కరెన్సీ కట్టలతో కూడా కష్టాలేనట!

Publish Date:Jan 19, 2015

Advertisement

 

బ్యాంకుల్లో కరెన్సీ కట్టలు దొంతర్లు చూస్తే ఎవరికయినా ముచ్చటేస్తుంది. కానీ ఆ కరెన్సీ కట్టలతో జరిగే లావాదేవీల కోసమే మన దేశంలో బ్యాంకులు ఏడాదికి రూ 21,000 కోట్లు ఖర్చు చేయవలసి వస్తోందంటే నమ్మబుద్ధి కాదు. కానీ అది పచ్చి నిజం.

 

అభివృద్ధి చెందిన దేశాలలో క్రమంగా కరెన్సీ వినియోగం తగ్గిపోతూ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఆన్ లైన్ నగదు బదిలీలు జరిగుతుంటే మన దేశంలో నిరక్షరాశ్యత, పేదరికం, కోట్లాదిమందికి నేటికీ బ్యాంకు ఖాతాలు కూడా లేకపోవడం, భారతీయులకు కరెన్సీ నోట్లను దాచుకోవాలనే తపన, ఆ నగదును సురక్షితంగా ఒక చోట నుండి మరొక చోటికి తరలించవలసి రావడం వంటి అనేక కారాణాల వలన ప్రతీ ఏడాది దేశంలో బ్యాంకులన్నీఅన్నివేల కోట్లు ఖర్చు చేయవలసి వస్తోంది.

 

ఈ కారణంగానే ప్రతీ ఏటా లక్షల కోట్ల కరెన్సీ నోట్లను ముద్రించవలసి వస్తోంది. మళ్ళీ ఎప్పటికప్పుడు ఆ నోట్ల సెక్యురిటీ కోడ్స్ మార్చవలసి రావడం, చిరిగిన, పాడయిపోయిన పాత నోట్ల స్థానంలో ఈ కొత్త నోట్లను చెలామణిలోకి తీసుకురావడం, వాటితో లావాదేవీలు నిర్వహించవలసి రావడంతో ఈ అదనపు భారం తప్పడం లేదు. అంటే నోటుకి ఉన్న విలువే కాదు ఆ నోటును చెలామణిలో ఉంచడానికి కూడా ఖర్చు తప్పదన్నమాట.

 

ఒక్క డిల్లీ నగరంలోనే ప్రజలు ఏడాదికి కనీసం 60 లక్షల గంటలపాటు ఈ కరెన్సీ నోట్లతో లావాదేవీలు నిర్వహించుతున్నారని మాస్టర్ కార్డ్ సంస్థ వారు ఇటీవల విడుదల చేసిన ‘కాస్ట్ ఆఫ్ క్యాష్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో తెలియజేయబడింది. మరి యావత్ భారతదేశంలో ఉన్న 123 కోట్ల మంది కలిసి ఎన్ని లక్షల కోట్ల గంటల సమయం ఈ కరెన్సీ వ్యవహారాలకోసం వెచ్చిస్తున్నారో ఎవరూ లెక్క కట్టలేరేమో. నేటికీ భారత దేశ జనాభాలో మూడవ వంతు మంది గత 15 ఏళ్లలో ఎన్నడూ బ్యాంకు గడప ఎక్కనే లేదట. కారణాలు అందరికీ తెలిసినవే పేదరికం, దరిద్రం, నిరుద్యోగం, నిరక్షరాస్యత వగైరా వగైరా. అందుకే ప్రధాని మోడీ జన్ ధన్ యోజన అంటూ అందరి చేత బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారేమో. కానీ పైసా రాబడి లేని వారి చేత ఎన్ని కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపిస్తే మాత్రం ఏమి ప్రయోజనమో మోడీ వివరించలేదు.

 

కానీ 2007 సం.నుండి పట్టణ ప్రాంతాలలో ఎలక్ట్రానిక్ పేమెంట్లు 2.6% to 6.8% వరకు వృద్ధి చెందింది. అది ప్రతీ ఏటికీ ఇంకా వేగంగా పెరుగుతోంది. బ్యాంకులు ఆర్ధిక సంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ కూడా ఎలక్ట్రానిక్ పేమెంట్లను విరివిగా ప్రోత్సహించడం అందుకు అవసరమయిన సదుపాయాలూ కల్పించడం, గుండు సూది నుండి కుక్క పిల్లల వరకు అన్నీ కూడా ఆన్ లైన్లో కొనుగోలు చేసే అవకాశాలు పెరగడంతో పెద్ద పెద్ద పట్టణాలు, నగరాలలో ఈ కరెన్సీ వాడకం క్రమంగా కొంచెం తగ్గు ముఖం పడుతోంది.

 

2007 సం.లో ఏటీయం ల ద్వారా రూ.3లక్షల కోట్లు లావాదేవీలు జరిగితే అది 2012 నాటికి రూ 18 లక్షల కోట్లకు చేరుకొంది. కానీ అంత మాత్రాన్న భారతదేశంలో కరెన్సీ నోట్లతో లావాదేవీలు ఏ మాత్రం తగ్గలేదు పైగా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. వచ్చే మూడేళ్ళలో భారత్ చైనా దేశాలలో ఏడాదికి 16,000 కోట్ల నుండి 17,300 కోట్ల నోట్లు చెలామణిలో ఉంటాయని ఒక అంచనా. అంటే వాటి ముద్రణ, తరలింపు, వాటితో లావాదేవీలు, పాత నోట్ల ఉపసంహరణ వగైరా తంతు అంతా కూడా పెరుగుతుందన్న మాట.

By
en-us Political News

  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.