నారావారి కోటకు బీటలు పెడుతున్న జగన్

Publish Date:May 3, 2012

Advertisement

తెలుగుదేశంపార్టీ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఆ పార్టీ నుంచి పలువురు నాయకులు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. మరికొందరు సీనియర్లు కూడా అదే బాట పట్టడంతో చంద్రబాబునాయుడు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఈ వలసలు నిరోధించేందుకు, ఉప ఎన్నికలపై వ్యాహాన్ని చర్చించేందుకు ఆయన నాలుగో తేదీన పొలిట్ బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణాలో చంద్రబాబు నాయుడు అనుసరించిన రెండుకళ్ళ సిద్ధాంతం దారుణంగా విఫలమైంది. ఆ ప్రాంతంలోని పది జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎన్నడూ లేనంతగా దిగజారిపోయింది.

 

 

ఇది చాలదన్నట్లు తెలంగాణా ప్రాంతంలోని ముఖ్యనాయకులతో పాటు ఆంధ్రా, రాయలసీమలోని సీనియర్లు కూడా వలస బాటను పడుతున్నారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్ నేత సాంబారి తమ్మారావు టిడిపి విధానాలకు నిరసనగా పార్టీకి రాజీనామా చేశారు. పరకాల ఉప ఎన్నికల్లో తమ్మారావుకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. విజయనగరం జిల్లాకు చెందిన గద్దె బాబూరావు టిడిపికి గుడ్ బై చెప్పి జగన్ పంచన చేరారు. ప్రకాశం జిల్లాలో మాజీమంత్రి గొట్టిపాటి హనుమంతరావు తనయుడు నర్సయ్య కూడా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో చేరారు.

 

పార్టీ సీనియర్లు మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా త్వరలో తెలుగుదేశంపార్టీని వదిలేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణాజిల్లాకు చెందిన పొలిట్ బ్యూరో సభ్యురాలు, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఉప్పులేటి కల్పన కూడా అధినేత తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలో ఆమె కూడా పార్టీని వీడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. విజయవాడ అర్బన్ టిడిపి అధ్యక్షుడు వల్లభనేని వంశీ విజయవాడలో జగన్ ను రోడ్డుపై కలుసుకుని బహిరంగంగా ఆలింగనం చేసుకోవడం తెలుగుదేశంపార్టీలో తీవ్ర కలకలం సృష్టించింది. జగన్ ను కలుసుకున్నందుకు వంశీకి పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. గుడివాడ శాసనసబ్యుడు, హరికృష్ణ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని పార్టీ అధినేతపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు నాయుడు దురుద్దేశ్యంతో హరికృష్ణను పార్టీ వ్యవహారాల నుంచి ప్రక్కన పెడుతున్నారని కొడాలి నాని ఆరోపిస్తున్నారు.

 

నందమూరి వంశానికి చెందిన పురందీశ్వారి కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్రమంత్రిగా ఉన్నారు. పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. హరికృష్ణను మరింత రెచ్చగొడితే ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి దూరమైపోవచ్చునని ఆ పార్టీ నాయకులు కలవర పడుతున్నారు. ఈ పరిణామాలతో తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర కలవరానికి గురవుతున్నట్లు తెలిసింది.

By
en-us Political News

  
 తాను స్పీకర్ ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడానంటూ వచ్చిన ఆరోపణలను తాతా మధు ఖండించారు.  తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను అధికార కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని  ఆరోపించారు.
ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో, సీఎం కార్యాలయం తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది. 
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం   భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు   దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ  విధానాలపై  పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు.  ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు,  రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. 
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న  వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని   పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో  బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది.   ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని   బలహీనపరిచింది. 
గత పుష్కర కాలంగా  ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో  మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో  అధికారుల కమిటీ  సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.