‘చిరు’కు పీసిసి అప్పగిస్తే కేంద్రమంత్రి పదవి హుష్‌కాకేనా?

Publish Date:Aug 23, 2012

Advertisement

రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్‌ చిరంజీవికి తాజాగా పీసిసి చీఫ్‌ అయ్యే అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న అఖిలభారత కాంగ్రెస్‌ నేతలకు తలనొప్పిగా మారింది. అయితే అందరూ మాత్రం పీసిసి కళ్లాలు చిరంజీవికి అప్పగిస్తే మటుకు కేంద్రమంత్రి పదవి గురించి మర్చిపోవాలన్న విషయంపై ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిసింది. జోడు పదవులు ఇస్తే రాజ్యసభలో రాష్ట్ర అంశాలపై చిరంజీవి రగడ చేసే అవకాశాలున్నాయని నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన రెండుస్థానాల్లోనూ మాజీ పీఆర్పీనేతలు ఉండటంతో చిరంజీవి తన వాచాలతను ప్రదర్శించారని సోనియా అభిప్రాయపడ్డారు. అందువల్ల ఎక్కువ అవకాశాలు కల్పిస్తే తమను చిరంజీవి లెక్కచేయకపోవచ్చనే ఢల్లీ నేతలు సోనియాతో చర్చిస్తున్నారు. అయితే మేడమ్‌ దృష్టిలో చిరంజీవికి పీసిసి అప్పగించాలని ఉందని, అందుకే చర్చను ఇంకో రోజు పొడిగించి ఏకాభిప్రాయానికి రావాలని సూచించారని తెలుస్తోంది. ఒకవేళ చిరంజీవి కాకపోతే సౌమ్యంగా పార్టీని నడపగల నేతల జాబితానూ ఎఐసిసి పరిశీలిస్తోంది. దానిలో మంత్రి కన్నాలక్ష్మినారాయణ, జెసి దివాకరరెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. అలానే తెలంగాణా ప్రాంతం నుంచి మంత్రి జానారెడ్డి పేరు కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణా గొడవలను అదుపు చేయటానికి జానారెడ్డికి పీసిసి చీఫ్‌ ఎందుకు ఇవ్వకూడదని ఆలోచించాలని రాష్ట్రం నుంచి సూచనలు వెళ్లాయి. ఏమైనా ఇంకో రెండు రోజుల్లో కొత్తచీఫ్‌ పేరును ఎఐసిసి ప్రకటించనున్నది. అరుణాచల్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, జార్కండ్‌ రాష్ట్రాల పీసిసి చీఫ్‌లు కూడా మారుతారని తెలిసింది.

By
en-us Political News

  
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న  వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని   పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో  బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది.   ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని   బలహీనపరిచింది. 
గత పుష్కర కాలంగా  ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో  మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో  అధికారుల కమిటీ  సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.