మహబూబ్ నగర అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన బిజెపి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపిలకు ప్రత్యామ్నాయశక్తిగా ఎదగటానికి వ్యూహాలు రచిస్తోంది. భీమవరంలో జరిగిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ మేరకు పార్టీ రాష్ట్రనాయకులు సుదీర్ఘచర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఉప ఉన్నికల అనంతరం సీమాంధ్రలో 'జైఆంధ్ర' ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో చేపట్టాలని బిజెపి నిర్ణయించింది. ఇప్పటికే పలు సీమాంధ్ర జిల్లాల్లో జైఆంధ్ర సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజాభిప్రాయాన్ని మాత్రం పెద్దగా ప్రభావితం చేయలేకపోయారు.
అందుకే ఉప ఎన్నికల తరువాత సీమాంధ్రలో సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతోపాటు తెలంగాణలో కూడా పార్టీని మరింత బలోపేతం చేయాలని బిజెపి నిర్ణయించింది. వచ్చే ఉప ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాదన్న ధీమాతో ఆ పార్టీ ఉంది. రాష్ట్రంలో జగన్ ప్రభావం కారణంగా కాంగ్రెస్, టిడిపిలు బలహీనపడ్డాయని, అందువల్ల ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగటానికి ఇదే మంచి తరుణమని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-is-ready-to-fight-against-cong-and-tdp-in-elections-24-13833.html
ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో, సీఎం కార్యాలయం తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది.
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!