బల్దియా బాద్ షా కేసీఆర్.. ప్రజల తీర్పు

Publish Date:Feb 5, 2016

Advertisement

ఆఖరికి గ్రేటర్ ఎన్నికల్లో ఎవరు మేయర్ స్థానాన్ని దక్కించుకుంటారా.. ప్రజలు ఎవరికి పట్టం కట్టారా? అని ఎదురుచూస్తున్న అందరి ఉత్కంఠకు తెర దిగింది. అందరూ ఊహించినట్టే ఈ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ టీఆర్ఎస్ తమ ప్రభంజనాన్ని చాటుకుంది. సొంతగా బరిలో దిగిన టీఆర్ఎస్ పార్టీ బల్దియా పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ గ్రేటర్ ఎన్నికలు మొత్తం 150 డివిజన్లలో పోటీ జరగగా.. ఈ స్థానాలకు మొత్తం 31333 మంది అభ్యర్ధులు బరిలో దిగారు.  ఈ 150 డివిజన్లలో కూడా వందకు పైగా స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకొని మరోసారి తన సత్తా చూపించింది.ఇదిలా ఉండగా ఇక మిగిలిన పార్టీలు నామరూపాలు లేకుండా పోయినట్టు తెలుస్తోంది. విపక్షాలు అయితే కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమైంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సెటిలర్లు ఉన్న ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీడీ పార్టీ ఆశలు పెట్టుకున్న ఎరియాలు కూడా టీఆర్ఎస్ పార్టీకే పట్టంకట్టాయి. అంతేకాదు మొత్తం ఎన్నికల నేపథ్యంలో కేవలం 45 శాతం మాత్రమే పోలింగ్ శాతం జరిగింది. అంటే ఒక్క డివిజన్లో సుమారు యాభైవేల మంది ఓటర్లు ఉన్నా.. పోలింగ్ జరిగింది 45 శాతం కాబట్టి అందులో ఇరవై వేల మందికి పైగా తమ ఓటును వినియోగించుకున్నారు. అయితే ఈ ఇరవై వేలలో దాదాపు పదిహేను వేల మందికి పైగా ఓటర్లు టీఆర్ఎస్ కే ఓటు వేసినట్టు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

గెలిచిన కేటీఆర్

ఈ గ్రేటర్ ఎన్నికల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం కేసీఆర్ తనయుడు.. మంత్రి కేటీఆర్ గురించి చెప్పుకోవాలి. ఈ ఎన్నికలను తను వ్యక్తిగతంగా తీసుకొని.. ఎన్నికల బాధ్యతను తన భుజాలపై వేసుకొని చాలా కష్టపడ్డారు. తన వాక్చాతుర్యంతో గ్రేటర్ ప్రజలను బాగా ఆకట్టుకొని.. ఎన్నికల గెలుపుకు ప్రధాన కారణమయ్యారు. అంతేకాదు ఈ గ్రేటర్ ఎన్నికలు కేటీఆర్ కి కూడా చాలా ముఖ్యం. ఈ ఎన్నికలపైనే దాదాపు తన రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది. కేసీఆర్ కూడా తన కొడుకు సామర్థ్యాన్ని చూసుకోవడానికే ఈ ఎన్నికల బాధ్యతను కేటీఆర్ పై మోపారు. అందుకే కేటీఆర్ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఎన్నికల గెలుపుకు కష్టపడ్డారు. కానీ ఎట్టకేలకు టీఆర్ఎస్ గెలిసింది. టీఆర్ఎస్ గెలిచిందంటే కేటీఆర్ కూడా గెలిచినట్టే..

సెటిలర్లు టీడీపీని నమ్మలేదా..?

గ్రేటర్ ఎన్నిల్లో పార్టీలన్నీ నువ్వా.. నేనా అంటూ పోటా పోటీగా ప్రచారం చేశాయి. అయితే ఇప్పుడు అందరికి తలెత్తే ప్రశ్న ఏంటంటే.. సెటిలర్లు కూడా టీడీపీని నమ్మలేదా.. సెటిలర్లు ఉన్న ఏరియాలు కూడా టీఆర్ఎస్ పార్టీకే పట్టం గట్టాయి. ఎందుకు..? ఇలా ప్రశ్నలెన్నో తలెత్తుతన్నాయి. ఎందుకంటే.. ఇద్దరు సీఎంల కొడుకులు సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీగా ప్రచారం చేశారు. ఆఖరికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రచారం చేశారు. మరి ఆయన ప్రచారానికి కూడా ప్రజలు ఇంప్రెస్ అవ్వలేదా..?. అయితే కేటీఆర్ మాత్రం సీమాంధ్రులను ఆకట్టుకునే విధంగా మాట్లాడారు అనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇక సీమాంధ్రులు కూడా కేటీఆర్ మాటలకు పడిపోయారేమేకాని టీఆర్ఎస్ పార్టీకే ఓటేశారు. అంతేకాదు ఎప్పుడూ సీమాంధ్రులకు ఒక్క సీటు కూడా ఇవ్వని కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం దాదాపు 20 స్థానాలను సీమాంధ్రులకు ఇచ్చారు. ఇది కూడా ఒక కారణం అయి ఉండచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..    ఎక్కడో సెటిలర్లు ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే.. అది కూడా చాలా తక్కువ మెజార్టీతో టీడీపీ అభ్యర్ధులు గెలిచారు.

ఓటమికి కారణాలు ఏంటి..?

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే మిగిలిన పార్టీలను చెత్తగా ఓడించి టీఆర్ఎస్ పార్టీకే పట్టంగట్టారు నగర ప్రజలు. మిగిలిన పార్టీలను ఓడించి టీఆర్ఎస్ పార్టీనే గెలిపించడానికి గల కారణాలు ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్న టీఆర్ఎస్ పాలన ప్రజలకు నచ్చిందా..? టీఆర్ఎస్ ప్రవేశ పెట్టిన ప్రభుత్వా పథకాలు ప్రజలకు నచ్చాయా..? లేకపోతే.. ఈసారి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతుందో చూద్దామని గెలిపించారా..? ఇలా ఎన్నో కారణాలు కావచ్చు. ఇక తెలంగాణలో మిగిలిన పార్టీల సంగతి అంతంత మాత్రమే ఉంది.. ఇది కూడా టీఆర్ఎస్ గెలుపుకు ఒక కారణం కావచ్చు. మొత్తానికి కారణాలు ఏదైనా కానీ ప్రజలు మాత్రం టీఆర్ఎస్ ను గెలిపించారు.
 

By
en-us Political News

  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.