ఉత్తరాంధ్రాలోని విజయనగరం జిల్లాలో చాలాకాలం తరువాత మళ్ళీ మావోయిస్టుల ఉనికి కనిపిస్తోంది. ఇప్పటికే ఆంద్ర-ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో యుద్ధవాతావరణం నెలకొని ఉంది. ఒడిస్సాలో మావోయిస్టులు కిడ్నాపులకు పాల్పడి తమ సహచరులను జైళ్ళనుంచి విడిపించుకుంటున్నారు. ఇదే వ్యూహాన్ని విజయనగరంలో కూడా అమలు చేసేందుకు మావోయిస్టు గెరిల్లా దళాలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీంతో జిల్లా పోలీసుయంత్రాంగం అప్రమత్తం అయింది. నక్సల్స్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక సాయుధబలగాలు రంగంలోకి దిగి కూంబింగ్ ప్రారంభించాయి. దీనికి తోడు అధికారులు ఎవరూ సమాచారం ఇవ్వకుండా గ్రామాల్లోకి వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకునేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఏదో ఒక చోట భారీ విధ్వంసానికి కానీ, పెద్దేత్తున దాడులకు కానీ పూనుకోవచ్చునని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/maoists-base-in-vijayanagaram-district-24-13887.html
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!