త్వరలో గవర్నర్ మార్పు..నరసింహన్ తెలంగాణాకే పరిమితం?

Publish Date:Jun 11, 2015

Advertisement

 

రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ తెలంగాణా ప్రభుత్వం వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని ఆంద్రప్రదేశ్ మంత్రులలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన అనేక వినతి పత్రాలపై ఆయన ఎటువంటి చర్య చేప్పట్టకపోవడమే కాకుండా తెలంగాణా ప్రభుత్వానికి కొంత అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కొందరు మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెదేపాకు చెందిన యంయల్యేలను ముఖ్యమంత్రి తెరాసలోకి ఆకర్షించి వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటివారికి మంత్రి పదవులు కట్టబెడుతుంటే, అటువంటి రాజ్యాంగ విరుద్దమయిన చర్యలను గవర్నర్ అడ్డుకోకపోగా వారిచేత ప్రమాణస్వీకారం కూడా చేయించడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.

 

విభజన బిల్లులో సెక్షన్ 8 ప్రకారం ఆయన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో అన్ని ప్రభుత్వ వ్యవస్థలపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. కానీ తెదేపా యంయల్యే రేవంత్ రెడ్డిపై ఎసిబి నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ గురించి ఆయనకి ఎటువంటి ముందస్తు సమాచారం లేనట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆ తరువాత బయటపడిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి కూడా ఆయనకు ఇంతవరకు సమాచారం లేకపోవడంతో ఆయనకు హైదరాబాద్ నగరంలో ఏమి జరుగుతోందనే విషయంపై సరయిన సమాచారం కానీ, అవగాహన గానీ లేదనే విషయం రుజువయిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

 

గవర్నర్ నిర్లిప్తత పట్ల ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అసంతృప్తిగా ఉన్నారనే విషయం నిన్న మొట్టమొదటిసారిగా బయటపడింది. తమ పార్టీ యం.యల్యేగా కొనసాగుతున్న తలసానికి ఆయన ఏవిధంగా పదవీ ప్రమాణం చేయించారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిలో సంపూర్ణాధికారాలు గవర్నర్ కే కట్టబెట్టాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆయనను మార్చితే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం వద్ద అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

 

ఈ పరిస్థితులలో మరి ఆయనని మార్చుతుందో లేకపోతే ఆయనను తెలంగాణాకు పరిమితం చేసి ఆంధ్రాకు మరో గవర్నర్ నియమిస్తుందా? లేక ఆయననే కొనసాగిస్తుందా...అనేది త్వరలోనే తెలియవచ్చును. కానీ నిన్న హోంమంత్రి రాజ్ నాద్ సింగ్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు తారసపడినప్పుడు, ఆయనని పిలిచి మరీ ఫోటో తీయించుకొన్నారు ఎందుకో...? ఆయన హైదరాబాద్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒకపని మీద వచ్చి కలుస్తూనే ఉంటారు. అలా కలిసినప్పుడల్లా మీడియా వాళ్ళు నిత్యం వారి ఫోటోలు తీస్తూనే ఉంటారు. మరి అటువంటప్పుడు డిల్లీలో చంద్రబాబు ఎదురపడినప్పుడు పనిగట్టుకొని ఆయనతో ఫోటో ఎందుకు తీయించుకొన్నారనే సందేహం కలగడం సహజం. బహుశః కేంద్ర ప్రభుత్వం ఆయనని మార్చబోతున్నట్లు ఏమయినా సంకేతాలు ఇచ్చినందునే ఆయన ఫోటో దిగారా? లేక కేవలం యాదృచ్చికంగానే ఆవిధంగా చేసారా? అనే విషయం కూడా త్వరలోనే తెలియవచ్చును.

 

ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం నెలకొన్న యుద్ద వాతావరణ గురించి మీడియా అడిగిన ఒక ప్రశ్నకు ఆయనిచ్చిన సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది. ‘త్వరలోనే అన్నీ సర్దుకొంటాయి,’ అని చెప్పారు. ఆయన జవాబు వింటే ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య కేంద్ర ప్రభుత్వం రాజీ కుదుర్చుతుందని సూచిస్తున్నట్లుంది. లేకుంటే ఇంతవరకు వచ్చిన తరువాత అన్నీ త్వరలోనే సర్దుకోవడం అసంభవమని అందరికీ తెలుసు. ఏమయినప్పటికీ మరొక్క వారం రోజులలోనే కేంద్రప్రభుత్వం తన వైఖరిని మెల్లగా బయటపెట్టవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.