ఇది రేవంత్ సర్కార్ సృష్టించిన కరవు.. హరీష్ ధ్వజం.!

Publish Date:Sep 19, 2026

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తలెత్తిన కరవు పరిస్థితులను అధికార కాంగ్రెస్ తీసుకువచ్చిన దుర్భిక్షంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత తన్నీరు హరీష్ రావు అభివర్ణించారు.  రాష్ట్రంలో కనిపిస్తున్న కరవు పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం వల్ల తలెత్తినవి కావన్నారు.  ఇందుకు పూర్తిగా రేవంత్ సర్కార్  అసమర్థ  విధానాలే కారణమని విమర్శించారు.  కృష్ణా నదీ జలాల నిర్వహణ,  వాటిని వినియోగంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు.  

హైదరాబాద్‌లో  శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు..  అసెంబ్లీ సాక్షిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటనలను తీవ్రంగా ఖండించారు. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి   84 టీఎంసీల నీటిని వాడుకున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న లెక్కలు అబద్ధాలన్నారు.   క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పటివరకు కేవలం 8 టీఎంసీల నీటిని మాత్రమే తరలించగలిగారని  వివరించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలోని ఐదు ప్రధాన మోటార్లలో ప్రస్తుతం కేవలం రెండే పని చేస్తున్నాయని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమన్నారు.  

గత మూడేళ్ల కాలంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు విడుదల చేసిన గణాంకాలను హరీష్ రావు  ఈ సందర్భంగా   ప్రస్తావించారు. కేఆర్‌ఎంబీ నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  718 టీఎంసీల నీటిని వినియోగించుకుందనీ, అదే  తెలంగాణ మాత్రం కేవలం 216 టీఎంసీలకు మాత్రమే  అయ్యిందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఇప్పటివరకు ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కృష్ణా జలాల వాడకం అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడం ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ట అంటూ విమర్శించారు.

రాష్ట్రంలో నదుల్లో నీరు పుష్కలంగా అందుబాటులో ఉందని, పొలాలకు నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లు కూడా సిద్ధంగా ఉన్నాయన్న హరీష్ రావు.. నీటిని సక్రమంగా మళ్లించుకోలేని చేతకానితనంలో ప్రభుత్వం ఉందంటూ దుయ్యబట్టారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు, వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా నిరంతరం నీటిని  తరలించుకుపోతున్నా..  తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తోందని విమర్శించారు.  తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అధికార పార్టీ నాయకులు తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీష్ ఆరోపించారు.  

[Congress Government Drought, Krishna River Water Utilization, Srisailam Water Dispute, BRS Party Telangana, Harish Rao, Revanth Reddy, Telugu One]

By
en-us Political News

  
జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 23లో ఓ వినియోగదా రురాలు తాగునీటిని ఫ్లోర్‌ క్లీనింగ్‌ కోసం వినియోగిస్తు న్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. దీంతో నిబంధనల మేరకు అధికారులు  ఆమెకు   జరిమానా విధించారు. తాగునీటిని రోడ్లు, ఫ్లోర్‌లు కడగడం వంటి అవసరాలకు వినియోగించడంపై జలమండలి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 స్టేషన్‌ బయట సదరు కానిస్టేబుల్‌ ఓ మహిళను కర్రతో కొట్టి, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తు న్నాయి.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో కానిస్టేబుల్‌ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతు న్నాయి.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాలా కబ్జాలు, బఫర్ జోన్ ఆక్రమణలు జరిగాయని గతంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖల సంయుక్త సర్వేలో సుమారు 14 గుంటల మేర నాలా ఆక్రమణ జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు   రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామైన మెట్టుగడ్డ  విషాద చ్ఛాయలు అలుముకున్నాయి.   ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న డ్రైవర్ సబావత్ అశోక్‌కు తీవ్రంగా గాయపడ్డాడు.
రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం దేవరయంజాల్ సర్వే నంబర్ 437 పరిధిలో ఉన్న ఆ ఒక్క ఎకరం వ్యవసాయ భూమి విలువ నాటి అఫిడవిట్ లో  50 వేల రూపాయలుగా ఉంది.  
ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టిన తెలంగాణ ఏసీబీ  ఈ కేసులో కేటీఆర్‌ను ఏ 1గా, అరవింద్‌ కుమార్‌ను ఏ 2గా, బీఎల్‌ఎన్‌ రెడ్డీని ఏ 3గా పేర్కొంటూ ఏసీబీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 
మాదన్నపేటలో ప్రేమోన్మాది ఘాతుకం.. !
హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడ భూ వివాదం, భూ కబ్జా ఆరోపణలపై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
నిజామాబాద్ నడిబొడ్డున నరికి చంపి దుండగులు..!
తమిళనాడు సంప్రదాయ హస్తకళల వైవిధ్యాన్ని హైదరాబాద్ నగరవాసులకు పరిచయం చేసేందుకు శిల్పారామంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు మెగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో భూ వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.
స్టేషన్ బెయిల్ కోసం భారీ లంచం డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.