుల్యంలోనే వ్యక్తం అవుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే..  ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు. 

ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే, రాష్ట్రంలో సంభవించే ప్రతి చావునూ వైసీపీ  తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత కక్షలు, భూ వివాదాలు, కుటుంబ తగాదాలు లేదా ఆర్థిక లావాదేవీల వల్ల జరిగే నేరాలకు కూడా  రాజకీయ రంగు పులిమే ప్రయత్నం జరుగుతోంది. చనిపోయిన వ్యక్తి తమ పార్టీకి చెందిన కార్యకర్త అని, అధికార పార్టీ నాయకుల వేధింపుల వల్లే ఈ ఘోరం జరిగిందని వైఎస్సార్సీపీ అగ్రనాయకత్వం నుంచి స్థానిక నేతల వరకు అంతా ఒకే రాగంతో ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఇలాంటి ఆరోపణల ద్వారా కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనేదే వైసీపీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

అయితే..  ఈ తరహా   ప్రచారాలు చాలా సందర్భాల్లో వైసీపీకి బూమరాంగ్ అవుతున్నాయంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే..  ఏదైనా ఒక ఘటన జరిగిన వెంటనే దానికి రాజకీయ రంగు పూసినప్పటికీ, ఆ తర్వాత పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. నిందితులు,  బాధితుల మధ్య ఉన్న పాత పగలు, వ్యక్తిగత వివాదాలే ఆయా నేరాలకు కారణమని ఆధారాలతో సహా తేలిపోతోంది. కొన్ని సందర్భాల్లో స్వయంగా బాధితుల కుటుంబ సభ్యులే మీడియా ముందుకు వచ్చి, తమకు ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవని, ఇది పూర్తిగా వ్యక్తిగత గొడవ అని స్పష్టం చేస్తున్నారు. దీంతో ప్రాథమిక సమాచారాన్ని సరిచూసుకోకుండానే శవాల వద్దకు వెళ్లి ధర్నాలు చేయడం, నిరసనలు తెలపడం వల్ల వైఎస్సార్సీపీ తీవ్రంగా ఆభాసుపాలవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక డిజిటల్ యుగంలో సమాచారం  వేగంగా ప్రజలకు అందుతోంది. ఒకప్పుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఒక విషయాన్ని ప్రచారం చేస్తే, అదే నిజమని నమ్మే పరిస్థితి ఉండేది. కానీ నేడు సోషల్ మీడియా,  స్థానిక సమాచార వ్యవస్థల వల్ల ప్రతి ఒక్కరికీ క్షణాల్లో అసలు విషయాలు తెలిసిపోతున్నాయి. సంఘటన జరిగిన ప్రదేశంలో వాస్తవంగా ఏం జరిగిందనేది స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. దీంతో వైసీపీయుల  ఆరోపణల్లో నిజానిజాలు ఎలాంటి జాప్యం లేకుండా జనబాహుల్యంలోకి వేగంగా చేరిపోతున్నాయి.  దీంతో   నిజానిజాలు తెలుసుకోకుండా కేవలం శవ రాజకీయాలు చేయడమే లక్ష్యంగా వైసీపీ వేస్తున్న అడుగులు అపహాస్యం పాలౌతున్నాయి.   

 2019 ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని కీలక పరిణామాలు, మరణాలు, దాడుల ఉదంతాలను  వైసీపీ అప్పట్లో  తమకు అనుకూలంగా సానుభూతి కలిగేలా మరల్చుకోగలిగింది. కోడి కత్తి, వైఎస్ వివేకా హత్య వంటి సంఘటనలు అప్పట్లో   వైసీపీకిగా అనుకూలంగా మారియి. ఆ తరువాత అసలు విషయాలు జనంలోకి వెళ్లాయనుకోండి అది వేరే సంగతి. ఇప్పుడు కూడా వైసీపీ అదే ఫార్ములానుఅమలు చేయాలని చూస్తోంది కానీ ఫలితం మాత్రం ఉండటం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    

AP politics, YS Jagan, TDP Alliance government, Law and order, Andhra Pradesh

By
en-us Political News

  
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.