పవన్ ఏంటో... కాకినాడ సభ క్లారిటీ ఇచ్చిందా?

Publish Date:Sep 10, 2016

Advertisement

పవన్ కళ్యాణ్... ఈ పేరు సినిమా ప్రపంచంలో సంచలనం! మెగాస్టార్ తరువాత అంతటి ఫాలోయింగ్ సంపాదించుకున్న విలక్షణ స్టార్ పవన్ కళ్యాణ్. అదే ఆయన రాజకీయాల్లోకి వస్తే కూడా కలకలానికి కారణమైంది. ప్రజారాజ్యం టైంలో యువరాజ్యం నాయకుడిగా పవన్ కళ్యాణ్ బాగానే వేడి రాజేశాడు. ఆయన అప్పట్లో అన్న పంచెలు ఊడదీసే డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగే! ప్రజారాజ్యం కాంగ్రెస్ లో అస్తమించటం , చిరంజీవి అదే పార్టీలో హస్తమించటం మనకు తెలిసిందే. కాని, ఎంజీఆర్, ఎన్డీఆర్ ల కాలం చెల్లిపోయిందనీ, ఇప్పుడు సినిమా వాళ్లు సీఎంలు అయ్యే ఛాన్స్ లు దాదాపు లేవని మాత్రం ఆయన నిరూపించారు. మెగాస్టార్ గా మొదలై కేంద్ర మంత్రిగా పొలిటికల్ ఇన్నింగ్స్ ముగించారు. పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పకున్నా ప్రస్తుతం 150వ సినిమా చేస్తూ అచ్చొచ్చిన యాక్టింగ్ తిరిగి ప్రారంభించారు!

అన్నయ్య కథ ఎక్కడో మొదలై ఎక్కడో ఆగితే తమ్ముడు పవన్ కళ్యాణ్ తన కథని ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడెక్కడికో తీసుకెళుతున్నాడు. ప్రజారాజ్యం ఎపిసోడ్ తరువాత చాన్నాళ్లు సైలెంట్ అయిపోయాడు. మళ్లీ జనసేన అంటూ 2014 ఎన్నికల ముందు మన గబ్బర్ సింగ్ ప్రత్యక్షమయ్యాడు. తన పార్టీ వున్నా అభ్యర్థుల్ని రంగంలోకి దింపకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికాడు. ఇక్కడ నుంచే పవన్ రాజకీయ అపరిపక్వత కనిపిస్తూ వస్తోంది! కమ్యూనిస్ట్ అయిన చేగువేరా నుంచి ప్రేరణ పొందుతూ బీజేపి లాంటి సంప్రదాయవాద పార్టీతో జతకట్టడం ఆయన లాజిక్కే అందే విషయం. అంతే కాదు, మోదీ, బాబులకు అదికారం ఇప్పించి మరోసారి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు!

ఎన్నికల తరువాత తన మానానా తాను సినిమాలు చేసుకుని ప్రశ్నించటం ఏమైంది అంటే సమాధానం ఇవ్వలేదు పవన్. కాని, రెండున్నర ఏళ్ల తరువాత భారీ స్థాయిలో జనం ముందుకు వచ్చేశాడు. అప్పుడప్పుడూ రాజధాని రైతుల బాగోగుల గురించి మాట్లాడినా మొన్నటి తిరుపతి సభ సమయంలోనే మళ్లీ ఫుల్ టైం గా జనం ముందుకొచ్చాడు జనసేనాని!
అసలు ఒక అభిమాని చనిపోతే వెళ్లి అక్కడికక్కడే బహిరంగ సభ పెట్టడం ఏంటి? ఇది కొందరు డైనమిజం అంటుండవచ్చు. కాని, రాజకీయాల్లో ఇలాంటి ఆవేశం మంచిది కాదు. హడావుడిగా సభ పెట్టిన ఆయన ఆ రోజు పెద్దగా ఏం తేల్చకుండానే కాకినాడ సభలో అంతా చెబుతానన్నాడు. మూడు దశల్లో పోరాటం అని కూడా ప్రకటించాడు. అంతా పవన్ క్లారిటీతో వున్నాడనే భావించారు. కొందరైతే జనసేన పార్టీలో తమ బెర్త్ ల కోసం ఖర్ఛీఫులు కూడా రెడీ చేతిలో పట్టుకున్నారు. 
రాష్ట్రంలో ప్రధాన సమస్య హోదానే కావచ్చు. కాని, పవన్ ప్రత్యేక హోదాని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మిగతా వాట్ని కూడా వాడుకుంటే బావుంటుంది. కాని, కాపుల రిజర్వేషన్ లాంటి కీలకమైన అంశం కూడా ఎంత మాత్రం పట్టించుకోకుండా వుండిపోయాడు పవన్ కళ్యాణ్. అదే కాకినాడ సభలో అందర్నీ నిరాశపరిచింది. 

పవర్ స్టార్ కాకినాడ సభ కంటే ముందే కేంద్రం తనకు వీలున్నంత లాభదాయకమైన ప్యాకేజ్ ప్రకటించేసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనివార్యంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. ప్రతిపక్ష వైసీపీ హోదానే కావాలంటూ అసెంబ్లీలో , బయట రచ్చ చేస్తోంది. ఇందరి మధ్యా పవన్ మరోసారి హోదా కావాల్సిందేనని అన్నాడు. బీజేపిని బాగా టార్గెట్ చేశాడు. కాని, టీడీపీ పట్ల కాస్త మెతకగా వున్నట్టు కనబడ్డాడు. అదంతా పక్కన పెడితే ఏవో రెండు పాచిపోయిన లడ్డూలు అన్నాడు. అవేంటో చివరిదాకా చెప్పలేదు. ఇక సభ ప్రారంభంలోనే ఏ దేశమేగినా అంటూ పాట పాడి... అది గురజాడ రాశాడంటూ తప్పుగా చెప్పాడు. దాన్ని రాసింది రాయప్రోలు సుబ్బారావు. ఇలా ఎంత మాత్రం ప్లానింగ్, ప్రిపరేషన్ లేకుండా పవన్ కాకినాడ వ్యవహారం కానిచ్చేశాడు! అవంతీ శ్రీనివాస్ ను రాజీనామ చేయమనటం మొదలు టీజీ వెంకటేష్ ను విమర్శించటం వరకూ ఏ దిక్కు, దిశా లేకుండా సాగింది పవన్ ఉపన్యాసం. 

గొంతు చించుకుని అరుస్తూ పవన్ ఎంతగా పంచ్ డైలాగ్స్ వేసినా కాకినాడ సభలో అసలు పాయింట్ మిస్సైపోయింది. కనీసం ప్రత్యేక హోదా కోసం జరిగే బంద్ లో పాల్గొనాలా వద్దా వంటి విషయం కూడా క్లియర్ గా చెప్పలేదు పవన్ కళ్యాణ్. మూడు దశల్లో పోరాటం కూడా చర్చలోకి రాలేదు. తరువాతి సభ ఎక్కడా అన్నది ఎవ్వరికీ తెలియదు! సభ అనంతరం ఒక అభిమాని చనిపోవటంతో ఇక మీదట తాను సభలు పెట్టనని పవన్ అన్నట్టు సమాచారం. అదే నిజమైతే పవన్ అస్థిమితమైన నిర్ణయాలకి ఇది మరో తార్కాణం. రెండు సభలు ఆవేశంగా పెట్టేసి ఇక మీదట అలాంటివి వుండవు అంటే భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ప్రస్తుతానికి సస్పెన్స్! అంతేనా? ఇలా అయితే, జనం సమస్యలు తీరేదెప్పుడు, వాటి కోసం జనసేన, జనసేనాని పోరాడేదెప్పుడు? ఏ పద్ధతిలో పోరాటం నడుస్తుంది? 

కాకినాడ సభతో పవన్ చాలా వరకూ తనని నమ్ముకున్న వారికి భ్రమలు తొలిగించాడు. కలగాపులంగా స్పీచ్ ఇచ్చి ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో తాను ఉధృతంగా దూసుకొస్తాడన్న ఆశల్ని ఆవిరి చేశాడు! ముందు ముందు మరీ అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప పవన్ రాజకీయంగా కింగో, కింగ్ మేకరో అవ్వటం కష్టం...  
 

By
en-us Political News

  
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీని వెనుక వైసీపీ 2029 ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పు కాదనీ, 2029 ఎన్నికల దిశగా వైసీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోందంటున్నారు.
రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదు. అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని గుర్తించని, లేదా గుర్తించడానికి ఇష్టపడని జగన్.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారు
జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన  వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై వంశీ నోరు పారేసుకున్న తీరు  అప్పట్లో సంచలనం సృష్టించింది.
ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ సారి ఇంట గెలవాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన తాను బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా సత్తా చాటి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు.
సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించడం రివాజే. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎంతో దోహదపడతాయి. అయితే భోగాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశంసల హద్దులు దాటిపోయాయన్నది పరిశీలకుల విశ్లేషణ.
ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  
పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.