2004లో కేసీఆర్‌కు ఒక్క ఎకరం భూమి లేదు.. ఇప్పుడు వేల కోట్ల ఆస్తులెలా వచ్చాయి..? : పొంగులేటి

Publish Date:Sep 17, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో భూ వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్తులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దూమారం రేపుతున్నాయి. కేసీఆర్ స్వయంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లను ప్రస్తావిస్తూ ఆయన పలు ప్రశ్నలు సంధించారు.‘2004లో ఒక్క ఎకరం భూమి లేదని అఫిడవిట్‌లో చెప్పారు.. ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయి?’ అంటూ పొంగులేటి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ ఆస్తులు భారీగా పెరిగాయని ఆయన ఆరోపించారు. 

అయితే ఇదంతా కేవలం రాజకీయ ఆరోపణలేనా? లేక ఎన్నికల అఫిడవిట్‌లలో నమోదైన ఆస్తుల వివరాలే ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాయా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూముల విషయంలోనూ కేసీఆర్ కుటుంబంపై పొంగులేటి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు అప్పులు మిగిలితే.. కేసీఆర్ కుటుంబానికి భారీగా ఆస్తులు ఎలా సమకూరాయని ప్రశ్నించారు.ఇదే సమయంలో కేటీఆర్‌ను కూడా పొంగులేటి టార్గెట్ చేశారు. 

కేసీఆర్‌కు పుట్టుకతోనే వందల ఎకరాల భూమి ఉందని చెబుతున్న కేటీఆర్ వ్యాఖ్యలకు, ఎన్నికల అఫిడవిట్‌లలో నమోదైన వివరాలకు పొంతన ఉందా? అని ప్రశ్నించారు.అఫిడవిట్‌లో తప్పులు రాశారా? లేక ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారా?’ అంటూ కేటీఆర్‌ను నిలదీశారు. కేసీఆర్ ఆస్తులపై గతంలోనూ రాజకీయ ఆరోపణలు వచ్చినప్పటికీ, ఈసారి ఎన్నికల అఫిడవిట్‌లను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు సంధించడం చర్చకు కారణమైంది. దీంతో 2004 నుంచి కేసీఆర్ సమర్పించిన వివిధ ఎన్నికల అఫిడవిట్‌లలో పేర్కొన్న భూములు, ఆస్తుల వివరాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

 

 

[ KTR, CM Revanth Reddy, KCR Farmhouse, BRS Party, Telangana Politics, KTR reacts to Revanth Reddy, KCR farmhouse assets, KTR press meet Telangana Bhavan, BRS vs Congress, KCR 67 acres land, Revanth Reddy challenge, Minister Ponguleti Srinivas Reddy,  TeluguOne News ]

By
en-us Political News

  
స్టేషన్ బెయిల్ కోసం భారీ లంచం డిమాండ్..!
కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మిస్సింగ్.. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం..!
కేసీఆర్‌ ఆస్తులపై ఆరోపణలను ఖండించిన కేటీఆర్‌..!
చింతపల్లి సమీపానికి రాగానే, ఆయన ప్రయాణిస్తున్న కారులో   పొగలు రావడం గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కారును నిలిపివేయగా, లోపల ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో కేబిన్ అంతటా మంటలు వేగంగా వ్యాపించాయి.
వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.  సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.
విచారణ తర్వాత ఆ భూములని దళితులకు పంచుతాము..!
సినీ ప్రపంచాన్నే గడగడలాడించడమే కాకుండా పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ రవిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో సహకరించండి..!
నానక్‌రామ్‌గూడలోని భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.