నైతిక విలువలా? అంటే ఏంటి తలసానీ?

Publish Date:Dec 16, 2014

Advertisement

 

తెలంగాణా కోసం ఉద్యమించిన తెరాస నేతలకు, ఉద్యమకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీలో నుండి బయటకు వచ్చి తెరాసలో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావులకు మాత్రం మంత్రి పదవులు కట్టబెట్టారు. నిజానికి వారిరువురూ ఆ షరతు మీదే పార్టీ మారినట్లు వార్తలు వచ్చేయి. తెదేపా తరపున శాసనసభకు ఎంపికయిన తలసాని తదితరులు పార్టీ ఫిరాయించినందుకు వారిపై అనర్హత వేటు వేయాలని తెదేపా కోరడం, స్పీకర్ వారికి నోటీసులు జారీ చేయడం గురించి అందరికీ తెలిసిందే.

 

తెరాసలోకి మారి మంత్రిపదవి సంపాదించుకొన్న తలసాని యాదవ్ ఈ అనర్హత వేటు తప్పించుకొనేందుకు తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసారు. లేకుంటే ఆయనపై అనర్హత వేటు పడితే మంత్రి పదవి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అదీగాక ఆయన ఇప్పుడు తెదేపా శాసనసభ్యుడిగా కొనసాగే పరిస్థితి కూడా లేదు. కొనసాగితే ప్రతిపక్షాలకు, ముఖ్యంగా తెదేపా సందించే ప్రశ్నలకు, విమర్శలకు జవాబు చెప్పుకోవడం ఆయనకీ, ప్రభుత్వానికీ కూడా చాలా కష్టమవుతుంది. అందుకే ఆయన మంత్రి పదవి చేప్పట్టే ముందే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసారు. అయితే ఆయన దానికి ‘నైతిక విలువల’ రంగులద్దే ప్రయత్నం చేయడం అందరికీ నవ్వు కలిగిస్తుంది.

 

తను నైతిక విలువలకు కట్టుబడే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసానని ఆయన చెప్పుకొన్నారు. నైతిక విలువల గురించి తను వేరేవారి దగ్గరో పాటాలు నేర్చుకోనవసరం లేదని అన్నారు. మంత్రి పదవి కోసమే పార్టీ ఫిరాయించానని ఎవరేమనుకొన్నా తను పట్టించుకోనని అన్నారు. కానీ తనపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించబోనని ఒక హెచ్చరిక కూడా జారీ చేసారు. చంద్రబాబు కూడా నోరు అదుపులో ఉంచుకొంటే మంచిదని అన్నారు. ఆయన మంత్రి పదవి చేప్పట్టబోతున్నందుకు చాలా ఆనందంపడిన ఆయన తల్లిగారు, తనకు పెద్దకొడుకు వంటి చంద్రబాబు నాయుడికి తన కొడుకు దూరం కావడం తనకు చాలా బాధ కలిగిస్తోందని చెప్పడం గమనిస్తే తలసాని ఏమి కోల్పోయారో అర్ధమవుతుంది.

 

ఆయన మంత్రి పదవి కోసమే తను పార్టీ ఫిరాయించానని ఎవరేమనుకొన్నా తను పట్టించుకోనని చెప్పుకోవడం ద్వారా ఆ ఆరోపణలు నిజమని ఆయనే స్వయంగా దృవీకరిస్తున్నట్లుంది. తనకు సమాజంలో ఈ హోదా, గౌరవం కలిగించిన పార్టీని మంత్రి పదవి కోసమే వీడినప్పుడే ఆయన నైతిక విలువలను తుంగలో తొక్కారు. అటువంటప్పుడు ఆయన నైతిక విలువలు కాపాడేందుకే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసానని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

 

రాజకీయ నాయకులు పార్టీలు మారితే జానాలు ఆశ్చర్యపోయే రోజులు ఎప్పుడో పోయాయి. మారకపోతేనే వారు ఆశ్చర్యపోతుంటారు. అటువంటప్పుడు నైతిక విలువలను కాపాడేందుకే తన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసానని తలసాని చెప్పుకోవడం కూడా అనవసరం. ఇప్పుడు మన రాజకీయ వ్యవస్థలో నేతలు తమను తాము సమర్దించుకొనేందుకు అవసరమయిన కొన్నిమూస పద్దతులు, కొన్ని నిశ్చితమయిన వాదనలు, వాటికి అవసరమయిన పడికట్టు పదాలు అన్నీ సిద్దంగా ఉన్నాయి. కనుక నేతలందరూ ఇటువంటి సందర్భాలలో వాటి నుండి తమకు అవసరమయిన పాయింట్లు, పద్దతులు, పదాలు ఏరుకొని మీడియా ముందుకు వచ్చి తదనుగుణంగా చిలకల్లా వల్లె వేస్తుంటారు. ఆ మూస పద్దతులను, పడికట్టు పదాలను ఉపయోగించడం వలన పెద్దగా విమర్శల బారిన పడకుండా తప్పించుకోగలుగుతున్నారు.

 

తలసాని కూడా అటువంటిదే ‘నా హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకోనేందుకే పార్టీ మారానని’ పద్ధతి ప్రకారం బాగానే చెప్పినప్పటికీ ఈ ‘నైతిక విలువల’ సంగతి ఎత్తడం వల్ల ఇంత ఆలోచించవలసి వచ్చింది. లేకుంటే ఆయనని కూడా నలుగురితో నారాయణ అనేసి ఊరుకొనేవారు.

By
en-us Political News

  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.