తాగునీటిని వృథా చేస్తే రూ.20 వేల జరిమానా.!
Publish Date:Sep 19, 2026
Advertisement
తాగునీటిని దుర్వినియో గం చేస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవని హైదరాబాద్ జలమండలి హెచ్చరించింది. జూబ్లీ హిల్స్లో తాగునీటిని ఫ్లోర్ క్లీనింగ్కు వినియోగించిన ఓ వినియోగదారురాలికి జలమండలి అధికారులు 20 వేల రూపాయలు జరిమానా విధించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 23లో ఓ వినియోగదా రురాలు తాగునీటిని ఫ్లోర్ క్లీనింగ్ కోసం వినియోగిస్తు న్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. దీంతో నిబంధనల మేరకు అధికారులు ఆమెకు జరిమానా విధించారు. తాగునీటిని రోడ్లు, ఫ్లోర్లు కడగడం వంటి అవసరాలకు వినియోగించడంపై జలమండలి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఎల్నినో ప్రభావంతో నీటి లభ్యతపై ఆందోళనలు నెలకొని, ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంంటుంటే.. మరోవైపు తాగునీటిని ఇలా వృథా చేయడం సరికాదని అధికారులు పేర్కొన్నారు. ప్రతి చుక్క నీటిని బాధ్యతగా వినియోగించాలన్నారు. తాగునీటిని దుర్వినియో గం చేస్తే ఎంతటివారిపైనైనా చర్యలు తప్పవని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి హెచ్చరించారు. తాగు నీటిని ఇతర అవసరాలకు వినియో గించకుండా ప్రజలంతా బాధ్యతా యుతంగా వ్యవహరించాలన్నారు. తాగునీటి దుర్వినియోగంపై ఇకపై తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని హెచ్చరించిన ఆయన.. ఎక్కడైనా తాగునీటిని వృథా చేస్తున్నట్లు గుర్తిస్తే నిబంధనల ప్రకారం జరిమానాలు విధిస్తామన్నారు. ఎవరైనా తాగునీటిని దుర్వినియోగం చేస్తున్నట్లు కనిపిస్తే వెంటనే జలమం డలి వాట్సాప్ నంబర్ 99499 30003కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. [Drinking Water Waste Fine, Water Penalty Jalamandali, Save Water Rules, Water Wastage Penalty, Telugu One]
http://www.teluguone.com/news/content/drinking-water-waste-fine-24-231912.html





