political-news-img

తలసీమియా బాధిత బాలుడికి సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం

పమిడిముక్కలలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు పింఛన్లు పంపిణీ.. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చటించిన సీఎం.. పింఛన్ల పంపిణీతో పాటు సంక్షేమంపై దృష్టి... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో పర్యటించారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తలసీమియాతో బాధపడుతున్న 13 ఏళ్ల బాలుడు చాగంటిపాటి వివేక్‌కు రూ.10 వేల పింఛన్ అందించారు. అతని ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వివేక్‌కు తలసీమియా కారణంగా నెలకు మూడు నుంచి నాలుగు సార్లు రక్త మార్పిడి చేయాల్సి వస్తోందని, ఇందుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చవుతోందని కుటుంబ సభ్యులు సీఎంకు వివరించారు. చదువులోనూ వివేక్ చురుకుగా ఉంటాడని, చికిత్సకు సహాయం చేయాలని వారు కోరారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం ముఖ్యమంత్రి పమిడిముక్కల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పింఛన్ల పంపిణీ అనంతరం మరో కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో అంగన్వాడీ కేంద్రం కనిపించడంతో అక్కడ ఆగారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చటించిన సీఎం, వారు పాడిన రైమ్స్‌ను ఆసక్తిగా విన్నారు. పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం గురించి టీచర్లు, ఆయాలను అడిగి తెలుసుకున్నారు.

Publish Date: May 1, 2026 10:26PM

political-news-img

చలాన్ల పేరుతో వాహనాల సీజ్‌పై హైకోర్టు సీరియస్

పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్ చేయొద్దన్న కోర్టు ఆదేశాల అమలుపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు కీలక అధికారులకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసు, రవాణా శాఖల అధికారులపై వివరణ కోరింది. ఈ కేసులో ప్రతివాదులుగా సీవీ ఆనంద్, శివధర్ రెడ్డి, జోయల్ డేవిస్, లింబాద్రిలతో పాటు హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, ట్రాఫిక్ అదనపు సీపీ, రవాణా శాఖ కమిషనర్‌లను పిటిషనర్ చేర్చారు. పెండింగ్ చలాన్లు ఉన్నాయని కారణంగా వాహనాలను సీజ్ చేయొద్దని ఈ ఏడాది జనవరి 20న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చట్టపరమైన విధానాలు పాటించాలని కూడా కోర్టు అప్పట్లో సూచించింది. అయితే ఆదేశాలు ఉన్నప్పటికీ, ఏప్రిల్ 9న మల్లికార్జున అనే వ్యక్తి బైక్‌ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిని కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనగా పేర్కొంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ తరఫున న్యాయవాది విజయ్ గోపాల్ వాదిస్తూ ట్రాఫిక్ పోలీసులు కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని,M-Walletలో RC చూపించినా అంగీకరించడం లేదని, చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో వాహనాలు సీజ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలపై ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన హైకోర్టు, తమ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వచ్చే నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ చలాన్లు, వాహనాల సీజ్ వ్యవహారంపై కీలక ప్రభావం చూపే అవకాశముందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి

Publish Date: May 1, 2026 10:10PM

political-news-img

ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యల పరిష్కారం కోసం సీఎం చొరవ చూపినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు వేమ నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ ఠాగూర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో పలు ఆర్టీసీ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: ఆర్టీసీ సంస్థ అభివృద్ధి, మనుగడ, గౌరవాన్ని పెంపొందిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ముందుకు వచ్చినందుకు కార్మిక సంఘాలను సీఎం అభినందించారు.“నేను వేరు – మీరు వేరు అనే భావన నాకు లేదు. అందరం కలిసే ప్రభుత్వం,” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆర్టీసీ కార్మికులు కోరుకున్నారని, వారి పోరాటాల్లో తాము ఎప్పుడూ తోడుగా ఉన్నామని అన్నారు. ఆర్టీసీలో బస్సులు, నియామకాలు, ఆదాయం పెరిగాయని తెలిపారు. కార్మికుల కృషి వల్లే ఆర్టీసీ దేశంలో ప్రముఖ సంస్థగా నిలిచిందని కొనియాడారు. గాజులరామారంలో 100 ఎకరాల్లో బస్ టర్మినల్, శంషాబాద్‌లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టర్మినల్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. వెయ్యి ఈవీ బస్సులను కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తున్నామని, మినీ బస్సులు కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం డీజిల్‌పై సుమారు రూ. 2000 కోట్లు ఖర్చవుతున్నాయని, ఆ భారాన్ని తగ్గించేందుకు ఈవీ బస్సులపై దృష్టి పెట్టామని వివరించారు. ఆదాయం పెరగాలంటే ఖర్చు తగ్గించుకోవాల్సిందేనని, ఇందుకు పక్కా ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. ఆర్టీసీలో ఉన్న బకాయిలు తమ ప్రభుత్వ కాలానికి చెందినవి కాకపోయినా, వాటిని తీర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టామని చెప్పారు. ఆర్టీసీ సమస్యలు తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. యూనియన్లు, విలీనం వంటి అంశాలపై కార్మిక సంఘాలే చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పీఆర్‌సీ వంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రాజకీయ ప్రభావాలకు లోనైతే సంస్థకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఆర్టీసీ అప్పులపై వడ్డీ భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సంస్థ బలోపేతానికి కార్మికులు సహకరించాలని కోరారు. ఒక డ్రైవర్‌ను కూడా తగ్గించబోమని స్పష్టం చేశారు. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ. 8 వేల కోట్లు ఆర్టీసీకి అందించామని తెలిపారు. సంస్థ అభివృద్ధి కార్మికుల చేతుల్లోనే ఉందని, డిపో మేనేజర్లతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలని అధికారులకు సూచించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు కృషి చేస్తున్నామని, ఈసారి రూ. 1000 కోట్ల బకాయిలు విడుదల చేశామని తెలిపారు. ఆర్టీసీ సమస్యలను శాతం 100 పరిష్కరిస్తామని హామీ ఇస్తూ, కార్మికుల వెంట ప్రభుత్వం ఉంటుందని చెప్పారు.“సంస్థ ఆగిపోతే అది ఊపిరి ఆగినట్లే. సంస్థకు నష్టం కలిగించే చర్యలు చేయొద్దు,” అని సూచించారు.ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల హక్కులను కాపాడుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల మూడు రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలనీ, సమ్మె సమయంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కార్మిక సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల వేతనాల చెల్లింపు, కేసుల ఎత్తివేతకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. సమ్మె కాలానికి వేతనాలు చెల్లించడం, కేసులను వెంటనే ఎత్తివేయడం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Publish Date: May 1, 2026 9:19PM

political-news-img

సీతారాం కేసుల్లో ట్విస్ట్...భర్త చనిపోయిన నెలరోజులకే ప్రియుడితో పెళ్లి

హైదరాబాద్‌ పరిధిలోని బాచుపల్లిలో జరిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసు రాష్ట్రవ్యా ప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.. భర్త చనిపోయి కేవలం నెలరో జులు కూడా కాకముందుకే భార్య అందరికీ ఓ ట్విస్ట్ ఇచ్చింది... అది విన్న కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. మొదట సాధారణ కుటుంబ వివాదంగా భావించిన ఈ కేసు, తర్వాత బయటపడిన విషయాలతో ఒక్కొక్కటిగా కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. సీతారాం ఐటీ కంపెనీలో పనిచేస్తూ భార్య రేణుక, ఇద్దరు పిల్లలతో కలిసి బాచుపల్లిలో నివసించేవాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తన భార్యకు అనేక అక్రమ సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో సీతారాం తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఫిబ్రవరి నెలలో ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. అయితే సీతారాం ఆత్మ హత్య చేసుకోబోయే ముందు ఒక 19 పేజీల సూసైడ్ నోట్ రాసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సూసైడ్ నోట్ ద్వారా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి... తన భార్యకు ఆరుగురు ప్రేమికులు ఉన్నారని అతను తన సూసైడ్ నోట్లో రాశాడు. ఈ విషయం తెలిసిన తర్వాత తన భార్యను పలుమార్లు మందలించానని అయినా కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని దీంతో విసుగు చెంది తాను ఆత్మహత్య చేసుకుంటున్నా నని సీతారాం తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. అయితే ఇదిలా ఉండగా ఈ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది.. ఒకవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగి సీతారాం మరణించడంతో కుటుంబ సభ్యులందరూ విషాదంలో మునిగిపోయారు. ఇక మరోవైపు భర్త సీతారాం చనిపోయి నెల రోజులు కూడా గడవక ముందే, మార్చి నెలలో రేణుక మరో వివాహం చేసుకుంది కుటుంబ సభ్యులకు ఎవరికి తెలియకుండా రహస్యంగా రేణుక తాను గాఢంగా ప్రేమిస్తున్న ప్రియుడిని పెళ్లి చేసుకుంది... ఈ విషయం బయటకు రావడంతో కేసు దిశ పూర్తిగా మారింది. పోలీసుల దర్యాప్తులో రేణుక తన మాజీ ప్రియుడు రమణారెడ్డిని వివాహం చేసుకున్నట్లుగా వెల్లడైంది. ఈ వివాహం త్వరగా జరగడం, అలాగే సీతారాం ఆత్మహత్యకు ముందు ఉన్న వివాదాల నేపథ్యంలో పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మరణంగా పరిగణించి విచారణ వేగ వంతం చేశారు. సీతారాం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు, సేకరించిన సాక్ష్యాలు, కాల్ డేటా, సందేశాలు తదితర వివరాల ఆధారంగా పోలీసులు కేసును లోతుగా పరిశీలించారు. దర్యాప్తులో బయటపడిన అంశాల ఆధారంగా బాచుపల్లి పోలీసులు రేణుకతో పాటు రమణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంకా మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. సీతారాం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, ఎవరి పాత్ర ఎంత ఉందన్న కోణంలో విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్తున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Publish Date: May 1, 2026 8:49PM

political-news-img

ట్రంప్ మానసిక స్థితి సరిగ్గానే ఉందా?

అమెరికా అధ్యక్షుడి మానసిక స్థితి సరిగ్గానే ఉందా.. అన్న అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా అమెరికా పార్లమెంటులో రక్షణ మంత్రిని పీట్ హెగ్సెత్‌ను ను ఎంపీ సారా జాక్సబ్ ..మీ అధ్యక్షుడికి మతి స్థిమితం ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన పీట్ హెగ్సెత్ ఇలాంటి ప్రశ్న మీరు ఎప్పుడైనా యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బైడెన్‌ను అడిగారా అంటూ ఎదురు దాడి చేశారు. దీనికి సారా జాకబ్స్ కూడా ఏడాదిన్నరగా అధ్యక్షుడిగా ఉంది ట్రంపే నంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ముదురుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వ పటిమపై విపక్షాలు విరుచుకు పడుతున్నాయి. ముఖ్యంగా ఆయన సోషల్ మీడియా చేస్తున్న పోస్టులు, అర్ధరాత్రి పూట చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో 'ట్రంప్ మానసిక స్థితి అసలు నిలకడగానే ఉందా" అనే చర్చ తెరపైకి వచ్చింది. దీనిపై కాపిటల్ హిల్‌లో జరిగిన విచారణలో.. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌ను డెమోక్రాట్ ఎంపీలు నిలదీశారు. కాంగ్రెస్ విచారణలో డెమోక్రాట్ సభ్యురాలు సారా జాకబ్స్ నేరుగా రక్షణ మంత్రిని ..అమెరికా సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించేందుకు ట్రంప్ మానసిక స్థితి సరిగ్గా ఉందా? అని నిలదీశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన పీట్ హెగ్సెత్.. గత నాలుగేళ్లలో జో బైడెన్ విషయంలో ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్నలు అడిగారా? అంటూ ఎదురుదాడికి దిగారు. దానికి జాకబ్స్ స్పందిస్తూ .. బైడెన్ ఇప్పుడు అధ్యక్షుడు కాదు. ఏడాదిన్నరగా ట్రంప్ అధికారంలో ఉన్నారని బదులిచ్చారు. దీనిపై మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన హెగ్సెత్.. తమ అధ్యక్షుడిని కించపరిచేలా అడిగే ఈ ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వనని, ఆయన సైన్యాన్ని అగ్రస్థానంలో నిలిపే గొప్ప నాయకుడని వెనకేసుకొచ్చారు. ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలమవుతున్న తరుణంలో.. ట్రంప్ తన సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు అమెరికా ప్రజలను కలవర పెడుతున్నాయి. ఒక సందర్భంలో ఆయన.. "ఇరాన్ నా డిమాండ్లను అంగీకరించకపోతే.. నేటి రాత్రే వారి నాగరికత అంతమైపోతుంది" అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అంతేకాకుండా తనను తాను దైవంగా చిత్రించుకునేలా ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాన్ని పోస్ట్ చేసి విమర్శల పాలయ్యారు. తన చేతుల నుంచి దివ్య కాంతి వస్తున్నట్లు ఉన్న ఆ ఫోటోను తర్వాత తొలగించిన ట్రంప్.. తాను ప్రజల కష్టాలు తీర్చే డాక్టరు లాంటి వాడినని సర్దిచెప్పుకున్నారు. ఆ క్రమంలో ట్రంప్ మెంటల్ బ్యాలెన్స్‌పై తిరిగి చర్చ మొదలవ్వడంప్రాధాన్యత సంతరించుకుంది.

Publish Date: May 1, 2026 8:26PM

political-news-img

సన్‌రైజర్స్ స్టార్ క్లాసెన్‌పై పీటర్శన్ అపార నమ్మకం

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు. ముంబై ఇండియన్స్‌పై క్లాసెన్ చేసిన అజేయ హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 65) తర్వాత పీటర్సన్ సోషల్ మీడియా వేదికగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఒక విజ్ఞప్తి చేశాడు. 2027లో స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో సఫారీలు విజేతగా నిలవాలంటే, క్లాసెన్ వంటి ఆటగాడు జట్టులో ఉండాలని సూచించాడు. ఇందుకోసం క్లాసెన్ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకునేలా అధికారులు ఒప్పించాలని కోరాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ పరుగులు వరద పారిస్తున్నాడు. ప్రతీ మ్యాచులోనూ పరుగులు చేస్తూ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బుధవారం (29-4-26న)ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఈ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ 30 బంతుల్లోనే 65 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన క్లాసెన్.. సుమారు 60 సగటుతో 414 పరుగులు స్కోరు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో ప్లేసులో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి కేవలం ఫ్రాంఛైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు.

Publish Date: May 1, 2026 8:16PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img