నిన్నమొన్నటి వరకూ ప్రత్యేక తెలంగాణా కోసం చేయి చేయి కలిపి ఉద్యమించిన తెలంగాణా రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు ఇప్పుడు పరస్పరం కలహించుకుంటున్నాయి. ఈ పార్టీల నాయకులు చీటికీ మాటికీ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. పాలమూరులో టి.ఆర్.ఎస్. అభ్యర్థిని బిజెపి అభ్యర్థి ఓడించినప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య తెలంగాణాప్రాంతంలో వైరం ప్రారంభమైంది. పాలమూరులో బిజెపి గెలుపును టి.ఆర్.ఎస్. జీర్ణించుకోలేకపోతోంది.
ఇప్పటిదాకా తెలంగాణా సెంటిమెంట్ కు తమ గుత్తాధిపత్యంగా భావించిన టి.ఆర్.ఎస్. ఇకపై తమకు బిజెపి పోటీగా మారుతుందని భయపడుతుంది. బిజెపి జాతీయపార్టీ కావటం, ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక తెలంగాణా కు మద్దతు పలకటంతో తెలంగాణా ప్రజలు కూడా ఆ పార్టీని విశ్వ సిస్తున్నారు. కేంద్రలో బిజెపి అధికారంలోకి వస్తే వెంటనే తెలంగాణా ఇస్తామని ఆ పార్టీ జాతీయనాయకులు పదేపదే ప్రకటిస్తున్నారు. మరోవైపు టి.ఆర్.ఎస్. వ్యవహారశైలి, తెలంగాణా సాధనకు ఆ పార్టీ విధిస్తున్న డెడ్ లైన్ లు తెలంగాణా ప్రజలకు విసుగుకలిగిస్తున్నాయి. ఇది గమనించిన టి.ఆర్.ఎస్. హఠాత్తుగా వ్యూహాన్ని మార్చుకుంది. అవకాశం దొరికి నప్పుడల్లా బిజెపి నాయకులపై విమర్శలు గుప్పిస్తోంది. బిజెపి లాంటి మతతత్వ పార్టీలకు తెలంగాణా తెచ్చే సామర్థ్యంలేదని ఎద్దేవా చేస్తోంది. అయితే తమపై లేనిపోని ఆరోపణలు చేస్తూ దాడులకు పాల్పడుతున్న టి.ఆర్.ఎస్. నాయకులను ప్రజలే తిప్పికొడతారని బిజెపి అంటోంది. టి.ఆర్.ఎస్. పుట్టుక ముందునుంచే తెలంగాణా విద్యావంతుల వేదిక, జనసంఘ్ లు ప్రత్యేక తెలంగాణా కోసం పోరాడుతున్న విషయం కేసీఆర్ గుర్తుంచుకోవాలని వారు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/abuses-between-trs-and-bjp-24-13781.html
కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు కేసీఆర్ ఫాంహౌస్ను ముట్టడికి పిలుపు నిచ్చారు. ఆ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య దాదాపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నినాదాలతో సభ మార్మోగింది. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ పావుగంట సేపు వాయిదా వేశారు.
తాను స్పీకర్ ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడానంటూ వచ్చిన ఆరోపణలను తాతా మధు ఖండించారు. తాను స్పీకర్ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను అధికార కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని ఆరోపించారు.
ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో, సీఎం కార్యాలయం తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది.
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.