సిద్ధార్ధను దేశమే చంపేసిందా?

Publish Date:Aug 2, 2019

Advertisement

 


దేశీయ కాఫీ రుచిని విశ్వ వ్యాప్తం చేసిన కాఫీ బ్రాండ్ అంబాసిడర్ 'కేఫ్ కాఫీ డే' ఫౌండర్ దుర్మరణం ఒక వ్యవస్థీకృత హత్య అనేందుకు పలు కారణాలు ఉన్నాయి. ఆయన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంత తీవ్ర చర్యకు నెట్టివేయబడడానికి కారణాలు ఏమిటి ? ఇంకా నిర్ధారణ కానప్పటికీ ఆయన రాసినట్టుగా భావించబడుతున్న లేఖ అనేక అనుమానాలను లేవనెత్తుతోంది. దేశ వ్యాప్తంగా అనంతమైన ఆవేదనను అంతులేని ప్రశ్నలను మిగిల్చిన సిద్దార్ధ మరణం దేశ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అనేక సమాధానం దొరకని జీవన్మరణ ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రధానంగా ఈ లేఖలో ప్రైవేట్ పెట్టుబడి ప్రదాతలు మరియు ఆదాయ పన్ను అధికారుల వేధింపులు కారణాలుగా కనబడుతున్నాయి. ఈ ప్రైవేటు పెట్టుబడి ప్రదాతలు వారికిచ్చిన వాటాలను తిరిగి కొనుగోలు చేయమని ఒత్తిడి చేయడం ఒక వ్యవస్థీకృత సమస్య. భారత దేశ కార్పొరేట్ రుణ మార్కెట్ ఒక పనికి మాలిన, పనికి రాని పేలవమైన వ్యవస్థ. షేరు విలువ అప్పు తనఖా కంటే తగ్గిపోయినప్పుడు పారిశ్రామికవేత్తలను అకాల మరణానికి నెట్టివేసే మన దేశం యొక్క చట్టపరమైన రుణ మార్కెట్ ఇన్ఫరాస్ట్రక్చర్ ఒక దివాళాకోరు స్థితిలో ఉంది. 

కాఫీ డే మన దేశంలో ఒక సుప్రసిద్దమైన విజయవంతమైన బ్రాండ్. కాఫీ డే అనే పదం నవ భారత పాప్ సంస్కృతిలో, అలాగే యువత జీవన శైలిలో భాగం అయ్యింది. భారత నగరాలూ, పట్టణాలలో యువత హ్యాంగౌట్ స్పాట్ గా స్టార్ట్అప్స్ కి, సమావేశాలకు ఎన్నో ప్రణయ ప్రేమ బంధాలకు వేదికయ్యింది. ఈ బ్రాండ్ నిర్మాత అయిన సిద్దార్ధ.. ఏ అమెరికా లాంటి ఫంక్షనల్ రుణ మార్కెట్ ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఉండి ఉంటే.. అతనికి డబ్బు కానీ ఋణం కానీ సమకూరడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. కానీ మన దేశంలో సిద్దార్థ లాంటి పారిశ్రామిక వేత్తలు.. బంధువులు నుండో, మిత్రుల నుండో పీఈ ప్రొవైడర్స్ నుండో డబ్బు తీసుకోవాల్సి వస్తుంది. పీఈ నిధుల కోసం అయ్యే ఫైనాన్సింగ్ ఖర్చు చాలా ఆధికం. వివిధ కార్పోరేట్ ఆస్తులను తనఖాగా ఇవ్వడానికి తగిన న్యాయపరమైన ఆమోదం లేక పోవడం వలన పీఈ నిధులు ఖరీదు గానూ, ప్రమాదంగానూ మారుతున్నాయి.  చాలా సందర్భాల్లో పీఈ పెట్టుబడులను దోపిడీగానే అనుకోవాలి. ఈ సందర్భంలో పీఈ సంస్థలను నిందించి ప్రయోజనం లేదు. మన దేశంలో ఒక శక్తివంతమైన రుణ మార్కెట్ ని అధివృద్ది చేయాల్సిన అవసరాన్ని సిద్దార్ధ మరణం ముందుకు తెస్తోంది. మంచి పరపతి గల కంపెనీలకి, ట్రిపుల్ ఏ రేటెడ్ పేపర్లతో జంక్ బాండ్ లను జారీ చేయగల రుణ మార్కెట్ ని భారత్ అభివృద్ధి చేయాలి. ఋణం, వడ్డీ, కరెన్సీ వంటి అన్ని రకాల రిస్కులను నిరోధించడంతో పాటు సమర్ధవంతమైన, వేగవంతమైన, చట్టపరమైన రుణ మార్కెట్ కల్పన నేటి తక్షణ అవసరం. అలాగే అధికారులు పన్ను చెల్లింపు దారుల మధ్య సహృద్భావమైన సంప్రదింపులు, సంబంధాలు మరింత మెరుగుపడాలి.

పారిశ్రామిక వేత్తలు దోపిడీ దారులు అనే వామపక్ష దురభిప్రాయ సంస్కృతి నుండి దూరం కావాలి. వామపక్ష భావజాలంతో ప్రభావమైన మీడియా.. పారిశ్రామికవేత్తలను దొంగలుగా చిత్రీకరించే ఒక దురలవాటును వదులుకోవాలి. దేశ ఆర్ధిక అభివృద్ధిలో కీలక భూమిక పోషించే వ్యాపారవేత్తలు దేశ నిర్మాతలనే స్పృహతో వ్యవహరించాలి. ఎన్నో ఆర్ధిక, కుటుంబ, సామాజిక ఒత్తిడులను, రిస్కులను తీసుకుంటూ పెళ్ళాం పుస్తెలు, మిత్రుల నుండి అప్పులు చేసి పలువురికి ఉపాధి కలిపిస్తూ.. ప్రత్యక్ష-పరోక్ష పన్నులు చెల్లిస్తూ మరింత మందికి పరోక్ష ఉపాధిని కల్పిస్తూ.. ఇతర అనుబంధ పరిశ్రమలకి వ్యాపారాన్ని ఇస్తూ, సంపద సృష్టిస్తూ, చందాలు, సామజిక కార్యక్రమాలకి నిధులు ఇస్తూ సమాజం యొక్క నిర్దయకు నిష్టూరానికి, నష్టానికి, కష్టాలకి గురి అవుతూ అంతర్ధానం అయ్యే ఎందరో పారిశ్రామిక వేత్తలకు సిద్దార్ధ ప్రాయోపవేశం ఒక ఉదాహరణ.

By
en-us Political News

  
ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ సారి ఇంట గెలవాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన తాను బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా సత్తా చాటి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు.
సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించడం రివాజే. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎంతో దోహదపడతాయి. అయితే భోగాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశంసల హద్దులు దాటిపోయాయన్నది పరిశీలకుల విశ్లేషణ.
ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  
పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.