జై కొట్టినా, నో చెప్పినా పదవులకు గండమే.. జగన్ కింకర్తవ్యం.!

Publish Date:Jul 18, 2026

Advertisement

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చట్టసభల్లో నేరస్తుల సంఖ్యను తగ్గించేందుకు, రాజకీయాల్లో పారదర్శకతను పెంచేందుకు కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. చట్టసభల ప్రతినిధులు ఎవరైనా సరే ఏవైనా కేసులలో 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష అనుభవిస్తే లేదా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంటే వారి పదవి తక్షణమే రద్దయ్యేలా  ప్రతిపాదనai సిద్ధం చేస్తోంది.  ఈ కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లుపై  దేశవ్యాప్తంగా మెజారిటీ రాజకీయ పక్షాలు  సానుకూలంగా ఉన్నప్పటికీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ కొత్త చట్టంపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించనున్న ఈ అనర్హత బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదని..  అవసరమైతే పార్లమెంట్‌లో వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ ఎంపీలకు జగన్ దిశా నిర్దేశం చేసినట్లు వైసీపీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వారి నుంచి మొదలుకొని సాధారణ శాసనసభ్యుడి వరకు ఎవరైనా సరే ఒక నెల రోజుల పాటు జైలులో గడపాల్సి వస్తే వారి పదవి ఊడిపోయేలా కేంద్రం 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావాలని యోచిస్తోంది. అయితే ఈ నిబంధన ప్రకారం జైలు నుంచి విడుదలైన తర్వాత సదరు నాయకులు తిరిగి తమ పదవులను పొందేందుకు వీలుంటుందని కూడా ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు. గతంలో పార్లమెంట్‌లో తగినంత బలం లేకపోవడం వల్ల ఈ బిల్లు విషయంలో ముందడుగు వేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ సాహసించలేదు. అయితే ఇప్పుడు  కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటులో తగినంత  సంఖ్యా బలం ఉండటంతో, ఈ బిల్లును తీసుకురావాలని మోడీ సర్కార్ భావిస్తున్నదని అంటున్నారు. 

ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఎన్నో వివాదాస్పద బిల్లులకు, కీలక చట్టాలకు వైసీపీ బేషరతుగా మద్దతు ఇస్తూ వచ్చింది. ఎన్‌డీఏ కూటమిలో భాగస్వామి కాకపోయినప్పటికీ, జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల అంటూ  మోదీ ప్రభుత్వ నిర్ణయాలకు జగన్ జై కొట్టారు. అలాంటిది ఇప్పుడు అకస్మాత్తుగా కేంద్రం తెస్తున్న ఈ అనర్హత బిల్లును వైసీపీ వ్యతిరేకించాలని నిర్ణయించుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  వైసీపీ తీసుకున్న ఈ యూటర్న్ వెనుక ఆ పార్టీ అగ్రనాయకత్వానికి ఉన్న వ్యక్తిగత, రాజకీయ భయాలే ప్రధాన కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ దాఖలు చేసిన అక్రమ ఆస్తుల కేసులు విచారణలు ప్రస్తుతం న్యాయస్థానాలలో తుది  దశకు చేరుకున్నాయి. గతంలో ఈ కేసుల దర్యాప్తు నేపథ్యంలో జగన్ దాదాపు 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. దీనికి తోడు..  ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన వివిధ రకాల అక్రమాలు, అవినీతి ఆరోపణలపై విచారణలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో జగన్ లేదా,  అత్యంత సన్నిహితులైన నేతలు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఒకవేళ కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఈ 30 రోజుల అనర్హత చట్టం గనుక అమల్లోకి వస్తే, భవిష్యత్తులో జగన్ ఎదుర్కొంటున్న కేసుల కారణంగా ఆయన మళ్లీ ఒక నెల రోజుల పాటు జైలుకు వెళ్లాల్సి వస్తే..  ఆయన శాసనసభ సభ్యత్వంతో పాటు పార్టీ ఉనికి కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ తరహా చట్టపరమైన ఇబ్బందుల నుంచి తమ అధినేత,  పార్టీ భవిష్యత్తు  రక్షించుకోవడానికే వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ.  ఒకవేళ దేశంలో అవినీతి రహిత రాజకీయాల కోసం కేంద్రం పట్టుబడితే, ఈ చట్టాన్ని అడ్డుకోవడం ప్రాంతీయ పార్టీలకు అంత సులువు కాదని అంటున్నారు.  

ఒకవేళ కేంద్ర పెద్దల నుంచి ఒత్తిడి పెరిగితే లేదా రాజకీయ వ్యూహాల్లో మార్పులు జరిగితే, ఓటింగ్ సమయంలో  వైసీపీ కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, రాజకీయాల్లో నైతికతను పెంచేందుకు కేంద్రం తెస్తున్న ఈ ప్రతిపాదనపై వైసీపీ తీసుకున్న ఈ వెనకడుగు వ్యవహారం రానున్న రోజుల్లో మరింత రాజకీయ వేడిని పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ బిల్లు విషయంలో జగన్ పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యి చందంగా మారిందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. బిల్లుకు జై కొట్టినా, బిల్లును వ్యతిరేకించినా కూడా జగన్ జైలు, పదవుల గండం ఉందని అంటున్నారు. 

YS Jagan Mohan Reddy, YSRCP BJP Bill, 30 Days Jail Disqualification Bill, 130th Constitutional Amendment, Andhra Pradesh Politics 

By
en-us Political News

  
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.