మాజీ ఎంపి భూమా నాగిరెడ్డి అంటే కర్నూలుజిల్లా వాసులకు హడల్. ఆయనతో గొడవపెట్టుకోవడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. ఆళ్లగడ్డలో అయితే భూమానాగిరెడ్డి చెప్పినదే వేదం. అటువంటి భూమా నాగిరెడ్డిని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు బెంబేలెత్తిస్తున్నారు. కర్నూలుజిల్లాలో తమ పార్టీకి నాగిరెడ్డి కానీ, అతని అనుచరులు కానీ హాని తలపెడితే వారి అంటూ చోస్తానని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా నాగిరెడ్డి హత్యారాజకీయాలు, దౌర్జన్యాలు పేట్రేగిపోయాయని చంద్రబాబు అంటూ ఇకపై ఆయన ఆటలు సాగవని అన్నారు. సామాన్య కుటుంబానికి చెందిన నాగిరెడ్డి హత్యలు, భూకబ్జాలతో ఎదిగారని చంద్రబాబు విమర్శించారు. నిజానికి చిన్న రౌడీగా ఉన్న భూమానాగిరెడ్డికి రాజకీయ ఆశ్రయం కల్పించింది తెలుగుదేశంపార్టీయే.
ఆ పార్టీ అండదండలతో ఎదిగిన తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పార్టీలో ఉన్నప్పుడు భూమా నాగిరెడ్డి చేసిన అరాచకాలు చంద్రబాబు నాయుడుకు కనిపించలేదు. కానీ, ఆయన వేరే పార్టీకి వెళ్ళినప్పుడు మాత్రం నాగిరెడ్డి అరాచకాలు ఎత్తిచూపుతున్నారు. నిజానికి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బిక్కుబిక్కు మంటూ కాలంగడుపుతున్న తెలుగుదేశం తమ్ముళ్లలో ఆత్మస్థైర్యం నింపేందుకే చంద్రబాబు భూమా నాగిరెడ్డిపై విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-threatning-bhooma-nagi-reddy-24-13780.html
గజ్వేల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ..!
కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు కేసీఆర్ ఫాంహౌస్ను ముట్టడికి పిలుపు నిచ్చారు. ఆ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య దాదాపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నినాదాలతో సభ మార్మోగింది. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ పావుగంట సేపు వాయిదా వేశారు.
తాను స్పీకర్ ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడానంటూ వచ్చిన ఆరోపణలను తాతా మధు ఖండించారు. తాను స్పీకర్ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను అధికార కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని ఆరోపించారు.
ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో, సీఎం కార్యాలయం తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది.
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!