జగన్‌ కార్యాలయంగా మారిన చంచల్‌గూడ జైలు?

Publish Date:Aug 23, 2012

Advertisement

ఒక రిమాండు ఖైదీతో ప్రవర్తించినట్లు చంచల్‌గూడజైలు అధికారులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్మోహనరెడ్డితో ప్రవర్తించటం లేదు. నిబంధనల ప్రకారం అనుమతించాల్సిన ములాఖత్‌ల కన్నా అదనంగానే ఆయనకు జైలు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా విఐపి ఖైదీలందరి లోనూ జగన్‌ను ప్రభుత్వ అతిధిగా చూసుకుంటున్నారు. ఆయన కోరిన తిండి సదుపాయం కల్పిస్తున్నారు. అలానే జ్యూస్‌లూ అందిస్తున్నారు. కొత్తగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కాలుమోపాలనుకునే వారికి చంచల్‌గూడాజైలులో ముందు వరసలో ములాఖత్‌ కల్పిస్తున్నారు. అసలు రోజుకు ఎన్ని ములాఖత్‌లు జరిగినా జైలు అధికారులు ఆయనను ఇష్టపడి మరీ అవకాశం కల్పిస్తున్నారు. ఎవరో అన్నట్లు సేవ చేయవచ్చు కానీ, బానిసచాకిరీలు ఎందుకు అని ఎవరన్నా కూడా జైలు అధికారులు స్పందించటం లేదట. ఇప్పటికే రోజూ ఈ జైలుకు వచ్చే వాహనాల సంఖ్య పెరిగిపోతోందని, ఒక్కోసారి ట్రాఫిక్‌ సమస్య కూడా ఎదుర్కొంటున్నామని పోలీసులు చెబుతున్నారు. కానీ, జైలు అధికారులు మాత్రం ములాఖత్‌ల సంఖ్య పెంచటానికి వీలులేదన్న కోర్టు తీర్పునూ బేఖాతరు చేస్తున్నారు. రోజూ జగన్‌ను కుటుంబసభ్యులు, అభిమానులు, కొత్తగా పార్టీలో చేరాలనుకున్న వారు కలుస్తున్నారు. చంచల్‌గూడ జైలు బయట నుంచి చూసేవారికి ఆ జైలు జగన్‌ కార్యాలయమా అనే అనుమానం వస్తోంది.

By
en-us Political News

  
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న  వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని   పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో  బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది.   ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని   బలహీనపరిచింది. 
గత పుష్కర కాలంగా  ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో  మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో  అధికారుల కమిటీ  సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.