శత్రువులు మారొచ్చు గాక

Publish Date:Jul 19, 2017

Advertisement

మనం చిన్నప్పుడు బయటి ప్రపంచం గురించి అంతగా అవగాహన లేని సమయంలో మన పాఠ్యాంశాల్లో తెలుసుకున్న విషయం ఏంటంటే, భారత దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దాదాపు 200 ఏళ్ళు దోచుకెళ్లారు. కాబట్టి, మన ప్రథమ శత్రువులు వాళ్ళే అని అప్పట్లో నిర్ణయించుకున్నాం. తర్వాత మన పెద్దలు, ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే, భారత్ కి అసలు ప్రధాన శత్రువు పాకిస్తాన్. 

 

ఒకప్పుడు కలిసి ఉన్న మన సహోదరులు, బ్రిటిషర్లు పెట్టిన మత చిచ్చులో ఉడికి, ప్రత్యేక దేశం కావాలని ఉద్యమం చేసిన సమయంలో, ఎందుకులే ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టి కలసి ఉండడం అని, మహాత్మా గాంధీ దేశం విడిపోవాలని సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. మహానుభావుడు, ఆ సమస్య అక్కడితో సమసిపోతుందని అనుకొని ఉండొచ్చు. కానీ, కాశ్మీర్ లో కొంత భాగం సమర్పించినప్పటికీ ఇండియా, పాకిస్తాన్ చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. ఉగ్ర రూపంలో మన దేశంపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

 

అయితే, మనకి పాకిస్తాన్ ని మించిన శత్రువు ఒకరున్నారు తెలుసా? పాకిస్థానీయులకి తెలివి తేటలు నిల్ కాబట్టి, వాళ్ళను ఉపయోగించుకొని తమకి పెద్ద పోటీదారు అయినా భారత్ ని దొంగ దెబ్బ కొట్టే విషయంలో 'డ్రాగన్' దేశం చైనా ఎప్పుడూ తమ సహాయ సహకారాలు అందిస్తూ వస్తుంది. 2014 వరకు చైనా ఆటలు సాగినా..నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రాగన్ పప్పులు ఉడకడం లేదు.

 

మోడీ ఏంటి మాటి..మాటికి విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఇక దేశం గురించి పట్టించుకునే దెప్పుడు అని. విపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో కొందరు, 'ఏది చెబితే' అది నమ్మే వాళ్ళు అవును మోడీ దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారు అని తమ గొంతు కలిపారు. అలాంటి వాళ్లందరికీ ఇప్పుడు మోడీ 'విదేశీ పర్యటనల' వెనుక రహస్యం ఇప్పడిప్పడే అర్ధమవుతోంది. భారత్ కి మిత్రులని పెంచుకోవడం... తద్వారా మన బలం ఇది అని చైనా కి హెచ్చరికలు పంపడం... ఇది మోడీ వ్యూహం.

 

చైనా మీడియా లో మాత్రం ఇండియా చేస్తుంది అక్షరాలా తప్పు అని సరిహద్దు దేశాలన్నిటితో గొడవలు పెట్టుకుంటుందని అవాకులు, చవాకులు పేలుతుంది. ఈ విషయం వచ్చిన ప్రతిసారి '1962 ' గుర్తుంది కదా అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది డ్రాగన్. కానీ, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారత్ లో అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులకీ భారీ తేడా ఉంది. ఇప్పుడు మనతో పెట్టుకుంటే చెడేది తామే అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఆ మధ్య ఇండియా, అమెరికా, జపాన్ నావికా దళాలు బంగాళాఖాతంలో చేసిన విన్యాసాలు చైనాకి గుబులు పుట్టిస్తున్నాయి.

 

ఒకటి మాత్రం వాస్తవం, మనకి శత్రువులు పెరుగుతున్నారు, లేదా మారుతున్నారు అంటే అర్ధం మనం చెడ్డ వాళ్ళం అని కాదు, అతి మంచి కూడా కొన్ని సార్లు చెడు చేస్తుంది. ఈ విషయం గుర్తు పెట్టుకుని ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు కొనసాగించాలి.

By
en-us Political News

  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.