Publish Date:Apr 28, 2012
ఎసిబి అధిఆరులు మద్యం టెండర్ల అవకతవకలపై ఖమ్మంజిల్లాలో పనిచేసిన మాజీ ఐఎఎస్ అధికారిని అరెస్టు చేయటంతో జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగం టెన్షన్ కు గురవుతోంది. ఎసిబి అధికారులు ఈ కేసుకు సంబంధించి అప్పటి అదనపు జాయిట కలెక్టర్ సుభాష్ చంద్రబోస్ తో పాటు కొత్తగూడెంకు చెందిన ఒక రెవెన్యూ అధికారిని కూడా అరెస్టు చేయవచ్చని తెలుస్తోంది. ఎసిబి అధికారులు తమను టార్గెట్ చేయటం పట్ల రెవెన్యూ అధికారులు గుర్రుగా ఉన్నారు.
గతంలో ఎసిబి అధికారులు ఎక్కడైనా అవకతవకలకు పాల్పడ్డారా? అవినీతి చర్యలకు పాల్పడ్డారా? అన్న విషయంపై దృష్టి సారించారు. నిజానికి ఎసిబి అధికారులు గతంలో అవినీతి అధికారులపై ఫిర్యాదులు వచ్చినప్పుడు డబ్బులు తీసుకుని వారిపై కేసులు పెట్టకుండా వదిలివేశారని కొందరు రెవెన్యూ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలకోసం వారు వెదుకుతున్నారు. ఎసిబి అధికారులను ఇరుకున పెట్టే విషయమై వారు ఈ చర్యలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. అయితే ఇవేమీ పట్టించుకోని ఎసిబి అధికారులు మద్యంషాపుల టెండర్లలో జరిగిన అక్రమాలపై మరింత లోతుగా వెళ్ళి విచారణ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/acb-v/s-revenue-in-khammam-district-24-13691.html
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా 4 వేల 500 కోట్లు రుణం సమీకరించనుంది. ఒక మిగిలిన రూ.2,845.12 కోట్లు హెచ్ఎండీఏ, టీజీఐఐసీ వంటి స్థానిక సంస్థల ద్వారా సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్తో పాటు మరో ముగ్గురికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
కూకట్పల్లి ప్రాంతంలోని రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, మెస్సులు, పీజీ హాస్టళ్లలో తెలంగాణ ఆహార నిత్యావసర ఔషధాల ప్రమాణాల ప్రాధికార సంస్థ (టీజీ సేఫ్) ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది.
తెలంగాణ సమాజం బెయిల్ ఇవ్వదు.. కేసీఆర్పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు..!
సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత సంఘాలు..!
హైదరాబాద్ రోడ్డుపై మరమరాలు అమ్ముకుంటున్న బీఆర్ఎస్ మాజీ సర్పంచ్..!
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పోస్టులు చేసిన పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్పై హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు.
మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ నేతలది దారుణమైన ప్రవర్తన..!
సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవమానకరమైన, అసభ్యకర మైన, ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన చేపట్టాయి. కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లటి దుస్తులు ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు.
కూకట్పల్లి పరిధిలో ఉన్న ప్రశాంత్నగర్ పారిశ్రామిక వాడలోని ABC ప్రింటింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని కోరుతూ షాద్నగర్ ఎమ్మెల్యే కె. శంకరయ్య చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు
తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.