‘చిరు’కు పీసిసి అప్పగిస్తే కేంద్రమంత్రి పదవి హుష్కాకేనా?
Publish Date:Aug 23, 2012
Advertisement
రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవికి తాజాగా పీసిసి చీఫ్ అయ్యే అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న అఖిలభారత కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది. అయితే అందరూ మాత్రం పీసిసి కళ్లాలు చిరంజీవికి అప్పగిస్తే మటుకు కేంద్రమంత్రి పదవి గురించి మర్చిపోవాలన్న విషయంపై ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిసింది. జోడు పదవులు ఇస్తే రాజ్యసభలో రాష్ట్ర అంశాలపై చిరంజీవి రగడ చేసే అవకాశాలున్నాయని నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన రెండుస్థానాల్లోనూ మాజీ పీఆర్పీనేతలు ఉండటంతో చిరంజీవి తన వాచాలతను ప్రదర్శించారని సోనియా అభిప్రాయపడ్డారు. అందువల్ల ఎక్కువ అవకాశాలు కల్పిస్తే తమను చిరంజీవి లెక్కచేయకపోవచ్చనే ఢల్లీ నేతలు సోనియాతో చర్చిస్తున్నారు. అయితే మేడమ్ దృష్టిలో చిరంజీవికి పీసిసి అప్పగించాలని ఉందని, అందుకే చర్చను ఇంకో రోజు పొడిగించి ఏకాభిప్రాయానికి రావాలని సూచించారని తెలుస్తోంది. ఒకవేళ చిరంజీవి కాకపోతే సౌమ్యంగా పార్టీని నడపగల నేతల జాబితానూ ఎఐసిసి పరిశీలిస్తోంది. దానిలో మంత్రి కన్నాలక్ష్మినారాయణ, జెసి దివాకరరెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. అలానే తెలంగాణా ప్రాంతం నుంచి మంత్రి జానారెడ్డి పేరు కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణా గొడవలను అదుపు చేయటానికి జానారెడ్డికి పీసిసి చీఫ్ ఎందుకు ఇవ్వకూడదని ఆలోచించాలని రాష్ట్రం నుంచి సూచనలు వెళ్లాయి. ఏమైనా ఇంకో రెండు రోజుల్లో కొత్తచీఫ్ పేరును ఎఐసిసి ప్రకటించనున్నది. అరుణాచల్ప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్కండ్ రాష్ట్రాల పీసిసి చీఫ్లు కూడా మారుతారని తెలిసింది.
http://www.teluguone.com/news/content/if-chiranjeevi-gets-pcc-chief-post-cabinet-minister-post-will-not-be-given-24-16801.html





