political-news-img

పరుగుల వైభవం సూర్యవంశి

ఐపీఎల్ 2026లో భాగంగా గువహటి వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) మధ్య శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పరుగుల వైభవం ముచ్చట గొలిపింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యంతో విరుచుకుపడిన ఈ బుల్లోడు.. బెంగళూరు బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. హుజిల్ వుడ్ వంటి అనుభవజ్ణులైన బౌలర్లను కూడా లెక్క చేయకుండా సిక్సర్ల మోత మోగించాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. రజత్ పాటిదార్ 63 పరుగులు, కృనాల్ పాండ్యా 43 నాటౌట్ రాణించడంతో బెంగళూరు 200 పరుగుల మార్క్ దాటింది. 202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వైభవ్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సరు ఉన్నాయి. వైభవ్ సూర్యవంశి కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. అనుభవజ్ఞులైన జోష్ హేజిల్‌వుడ్ వంటి బౌలర్లను సైతం లెక్క చేయకుండా సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడిన వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ వైభవం స్టేడియాన్ని హోరెత్తించింది. ఆర్సీబీ అభిమానులు సైతం ఈ కుర్రాడి జోరును సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయారు. వైభవ్ విధ్వంసం కారణంగా రాజస్థాన్ రాయల్స్ లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. గతంలోనే అండర్-19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన వైభవ్, ఇప్పుడు ఐపీఎల్ వేదికపైనా తనదైన ముద్ర వేస్తున్నాడు. 15 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కోవడంలో అతను ప్రదర్శిస్తున్న పరిణతిని క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తన అద్భుత ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. అలాగే ఆరెంజ్ క్యాప్ రేసులోనూ ముందంజలో నిలిచాడు.

Publish Date: Apr 11, 2026 10:49AM

political-news-img

వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌కు జైలు శిక్ష

వైసీపీ సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు విశాఖ రైల్వే కోర్టు జైలు శిక్ష విధించింది. దాదాపు ఎనిమిదేళ్ల కిందటి కేసులో ఆయనకీ శిక్ష పడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనను దోషిగా తేల్చిన అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి, ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వెళితే.. 2016 ఏప్రిల్ నెలలో విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం అమర్‌నాథ్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఆ క్రమంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అప్పట్లో పోలీసులు బలవంతంగా ఆయనను అదుపులోకి తీసుకుని చికిత్స కోసం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ సందర్భంగా అమర్‌నాథ్ ప్రాణహాని కలిగించుకునేలా వ్యవహరించారని పేర్కొంటూ అప్పట్లో టూటౌన్ పోలీసులు ఆయనపై ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై సుదీర్ఘ కాలం పాటు విచారణ కొనసాగింది. ఇరుపక్షాల వాదనలు విన్న రైల్వే కోర్టు, తాజాగా గుడివాడ అమర్ నాథ్ కుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై గుడివాడ అమర్‌నాథ్ స్పందిస్తూ.. ప్రజల సమస్యల కోసం, ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ కోసం తాము చేసిన పోరాటంలో ఇటువంటి ఇబ్బందులు ఎదురవ్వడం దురదృష్టకరమన్నారు. రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే, దీనిపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చెప్పిన గుడివాడ అమర్నాథ్ హైకోర్టులో తమకు న్యాయం జరుగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు.

Publish Date: Apr 11, 2026 10:31AM

political-news-img

ఐపీఎల్‌ 2026.. జూనియర్ ధోని.. ముకుల్ చౌదరి

ఐపీఎల్ 2026 సీజన్ భారతీయ యువ క్రికెటర్ల అద్భుత ప్రదర్శనలకు వేదికగా నిలుస్తోంది. వైభవ్ సూర్యవంశీ, సమీర్ రిజ్వీ, ప్రియాంష్ ఆర్య, అంగ్‌క్రిష్ రఘువంశీ వంటి యువ ఆటగాళ్లు తమ దూకుడైన బ్యాటింగ్, బౌలింగ్‌తో సంచలనం సృష్టిస్తున్నారు. అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, అండర్-19 ప్రతిభావంతులు మెగా లీగ్‌లో అనుభవజ్ఞులను అధిగమిస్తూ, కీలకమైన మ్యాచుల్లో విజయావకాశాలను మారుస్తూ రికీ పాంటింగ్ వంటి కోచ్‌ల ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా ఐపీఎల్ ప్లాట్‌ఫారమ్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కుర్రాడు ముకుల్ చౌదరి అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లోనే 54 పరుగులతో నాటౌట్‌‌గా నిలిచి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు అనూహ్య వియజం అందించాడు. అందులో ఏకంగా 7 సిక్సర్లు ఉండటం విశేషం. కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుపు ఖాయమని అనుకుంటున్న సమయంలో ఎల్ఎస్‌జీకి హీరోలా వచ్చాడు ముకుల్. పరుగుల దాహంలో విరాట్ కోహ్లీ.. ఫినిషర్‌లో ధోనిని తలపించేలా అద్భుతమైన షాట్లతో విరుచుకుపడుతూ.. కేకేఆర్ నుంచి గెలుపును సరదాగా లాగేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఈ 22 ఏళ్ల ముకుల్ చౌదరి స్వస్థలం రాజస్థాన్. తన కొడుకు క్రికెటర్ అవ్వాలని ముకుల్ తండ్రి ఎన్నో కలలు కనేవాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్నతనం నుంచే ఆ దిశగా నడవలేకపోయాడు. ఎలాగైనా తన కుమారుడిని క్రికెటర్‌ని చేయాలనే పట్టుదలతో ముకుల్ తండ్రి.. తమ ఇంటినే అమ్మేసి ఎస్‌బీఎస్ అకాడమీలో చేర్పించాడు. అప్పటికి ముకుల్ వయసు 12 ఏళ్లు. అక్కడే దాదాపు ఐదేళ్లు శిక్షణ తీసుకున్నాడు. అక్కడ నుంచి జైపుర్ వెళ్లి నాలుగేళ్లపాటు ప్రాక్టీస్ చేశాడు. ఓసారి అండర్ 19 మ్యాచులో యూపీపై తన ఆటను చూసిన తర్వాత ముకుల్ తండ్రికి భరోసా వచ్చిందట. 2026 ఐపీఎల్ మినీ వేలంలో ముకుల్ బేస్ ప్రైజ్ రూ.30 లక్షలు. అతడిని లఖ్‌నవూ ఫ్రాంచైజీ ఏకంగా రూ.2.60కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఇంత మంది ప్లేయర్లు ఉన్నప్పటికీ ఫినిషర్ అంటే ముందుగా ధోనినే గుర్తొస్తాడు. అయితే ఫినిషర్‌గా మ్యాచ్‌ను గెలిపించాలంటే తీవ్ర ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుంది. అలాంటి పాత్రలో వచ్చిన ముకుల్.. అద్భుతం చేసి చూపించాడు. 182 పరుగుల లక్ష్య ఛేదనలో 8వ వికెట్‌కు అవేశ్ ఖాన్‌తో కలిసి 24 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అందులో ముకుల్ 21 బంతుల్లో 52 పరుగులు బాదేశాడు. అయితే ముకుల్ చౌదరికి ధోని అంటే చాలా ఇష్టమట. ధోనినే రోల్ మోడల్‌గా తీసుకుని క్రికెట్ అరంగేట్రం చేశాడట. అయితే ముకుల్ కూడా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కావడం కొసమెరుపు. ఈ మ్యాచ్‌లోనూ ధోనిలా ‘హెలికాప్టర్ షాట్’తో సిక్స్ బాదడం.. చివరి ఓవర్లో ఏకంగా రెండు సిక్సర్లు బాది జట్టును గెలిపించి సంచలనంగా మారాడు.

Publish Date: Apr 11, 2026 12:05AM

political-news-img

కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ జీరో బీజేపీ ప్రచారం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇంటి పోరు ముదురుతోంది. ఆమె భర్త పరకాల ప్రభాకర్ తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం ఆయన జీరో బీజేపీ ఇనీషియేటివ్‌ చేపట్టడం గమనార్హం. చెన్నైలోని ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవకూడదని అఖిల భారత ప్రజా ఉద్యమ తమిళనాడు సమన్వయ కమిటీ ఉద్ఘాటించింది. జీరో బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించిన ఆ కమిటీ... 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చూడటమే లక్ష్యమని పేర్కొంది. ఈ కార్యక్రమ నిర్వాహకులలో ఒకరైన డాక్టర్ పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. జీరో బీజేపీ ’ చాలా ముఖ్యమని, ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకే తాను తమిళనాడుకు వచ్చానని పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలంతా ఈ సిద్ధాంతం వైపు నిలబడాలని పిలుపునిచ్చారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు మన రాజ్యాంగ విలువలకు సమాధి కట్టుకోవడమేనన్నారు. ప బీజేపీకి ఓటేస్తే తమిళనాడులో మత సామరస్యం దెబ్బతింటుందని, వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు కలిసిమెలిసి జీవించలేరని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం నాశనమవుతాయని పరకాల హెచ్చరించారు.

Publish Date: Apr 10, 2026 11:55PM

political-news-img

మహిళల భద్రత కోసం షీ నేత్ర

మహిళల గోప్యతకు ముప్పుగా మారుతున్న రహస్య కెమెరాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు హైదరాబాద్ నగరంలో పోలీసులు కొత్త అడుగు వేశారు. ఈ నేపథ్యంలో మహిళా భద్రతకు మరింత బలం చేకూర్చేలా షీ నేత్ర పేరిట ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. నగర కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లకు ఒక్కో బృందం చొప్పున మొత్తం ఏడు ప్రత్యేక టీమ్స్‌ను రంగంలోకి దించారు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఈ బృందాలకు అత్యాధునిక కెమెరా డిటెక్టర్ పరికరాలను అందజేశారు. రహస్య కెమెరాలు, స్పై కెమెరాలు, సెల్‌ఫోన్ కెమెరాలను గుర్తించగల ఈ పరికరాల సహాయంతో నగరవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. షాపింగ్ మాల్స్‌లోని ట్రయల్ రూమ్స్, ఆస్పత్రులు, హోటళ్లు, హాస్టళ్లు, విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాల్లో మహిళల గోప్యతకు భంగం కలిగించే ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఈ సందర్భంగా సజ్జనార్ హెచ్చరించారు. తమ ప్రాంగణాల్లో రహస్య కెమెరాలు లేవని నిర్ధారించుకోవడం ఆయా యాజమాన్యాల బాధ్యత అని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేసి అవసరమైతే సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేసే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సంస్థ తప్పనిసరిగా కస్టమర్ సేఫ్టీ ఇన్‌చార్జ్ ను నియమించి, షీ టీమ్స్‌తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వీరికి పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న వేగంతో పాటు దాని దుర్వినియోగం కూడా పెరుగుతోందనీ, సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్, బ్లాక్‌మెయిలింగ్, ప్రమాదకర ఏపీకే ఫైల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. హార్డ్‌వేర్ రూపంలో సీక్రెట్ కెమెరాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100/112 లేదా షీ టీమ్స్ హెల్ప్‌లైన్ 9490616555కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Publish Date: Apr 10, 2026 11:45PM

political-news-img

సలామి కోల్డ్ స్టోరేజ్‌ ఇండస్ట్రీపై పోలీసుల దాడి... కుళ్ళిన మాంసం స్వాధీనం

హైదరాబాద్ పాతబస్తి బాలాపూర్ ప్రాంతంలో ఉన్న సలామి ఇండస్ట్రీస్‌పై పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడులు స్థానికంగా కలకలం రేపాయి. మదీనా కాలనీలో ఉన్న సలామి కోల్డ్ స్టోరేజ్‌ లో కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కనీస పారిశుద్ధ్యం లేకుండా, మాంస వ్యర్థాలను నిల్వ ఉంచినట్లుగా అధికారులు గుర్తించారు. నిల్వ ఉంచిన మాంసం చాలా భాగం కుళ్లిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. దాడుల్లో భాగంగా భారీ మొత్తంలో అపరిశుభ్ర మాంసం మరియు ఇతర వ్యర్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సలామీ కోల్డ్ స్టోరేజీ ఇండస్ట్రీ యజమానిపై కేసు నమోదు చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి మాంస పరిశ్రమలు మరెన్నో ఉన్నాయని, ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే మరిన్ని దాడులు చేపట్టి ఇలాంటి అక్రమ యూనిట్లను మూసివేయడం సాధ్యమని స్థానికులు అంటున్నారు.

Publish Date: Apr 10, 2026 11:36PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img