గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి గట్టిమద్దతుదార్లుగా ఉన్న కాపు సామాజికవర్గంలోని చాలామంది నాయకులు ప్రస్తుతం ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గడిచిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కనపెట్టింది. ఈ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సుమారు 20 వేలమంది కాపు ఓటర్లు ఉన్నారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ వర్గాన్ని పూర్తిగా విస్మరించింది.
పార్టీకి గత 28 ఏళ్ళుగా సేవలందించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా ఇవ్వకుండా అవమానించారు. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఆయన అనుమానిస్తున్నారు. ఉమ్మారెడ్డికి జరిగిన అవమానంతో గుంటూరు జిల్లాలోని కాపులు రగిలిపోతున్నారు. ఉమ్మారెడ్డితో పాటు జిల్లాలో
ఇదే వర్గానికి చెందిన శనక్కాయల అరుణ, సాంబశివరావు లాంటి నాయకులు కూడా పార్టీని వదిలివెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, వంగవీటి రాధాకృష్ణను అక్కున చేర్చుకున్నారు. తాను రాముడిని అయితే రాధ లక్ష్మణుడని ఆయన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని బహిరంగంగా జగన్ చేసిన ప్రకటన కాపు సామాజిక వర్గాన్ని ఎంతో ఆకర్షిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టిసారిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/strong-cadre-for-tdp-in-guntur-district-24-13832.html
ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో, సీఎం కార్యాలయం తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది.
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!